మంత్రిమండలి

బేస్ ఈరోజన్, లాభాల తరలింపు నిరోధానికి పన్ను ఒడంబడిక సంబంధిత చర్యల అమ‌లు కై బ‌హుముఖీన పన్ను ఒప్పందం యొక్క ధ్రువీకరణ

Posted On: 12 JUN 2019 8:04PM by PIB Hyderabad

బేస్ ఈరోజన్ మరియు ప్రాఫిట్ శిఫ్టింగ్ లను నివారించే పన్ను ఒడంబడిక అమలు కు సంబంధించిన చర్యల అమలుకు ఉద్దేశించినటువంటి ఒక బహుముఖీన ఒప్పందం (ఎంఎల్ఐ) అమలు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 

ప్రభావం:

వివిధ దేశాల తో పన్ను ఒప్పందాల ను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాని కి ఆదాయం నష్టం కలిగిస్తున్న భారతదేశాని కి చెందిన ఒప్పందాలు అన్నింటి ని ఈ ఒడంబడిక సవరిస్తుంది.  తద్వారా బేస్ ఈరోజన్, లాభాల తరలింపు వ్యూహాలకు అడ్డుకట్ట వేసి, ఎక్కడైతే ఆర్థిక  కార్యకలాపాలు నిర్వహించి లాభాలు ఆర్జిస్తున్నారో, విలువ జోడించుకుంటున్నారో, అక్కడే పన్నుల ను విధించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

వివరాలు:

i.   పన్ను ఒప్పందాల కు సంబంధించిన చర్యల ను పటిష్ఠం గా అమలుపరచడం ద్వారా బేస్ ఈరోజన్, లాభాల తరలింపు చర్యల ను నిలువరించే బహుముఖీన ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది.  2017 జూన్ 7వ తేదీన గౌరవనీయుడైన ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ప్యారిస్ లో దీని పై భారతదేశం తరఫున సంతకం చేశారు.
ii.  బేస్ ఈరోజన్, ప్రాఫిట్ శిఫ్టింగ్ (‘‘బిఇపిఎస్ ప్రాజెక్టు’’) చర్యల నిరోధానికి ఒఇసిడి/  జి20 దేశాలు చేపట్టిన చర్యల కు అనుగుణం గా ఈ బహుముఖీన ఒప్పందం కుదిరింది.  వివిధ దేశాల్లో అమలులో ఉన్న పన్ను నిబంధనల లో లోటుపాటుల ను, తేడాల ను ఉపయోగించుకుని అసలు పన్నుభారం లేని, లేదా తక్కువ పన్ను భారం ఉన్న దేశాల కు లాభాల తరలింపు నకు అనుసరించే పన్ను ప్రణాళికల వ్యూహాన్నే బిఇపిఎస్ గా వ్యవహరిస్తారు.  ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు లేని, లేదా స్వల్పం గా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే దేశాల కు లాభాల తరలింపు వల్ల అసలు పన్నులే చెల్లించవలసిన అవసరం లేకపోవడం లేదా స్వల్ప మొత్తంలోనే పన్నులు చెల్లించడం జరుగుతోంది. సమగ్ర దృక్పథం తో బేస్ ఈరోజన్, లాభాల తరలింపు చర్యల ను నిరోధించగల 15 కార్యాచరణల కు బిఇపిఎస్ ప్రాజెక్టు గుర్తించింది.   
iii.  జి20, ఒఇసిడి దేశాలు, బిఇపిఎస్ అసోసియేట్ లు, ఇతర ఆసక్తి గల దేశాలకు భాగస్వామ్యం గల 100కి పైగా దేశాల అడ్ హాక్ బృందం లో భారతదేశం కూడా భాగస్వామి గా ఉంది.  2015 నుండి  కృషి చేసిన ఈ సంస్థ బహుముఖీన ఒప్పందం ప్రతి ని తయారుచేసింది.  2016వ సంవత్సరం నవంబర్ 24వ తేదీ న ఈ అడ్ హాక్ బృందం బహుముఖీన ఒప్పందం ముసాయిదా ను, అందుకు సంబంధించిన వివరణ పత్రాల ను ఆమోదించింది.    
iv.  కార్యాచరణ 6 కింద ఒప్పందాల ను దుర్వినియోగం చేయడాన్ని నిలువరించేందుకు కనీస ప్రమాణాల రూపకల్పన తో సహా బిఇపిఎస్ ప్యాకేజి లో భాగమైన పన్ను సంబంధిత కనీస ప్రమాణాల కు సంతకాలు చేసిన దేశాలన్నీ కట్టుబడేందుకు ఈ బహుముఖీన ఒప్పందం దోహదకారి అవుతుంది.
v.  ఈ బహుముఖీన ఒప్పందం లో భాగస్వాములైన రెండు లేదా అంతకు మించిన దేశాల మధ్య పన్ను ఒప్పందాల సవరణ కు ఇది అనుమతిస్తుంది.  ఇప్పటికే అమలు లో ఉన్న ఒక ఒప్పందం లో సవరణల కు సంబంధించిన ప్రొటోకాల్ వర్తించే ధోరణి లో అన్నింటికీ ఇది వర్తించదు.  అందుకు భిన్నం గా వర్తమాన పన్ను ఒప్పందాల తో పాటు బిఇపిఎస్ చర్యల కు అనుగుణంగా వివిధ ఆచరణీయ అంశాల ను సవరించేందుకు ఇది దోహదకారి అవుతుంది.     
vi.  పన్ను ఒప్పందాల దుర్వినియోగం ద్వారా ఆదాయ నష్టాన్ని నిలువరించడం, బేస్ ఈరోజన్, లాభాల తరలింపు వ్యూహాల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న లేదా విలువ జోడించుకుంటున్న ప్రదేశాల వద్ద పన్ను ఎగవేయడం వంటి చర్యల ను నిరోధించేందుకు భారతదేశం ఒప్పందాల ను సవరించుకునేందుకు ఈ బహుముఖీన ఒప్పందం సహాయకారి అవుతుంది.
 
పూర్వరంగం:

ఒఇసిడి/  జి 20 దేశాలు చేపట్టిన ప్రాజెక్టు సాధించిన ప్రయోజనాల లో ఈ ఒప్పందం కూడా ఒకటి.  ఈ ఒప్పందం లో భాగస్వామి కావడం ద్వారా భారతదేశం బేస్ ఈరోజన్, లాభాల తరలింపు ప్రయత్నాల ను సమర్థం గా నిలువరించగలుగుతుంది.  బిఇపిఎస్ ఫలితాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి వీలుగా పన్ను ఒప్పందాలను సవరించుకునేందుకు భాగస్వామ్య దేశాలకు ఈ ఒప్పందం స్వేచ్ఛ ను కల్పిస్తుంది.  దీని వల్ల ద్వైపాక్షికం గా ఒప్పందాల కోసం మళ్లీ మళ్లీ చర్చలను నిర్వహించాల్సిన పని లేకుండానే బహుముఖీన మార్గం లో సమస్య పరిష్కారానికి కృషి చేసే వీలు కలుగుతుంది.  ఇటువంటి ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల అదనపు భారమే కాకుండా కాలయాపన కూడా జరుగుతోంది.  బహుముఖీన ధోరణి లో బిఇపిఎస్ ప్రాజెక్టు అమలుపరచడం లో నిలకడ ను, స్థిరత్వాన్ని కల్పిస్తుంది.  బిఇపిఎస్ ప్రయోజనాల పరిధి లో ప్రస్తుత పన్ను ఒప్పందాల ను సవరించుకోవడానికి బహుముఖీన ఒప్పందం దోహదపడుతుంది.  ఎంఎల్ఐ ని ధ్రువీకరించాలని కోరుతూ 2019 ఏప్రిల్ 26వ తేదీన కేబినెట్ నోట్ ను పంపారు.  అయితే దానికి గల అత్యవసర ప్రాధాన్యం దృష్ట్యా మాన్య  ప్రధాన మంత్రి కేబినెట్ సచివాలయం ఐ.డి. నంబర్ 216/1/2/2019-Cab ద్వారా 2019 మే 27న దానికి ఆమోదం తెలిపారు.  అయితే భారత ప్రభుత్వ (కార్యకలాపాల నిర్వహణ) నిబంధనలు 1961, నిబంధన 12 కింద తుది ఆమోదం కోసం నెల రోజుల లోపు మంత్రివర్గ పరిశీలన కు నివేదించడం తప్పనిసరి అయింది.  ఆ నిబంధన కు అనుగుణం గా,  ఎంఇఎ లోని ఎల్ & టి డివిజన్ కు ఒక ప్రత్యేక అభ్యర్థన ఈసరికే పంపడమైంది.  దీని ద్వారా భారత రాష్ట్రపతి కార్యాలయం నుండి ధ్రువీకరణ ను పొందేందుకు మార్గం సుగమం అవుతుంది.  ఇందుకుగాను 2019 మే 31 తేదీ తో కూడిన ఒఎమ్  ఎఫ్. నం. 500/71/2015-FTD-I/150 ను పరిశీలించవచ్చు. 


**
 



(Release ID: 1574483) Visitor Counter : 76