రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భారత రాష్ట్రపతి ఈస్టర్ శుభాకాంక్షలు

Posted On: 11 APR 2020 5:13PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈస్టర్ సందర్భంగా జాతికి శుభాకాంక్షలు తెలిపారు. వారి సందేశం:

 “భారత పౌరులందరికీ పవిత్ర ఈస్టర్ సందర్భంగా నా శుభాకాంక్షలు, ముఖ్యంగా దేశంలోని మరియు వివిధ దేశాల్లో నివసిస్తున్న భారత క్రిస్టియన్ పౌరులకు నా శుభాకాంక్షలు.

మనం ఈస్టర్ జరుపుకుంటున్న ఈ రోజున జీసస్ క్రీస్తు పునరుజ్జీవించిన రోజు. క్రిస్టియన్లకు ఎంతో పవిత్రమైన రోజు, ప్రేమ మార్గాన్ని, త్యాగాన్ని మరియు క్షమ లోకానికి చూపిన రోజు.  జీసస్ క్రీస్తు బోధనల నుంచి మానవాళి ఎంతో  మంచి నేర్చుకోవాలి.

మానవ సమాజానికి మంచి మనుగడకు ఐక్యత మరియు నిబద్ధతను ఈ పండుగ అందించుగాక. కొవిడ్-19పై పోరాడుతున్న ఈ పరీక్షా కాలంలో ఈ పవిత్ర పండుగను మన ఇళ్ళ వద్దే సామాజిక దూరాన్ని మరియు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ మన కుటుంబ సభ్యులతో జరుపుకుందాం”. 

హిందీలో సందేశం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి 

Click here to see President's message in Hindi



(Release ID: 1613358) Visitor Counter : 97