సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహకార మంత్రిత్వశాఖ అయిదో వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వాన సహకార మంత్రిత్వ శాఖ ఐదేళ్లుగా సహకార రంగంలోని 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో నవ్యోత్తేజం నింపింది”

“సహకార రంగంలో కీలక సమస్యల గుర్తింపు ద్వారా ఆ సంస్థల అభివృద్ధి.. పరిష్కారం దిశగా ఓ భవిష్య ప్రణాళికను మంత్రిత్వశాఖ సిద్ధం చేయడంతోపాటు ఈ రంగాన్ని ఆధునిక.. పారదర్శక.. సాంకేతికాధారిత పోటీతత్వ వ్యవస్థగా మార్చింది”

“దేశం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి సుసంపన్న భారత్‌కు సహకారోద్యమం బలమైన పునాదిగా నిలుస్తుంది”

“వ్యవసాయం.. పాడి.. బ్యాంకింగ్.. లాజిస్టిక్స్.. రవాణా తదితర రంగాల ఏకీకరణకు దేశవ్యాప్త సహకార సంస్థల నెట్‌వర్క్‌ ఏర్పాటు సహా 32 కోట్ల మందికి పైగా సభ్యులతో డిజిటల్ సహకార సమాచార నిధిని రూపొందించింది”

“దేశంలో 9 జాతీయ సహకార సంఘాల ఏర్పాటుతో ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఏకీకృత చట్రంలోకి తెచ్చి గ్రామ స్థాయికి దాని పరిధిని విస్తరించిన నేపథ్యంలో మరో దశాబ్దానికల్లా ఈ సంస్థలు ప్రపంచంలో అతిపెద్ద సంఘాలుగా రూపొందడం తథ్యం”

“సహకార నమూనా ద్వారా ప్రపంచ మార్కెట్లతో రైతు ఉత్పత్తుల సంధానించడం సహా విత్తనోత్పత్తిలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం”

“భారత్ బీజ్ సహకారి సమితి లిమిటెడ్’ (బీబీఎస్‌ఎస్‌ఎల్‌) మరో మూడేళ్లలో దేశంలోనే అతిపెద్ద విత్తనోత్పత్తి సంస్థగా ఆవిర్భవిస్తుంది... తద్వారా ప్రతి రాష్ట్రంలో కొత్త యూనిట్ల ఏర్పాటుతో రైతులకు నాణ్యమైన.. మెరుగైన విత్తనాలు లభిస్తాయి”

“గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వేగిరపరచేలా సేంద్రియ వ్యవసాయం.. వర్తుల ఆర్థిక వ్యవస్థ.. పశువ్యర్థాల నిర్వహణ.. సేంద్రియ ఎరువులు.. విద్యుదుత్పత్తి తదితరాలను సహకార నమూనాతో అనుసంధానిస్తున్నాం”

“సహకార రంగంలో ప్రతి విభాగం కోసం త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం నిపుణులను తీర్చిదిద్ది ‘పీఏసీఎస్‌’ల స్థాయి నుంచి వృత్తి నైపుణ్యాన్ని అలవరుస్తుంది”

प्रविष्टि तिथि: 06 JUL 2026 6:48PM by PIB Hyderabad

సహకార శాఖ 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారుకేంద్ర మత్స్యపశుసంవర్ధక-పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మకేంద్ర సహకార శాఖ సహాయ మంత్రులు శ్రీ కృష్ణ పాల్ గుర్జర్శ్రీ మురళీధర్ మోహోల్రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్సహకార శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీ ఆశిష్ కుమార్ భూటానివ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ అతిష్ చంద్రపశుసంవర్ధక-పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి శ్రీ నరేష్ పాల్ గంగ్వార్‌ సహా పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుఅంతేకాకుండా జాతీయ సహకార సంస్థలుసమాఖ్యలుబ్యాంకులుపాడి సంఘాలుభారత్ టాక్సీప్యాక్స్ (పీఏసీఎస్‌)లు సహా సహకార రంగంలోని ఇతర భాగస్వాములు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూఇది మనందరికీ అత్యంత శుభప్రదమైన రోజని చెప్పారుదేశంలో సహకార రంగంతో ముడిపడిన 32 కోట్ల మంది సభ్యులు, 8.50 లక్షలకు పైగా సహకార సంస్థల 75 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ సరిగ్గా ఐదేళ్ల కిందట ముగిసిందిసరిగ్గా ఇదే రోజున కేంద్రంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారుఅంతకుముందు 75 ఏళ్లపాటు నిర్లక్ష్యానికిద్వితీయ శ్రేణి పక్షపాత ధోరణికి గురైన దేశ సహకార ఉద్యమాన్ని ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సమున్నత శిఖరాలకు చేర్చిందని ఆయన పేర్కొన్నారుసహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో శ్రీ మోదీ సహకార రంగానికి నవ్యోత్తేజమిచ్చారని తెలిపారు.

