ప్రధాన మంత్రి కార్యాలయం
పురుషుల 55 కేజీల బాక్సింగ్లో రజత పతకం గెలుచుకున్న
జాదుమణి సింగ్ మందెంగ్బామ్ను అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 AUG 2026 12:52AM by PIB Hyderabad
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు-2026 పురుషుల 55 కేజీల బాక్సింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న జాదుమణి సింగ్ మందెంగ్బామ్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
జాదుమణి సింగ్ మందెంగ్బామ్ విజయం ఆయన ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు.
ఆయన భవిష్యత్ ప్రయత్నాల కోసం శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 55 కేజీల బాక్సింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న జాదుమణి సింగ్ మందెంగ్బామ్కు అభినందనలు. అతని ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదలే ఈ విజయానికి కారణం. అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.
****************
MJPS/SS/ST
(रिलीज़ आईडी: 2293239)
आगंतुक पटल : 3