జాతీయ మానవ హక్కుల కమిషన్
సీఆర్పీఎఫ్ అధికారిక గణాంకాల ప్రకారం.. జనవరి నుంచి మే 2026 మధ్య కాలంలో 19 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించినట్లు వచ్చిన వార్తలపై సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
నివేదికల ప్రకారం.. 2025లో సీఆర్పీఎఫ్ సిబ్బందిలో అత్యధికంగా 59 ఆత్మహత్యలు
ఈ అంశంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కోరుతూ హోం మంత్రిత్వ శాఖ, హోం కార్యదర్శి, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు కమిషన్ నోటీసులు
प्रविष्टि तिथि:
14 AUG 2026 12:45PM by PIB Hyderabad
జనవరి నుంచి మే 22, 2026 మధ్య అయిదు నెలల కన్నా తక్కువ వ్యవధిలోనే 19 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బంది ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు వచ్చిన మీడియా కథనాన్ని భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. సీఆర్పీఎఫ్ గణాంకాల ప్రకారం... 2025లో ఆత్మహత్యల కారణంగా 59 మంది సిబ్బందిని ఈ దళం కోల్పోయింది. నివేదికల ప్రకారం... గత అయిదేళ్లలో నమోదైన ఆత్మహత్యల్లో ఇదే అత్యధికం.
కమిషన్ పరిశీలన ప్రకారం... ఆ వార్తా కథనంలోని అంశాలు నిజమైతే, దేశంలోని అతిపెద్ద కేంద్ర సాయుధ పోలీసు దళంలో పనిచేస్తున్న సిబ్బంది జీవించే హక్కు ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కమిషన్ భావించింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.
మీడియా నివేదిక ప్రకారం.. ఆగస్టు 11, 2026 నాటికి గడిచిన అయిదేళ్లలో మొత్తం 281 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆత్మహత్య చేసుకుని మరణించారు. వీరిలో దాదాపు 216 మంది విధుల్లో ఉన్నవారు. సీఆర్పీఎఫ్ విభాగంలో 2021లో 57, 2022లో 43, 2023లో 57, 2024లో 46, 2025లో 59 ఆత్మహత్యలు నమోదయ్యాయి.
****
(रिलीज़ आईडी: 2299376)
आगंतुक पटल : 6