తమ పార్టీ లేదా కూటమికి పాలన బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినప్పుడల్లా గ్రామీణాభివృద్ధికివ్యవసాయానికి సంబంధించిన రంగాలన్నిటికీ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చామని శ్రీ అమిత్‌ షా తెలిపారుఅటల్ జీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన వ్యవహారాల శాఖను ఏర్పాటు చేశారని ఆయన గుర్తుచేశారుఅటుపైన 2019లో జల నిర్వహణ సమగ్రత రీత్యా శ్రీ మోదీ ‘జలశక్తి’ శాఖను ఏర్పాటు చేశారని తెలిపారుఅదే ఏడాదిలో మత్స్య శాఖను సృష్టించడంతోపాటు పశుసంవర్ధక-పాడి పరిశ్రమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారుఅలాగే 2021లో సహకార శాఖ సృష్టి ద్వారా వ్యవసాయగ్రామీణాభివృద్ధి రంగంలో శ్రీ మోదీ విప్లవాత్మక చర్య తీసుకున్నారని తెలిపారు.

ఐదేళ్ల కిందట సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన వేళ భారత రాజ్యాంగంలో ‘సహకారం’ రాష్ట్రాల పరిధిలోని అంశమని శ్రీ అమిత్‌ షా గుర్తుచేశారుఅయితేసహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల పనితీరులో కేంద్ర ప్రభుత్వ జోక్యం పెరిగిపోతుందనే అపోహలు పెద్ద ఎత్తున వినవచ్చాయని పేర్కొన్నారుకానీగడచిన ఐదేళ్లలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలోగల రాష్ట్రాలు కూడా కేంద్ర సహకార శాఖపై ఎన్నడూ ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడమే తమకు లభించిన అతిపెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారుసహకార వ్యవస్థపై అవగాహన ఉన్నవారికి ఇందులో కేంద్ర ప్రభుత్వ జోక్యానికి తావుండదనే వాస్తవం తెలుసునని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారుఅందరితో సమష్టిగాసహకార ధోరణితో ముందడుగు వేయడంఅందరి శక్తులను నిరంతరం ఏకీకృతం చేయడమే సహకార వ్యవస్థ అసలు స్వభావమని ఆయన వివరించారుఏరాష్ట్రాల పనితీరులో జోక్యం చేసుకోవడం కాకుండావాటికి చేయూతనిస్తూ విధాన రూపకల్పనలో సహకరించడంవాటి ప్రగతికి తోడ్పడటమే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు ఉద్దేశమని గత ఐదేళ్లలో నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారుఆ మేరకు ప్రతికూల దృక్పథం గల వారి అంచనాలను వమ్ము చేస్తూ సహకార మంత్రిత్వశాఖ అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.

ఈ ఐదేళ్లలో సహకార రంగంలోని అనేక సమస్యలను గుర్తించివాటికి అవకాశాలను పెంచామని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారుఆ విధంగా రాష్ట్రాలకు భవిష్యత్తు ఆధారిత విధానాలను నిర్దేశించామన్నారుఈ ఐదేళ్ల కాలం తమ శాఖకు ఓ స్వర్ణయుగమనిభారత సహకారోద్యమ చరిత్ర రాసేటపుడు ఈ కాలం కచ్చితంగా స్వర్ణాక్షరాలతో లిఖితమవుతుందని చెప్పారుప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌నుంచి అత్యున్నత స్థాయి సంస్థల దాకా.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లా స్థాయి సహకార సమాఖ్యల వరకూ... ప్రతి స్థాయిలోనూ విస్తృత సంప్రదింపులతో చేపట్టిన కార్యక్రమాలను ఆచరణాత్మక ఫలితాలుగా మార్చామని ఆయన వివరించారు.

