ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్లోని లఖిసరాయ్లో జరిగిన దుర్ఘటన బాధితులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్–గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 AUG 2026 3:11PM by PIB Hyderabad
బీహార్లోని లఖిసరాయ్లో జరిగిన విషాద ఘటన బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్–గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని అందజేస్తామని పీఎం తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘బీహార్లో లఖిసరాయ్లో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్–గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందుతుంది.’’
(रिलीज़ आईडी: 2300454)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam