సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్ర‌ధాని కేర్స్ రిలీఫ్ ఫండ్ కు సిఎస్ ఓ ఐనుంచి రూ.25 ల‌క్ష‌ల విరాళం

Posted On: 04 APR 2020 6:44PM by PIB Hyderabad

క‌రోనా మ‌హ‌మ్మారిని నిరోధించ‌డానికి భార‌త‌దేశం పెద్ద యుద్ధ‌మే చేస్తోంది. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలో జ‌రుగుతున్న ఈ యుద్ధంలో ప్ర‌జ‌ల‌తోపాటు అనేక సంస్థ‌లు ఆయ‌న వెంట నిలిచాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని కేర్స్ రిలీఫ్ ఫండ్ కు సివిల్ స‌ర్వీసు అధికారుల సంస్థ ( సిఎస్ ఓ ఐ) రూ.25 ల‌క్ష‌ల విరాళ‌మిచ్చింది. సిఎస్ ఓ ఐ అధ్య‌క్షులు, కేబినెట్ సెక్ర‌ట‌రీ శ్రీ రాజీవ్‌ గౌబా మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో స‌భ్యులంతా క‌లిసి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విరాళాన్ని కోవిడ్ -19 మ‌హ‌మ్మారి బారిన ప‌డిన‌వారిని కాపాడేందుకు ఉప‌యోగిస్తారు. 


 



(Release ID: 1611181) Visitor Counter : 129