లోగడ ఏకంగా 62 ఏళ్లపాటు సహకార రంగ సంబంధిత కార్యకలాపాలన్నీ కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని సంయుక్త కార్యదర్శి స్థాయిలోనే సాగాయని శ్రీ అమిత్‌ షా గుర్తుచేశారుఅయితేఇవాళ పూర్తి స్వతంత్ర సహకార శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలను, 8.30 లక్షల సహకార సంఘాలను ఏకతాటిపై నడిపిస్తూ ముందడుగు వేస్తున్నదని ఆయన అన్నారుగడచిన ఐదేళ్లలో అనేక విజయాలను సాధించడమేగాక సహకార వ్యవస్థను ఆధునికపారదర్శకసాంకేతికాధారితపోటీతత్వ వ్యవస్థగా తీర్చిదిద్దడానికి అవిరళ కృషి చేశామని చెప్పారుఇంతకుముందు సహకార వ్యవస్థ ప్రధానంగా ప్రాథమిక రంగాలకే పరిమితం కాగాతమ హయాంలో వ్యవసాయ రుణాలుపాడి పరిశ్రమఎరువుల పంపిణీగ్రామీణ సేవలను కూడా ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ స్థాయితో అనుసంధానించామని ఆయన గుర్తుచేశారుదీంతోపాటు సహకార విధానంతో ద్వితీయతృతీయ రంగాల అనుసంధానానికి చర్యలు కూడా చేపట్టామన్నారునిల్వఉత్పత్తిఎగుమతులుసేంద్రియ సాగుసంప్రదాయ విత్తనాల ఉత్పత్తిఅధిక దిగుబడినిచ్చే విత్తనాల రూపకల్పనడిజిటల్ సేవలుబ్యాంకింగ్రవాణాలాజిస్టిక్స్కాలుష్య రహిత ఇంధనం వంటి రంగాలన్నింటినీ ఐదేళ్లలో పరస్పరం అనుసంధానించామని ఆయన వివరించారుసహకార శాఖ చొరవ ఫలితంగా అనేక ఏళ్ల తర్వాత మొత్తం జాతీయ స్థాయి సహకార సంఘాలు (వీటిలో మూడు కొత్తవిఏర్పడ్డాయని తెలిపారువీటి ద్వారా తొమ్మిది వేర్వేరు రంగాల్లో జాతీయ స్థాయి నుంచి గ్రామం దాకా సహకార వ్యవస్థ అనుసంధానమైందని చెప్పారు. ‘ఇఫ్కోక్రిభ్‌కోఅమూల్‌ఎన్‌డీడీబీ’ వంటి సంస్థలు సహకారోద్యమానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయన్నారుఅంతర్జాతీయ స్థాయిలో అవి దేశానికి ఎంత గౌరవం సంపాదించి పెట్టిన తీరులోనే ఈ జాతీయ సహకార సంస్థలు కూడా భవిష్యత్తులో భారీ అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా ఎదుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సహకార మంత్రిత్వ శాఖ ఐదేళ్ల పాలనలో ప్రధాన మూలస్తంభాల కింద కార్యక్రమాలు చేపట్టామని శ్రీ అమిత్ షా చెప్పారుఈ మేరకు మొదటసంస్థాగత సంస్కరణలుసుపరిపాలనపారదర్శకతను బలోపేతం చేశాంఈ దిశగా సహకార రంగం కోసం సమీకృత సమాచార నిధిని సిద్ధం చేశాంతద్వారా ఇవాళ ప్రతి రాష్ట్రంలోని సహకార రిజిస్ట్రార్ వద్ద ఏ గ్రామంలో పీఏసీఎస్ లేదు.. ఎక్కడ పాడి సహకార సంఘం లేదు.. ఎక్కడ పట్టణ గృహ నిర్మాణ సంఘం లేదు.. వంటి సమాచారం అందుబాటులో ఉందిఈ లోపాలన్నింటినీ ఇప్పుడు గుర్తించివాటి ప్రాతిపదికన సహకార రంగం ముందుకెళ్తోందిదీంతో 30 రంగాల్లోని 8,58,000 సహకార సంఘాలు, 32 కోట్ల మంది సభ్యులు ఇప్పుడు ఒకే డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నారని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారుఅన్ని సహకార సంఘాల ఆడిట్ స్థితిటర్నోవర్ఏబీసీ గ్రేడింగ్ వగైరాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయన్నారురాష్ట్ర సహకార రిజిస్ట్రార్లు ఈ సమాచార నిధి ద్వారా గ్రామీణ స్థాయిలోని డెయిరీలు, ‘పీఏసీఎస్‌’లు సహా సొసైటీలుజిల్లా సహకార బ్యాంకులురాష్ట్ర డెయిరీలను ఉన్నతీకరించే వీలుందన్నారుఅలాగేప్రస్తుత లోపాలను సరిచేసే అవకాశం కూడా ఉందన్నారుఈ ఏడాది సహకార సంస్థల కోసం ఒక ర్యాంకింగ్ చట్రాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారుదీనిద్వారా ప్రతి రంగంలో అద్భుతంగా పనిచేస్తున్న తొలి సహకార సంఘాలను గుర్తించి ర్యాంకులివ్వడం ద్వారా ఇతర సంస్థలకు స్ఫూర్తినిచ్చేలా వాటి ఆదర్శప్రాయ పనితీరును అందరూ ప్రముఖంగా ప్రస్తావిస్తారనివాటికి మరింత ప్రోత్సాహం కూడా లభిస్తుందని ఆయన తెలిపారు.

