ప్రధాన మంత్రి కార్యాలయం
నార్వే రాజు అయిదో హెరాల్డ్ కన్నుమూత ప్రధానమంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2026 4:33PM by PIB Hyderabad
నార్వే రాజు అయిదో హెరాల్డ్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ సంవత్సరం మొదట్లో నార్వేలో తాను పర్యటించినప్పుడు రాజుతో భేటీ కావడాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన కనబరిచిన ప్రేమను, నార్వే ప్రజల పట్ల, నార్వే పట్ల ఆయనకు ఉన్న గొప్ప సేవాభావనను కూడా శ్రీ మోదీ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు..:
‘‘నార్వే రాజు అయిదో హెరాల్డ్ ఇక లేరని తెలిసి ఎంతో చింతించాను.
ఈ ఏడాది మొదట్లో నార్వేలో నేను పర్యటించిన కాలంలో, రాజు గారితో భేటీ నాకింకా ఎంతో బాగా గుర్తుంది. దేశం పట్ల ఆయనకున్న ప్రేమ, సేవాభావం నన్నెంతో ప్రభావితం చేశాయి.
రాజ కుటుంబానికి, నార్వే ప్రజలకి సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’.
(రిలీజ్ ఐడి: 2304413)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam