ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ పరిధిలో 17 జిల్లాల మీదుగా అయిదు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్


సుమారు 540 కిమీ మేర భారత రైల్వే పరిధి పెంపు

ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.10,021 కోట్లు… 2029-30 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికల రూపకల్పన

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 3:33PM by PIB Hyderabad

సుమారు రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించి అయిదు నూతన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏఆమోదం తెలిపిందిఆ ప్రాజెక్టుల వివరాలు:

అరక్కోణంరేణిగుంట 3, 4వ లైన్ - 77 కిలోమీటర్లు

 

బివైట్ ఫీల్డ్బంగారుపేట 3, 4వ లైన్ - 47 కిలోమీటర్లు

 

సీహోసూర్ఒమలూర్ డబ్లింగ్ (రెండు లైన్ల నిర్మాణం) - 147 కిలోమీటర్లు

 

డీసేలంకరూర్దిండిగల్ డబ్లింగ్ - 159 కిలోమీటర్లు

 

సికింద్రాబాద్ మల్టీ ట్రాకింగ్ (ఘటకేసర్) - కాజీపేట్ -110 కిలోమీటర్లు

 

రైలు మార్గాల సామర్థ్యం పెరగటం వల్ల రవాణా సౌలభ్యం మెరుగవుతుందిదీనివల్ల భారత రైల్వేల నిర్వహణ సామర్థ్యంసేవలపై విశ్వాసం పెరుగుతాయికార్యకలాపాల క్రమబద్ధీకరణకురద్దీని తగ్గించేందుకు ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు సహాయపడతాయిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలలుగన్న న్యూ ఇండియాకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులున్నాయిసమగ్రాభివృద్ధి ద్వారా ఆ ప్రాంత ప్రజలు "ఆత్మనిర్భర్ను సాధించటంతో పాటు స్థానికంగా ఉపాధిస్వయం ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

 

పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. సమగ్ర ప్రణాళికభాగస్వాముల సంప్రదింపుల ద్వారా మల్టీ మోడల్ అనుసంధానతనురవాణా సామర్థ్యాన్ని పెంపొందించటం ఈ ప్రాజెక్టుల ఉద్దేశంప్రజలుసరకులుసేవల రవాణాకు అంతరాయం లేని అనుసంధానతను ఇవి అందిస్తాయి.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కర్ణాటకతెలంగాణలోని 17 జిల్లాల మీదుగా వెళ్లే ఈ అయిదు ప్రాజెక్టులు భారత రైల్వే పరిధిని దాదాపు 540 కిలోమీటర్ల మేర పెంచుతాయిఆమోదం పొందిన ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 52 లక్షల జనాభా గల దాదాపు 2,121 గ్రామాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి.

 

ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టుల సామర్థ్యం ద్వారా తిరుపతిసుబ్రమణ్యస్వామి ఆలయం (తిరుత్తణి), శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (తిరుచానూరు), కోటిలింగేశ్వర దేవాలయంశ్రీ సీతి భైరవేశ్వర స్వామి ఆలయంబంగారు తిరుపతికోలార్ బంగారు గనులుహోగెనక్కల్ జలపాతంహోసూర్ కోటమెట్టూర్ డ్యామ్కొడైకెనాల్ కొండలుసత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యంనమక్కల్ ఆంజనేయర్ ఆలయంనమక్కల్ కోటకళ్యాణ పశుపతేశ్వర ఆలయంయాదగిరిగుట్ట ఆలయంభువనగిరి కోటసురేంద్రపురిస్వర్ణగిరి ఆలయం వంటి దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు అనుసంధానం మెరుగవుతుంది.

బొగ్గుసిమెంట్ఇనుముఉక్కుకంటైనర్లుఆటోమొబైల్స్ఆహారధాన్యాలుపెట్రోలియం ఉత్పత్తులుఎరువులు వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు కీలక మార్గాలుఈ పెంపుదల ద్వారా ఏటా అదనంగా 47 ఎంటీపీఏ ఏడాదికి మిలియన్ టన్నులసరకు రవాణా సాధ్యమవుతుందిపర్యావరణహితశక్తి సామర్థ్యాలు గల రవాణా వ్యవస్థ రైల్వేలుదేశ వాతావరణ లక్ష్యాలను చేరుకోవటంలోరవాణా ఖర్చులను తగ్గించటంలో ఇవి ఉపయోగపడతాయిఇవి చమురు దిగుమతి (సుమారు కోట్ల లీటర్ల)ని తగ్గించికర్బన ఉద్గారాల (సుమారు 42 కోట్ల కిలోలవిడుదలను తగ్గిస్తాయిఇది సుమారు కోట్ల మొక్కలు నాటటంతో సమానం.

 

***


(రిలీజ్ ఐడి: 2308327) సందర్శకుల సూచీ సంఖ్య : : 47
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam