రాష్ట్రపతి సచివాలయం
పీబీజీ సోల్జర్థాన్ను ప్రారంభించిన భారత రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
02 AUG 2026 1:56PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో, మిజోరాం గవర్నర్ జనరల్ డాక్టర్ వి.కె. సింగ్ (రిటైర్డ్) సమక్షంలో పీబీజీ (ప్రెసిడెంట్స్ బాడీగార్డ్స్) సోల్జర్థాన్ను వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె ప్రత్యేక పోస్టల్ కవర్నూ విడుదల చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈ పోటీ జరిగింది.
'సైనికుల కోసం పరుగెత్తండి, సైనికులతో కలిసి పరుగెత్తండి' అనే దార్శనికతతో... పౌరులకు, సాయుధ దళాలకు మధ్య బంధాన్ని బలోపేతం చేసే ఒక విశిష్ట వేదికగా ఈ సోల్జర్థాన్ నిలుస్తుంది. 'నిజమైన వీరులకు మద్దతు – భారత సాయుధ దళాలు' ఇతివృత్తం ఆధారితమైన ఈ కార్యక్రమం... మన సైనికుల అంకితభావం, ధైర్యం, త్యాగాలకు నివాళులర్పిస్తూ, చురుకైన భాగస్వామ్యం ద్వారా వారికి సంఘీభావాన్ని ప్రకటించేలా పౌరులను ప్రోత్సహిస్తుంది.
సోల్జర్థాన్ రేసులను 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లతో మూడు విభాగాల్లో నిర్వహిస్తారు. సోల్జర్థాన్ ద్వారా సమకూరే ఆదాయాన్ని ప్లారాప్లెజిక్ సైనికులకు చికిత్సనందించే పునరావాస కేంద్రం, యుద్ధంలో గాయపడిన సైనికుల పిల్లల సంక్షేమం మొదలైన సహాయక కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. పీబీజీ సోల్జరథాన్ ముఖ్యోద్దేశం పీబీజీకి చెందిన గుర్రాలకు, దళాలకు అవసరమైన సహాయం అందించడం.
***
(रिलीज़ आईडी: 2293538)
आगंतुक पटल : 7