దేశంలో సహకార వ్యవస్థ మొత్తాన్నీ మరింత పారదర్శకంప్రజాస్వామ్యయుతంగా మార్చే దిశగా బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం-2002కు 50 దాకా కీలక సవరణలు చేశామని కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా వెల్లడించారుఈ సంస్థలపై అధ్యయనం సందర్భంగావాటి నాయకత్వం సహకార రంగంతో ముడిపడిన వ్యక్తుల చేతుల్లోనే ఉన్నప్పటికీ వాటి పరిపాలనలావాదేవీలు వృత్తిగత నైపుణ్యంతో సాగుతున్నట్లు వెల్లడైందని ఆయన తెలిపారుఈ విజయవంతమైన నమూనాను అనుసరించడంలో భాగంగానే త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించామని చెప్పారుసహకార రంగంలో నాయకత్వంసంస్థాగత స్థిరత్వమే సదా ప్రశ్నార్థకంగా ఉంటున్నాయని ఆయన తెలిపారుఅందుకేఇఫ్కోక్రిభ్‌కోఅమూల్ వంటి విజయవంతమైన సహకార నమూనాలపై లోతైన అధ్యయనం నిర్వహించామని చెప్పారువివిధ రాష్ట్రాల్లోని పాడి సహకార సంఘాలు విజయం సాధిచిన తీరుతోపాటు జాతీయ పాడి అభివృద్ధి మండలి ఇంత అద్భుతంగా పని చేయడంలోని వాస్తవాలను ఆయన వివరించారుఈ నేపథ్యంలో బ్యాంకింగ్పాడిమార్కెటింగ్వ్యవసాయంఎరువులుఇతర సహకార రంగాల కోసం సుశిక్షిత నిపుణులను త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం తయారు చేస్తుందన్నారువీరిని యోగ్యతల ఆధారంగా నియమించడం ద్వారా ప్రాథమిక సహకార సంఘాల నుంచి అత్యున్నత సంస్థల దాకా దశలవారీగా వృత్తిపరమైన నిర్వహణను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని చెప్పారుతద్వారా నియామకాలలో పారదర్శకత పెరిగిసామర్థ్యం మెరుగుపడటంతోపాటు నియామకాల్లో అవినీతికి సమర్థంగా అడ్డుకట్ట వేయగలమని వివరించారునియామకాలలో అవినీతిని రూపుమాపితే సహకార రంగంపై ప్రజల విశ్వాసం ఇనుమడిస్తుందని శ్రీ అమిత్‌ షా స్పష్టం చేశారు.

పీఏసీఎస్‌ల బలోపేతం తాము తీసుకున్న రెండో చర్య అని శ్రీ అమిత్ షా అన్నారు. ‘‘ఒకప్పుడు పీఏసీఎస్‌లు అనేక రకాల కార్యకలాపాలు నిర్వహించేవిక్రమంగా అవి స్థిర వడ్డీ రేట్లకు డబ్బును అప్పుగా ఇవ్వడంవసూలు చేయడానికే పరిమితమయ్యాయిదీనివల్ల వాటి లాభాలు తగ్గిపోయాయిమేం పీఏసీఎస్‌ల కోసం నమూనా ఉప-నిబంధనలను రూపొందించాంబెంగాల్‌ సహా యావత్ దేశం ఈ నమూనా ఉప-నిబంధనలను ఆమోదించిందిదేశవ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్‌లు ఇప్పుడు ఒకే నమూనా ఉప-నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయిఈ రోజు, 55,000 పీఏసీఎస్‌లు సీఎస్‌సీల ద్వారా గ్రామస్తులకు 300కు పైగా సేవలను అందిస్తున్నాయిరైల్వే టిక్కెట్లు బుక్ చేయడంజనన-మరణ నమోదులుప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు దాఖలు చేయడంచెల్లింపులు స్వీకరించడం వీటి ద్వారానే జరుగుతోందిఈ విధంగామేం 55,000 పీఏసీఎస్‌ల ద్వారా 300 విభిన్న కార్యకలాపాలతో సీఎస్‌సీ సేవలను అందిస్తున్నాం. 39,000 పీఏసీఎస్‌లు కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మారాయి. 600కు పైగా పీఏసీఎస్‌లు జన ఔషధి కేంద్రాలుగా మారాయి. 75 పీఏసీఎస్‌లు పెట్రోల్డీజిల్ రిటైల్ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నాయి. 118 పీఏసీఎస్‌లు నీటి సరఫరా పథకాలను నిర్వహిస్తున్నాయి’’ అని కేంద్ర మంత్రి వివరించారుపీఏసీఎస్‌లను కంప్యూటరీకరించడానికి భారత ప్రభుత్వం రూ. 3,000 కోట్లు ఖర్చు చేసిందని శ్రీ షా తెలిపారుఈ రోజు 50,000 పీఏసీఎస్‌లను ఇ-పీఏసీఎస్‌లుగా ప్రకటించడంవాటి మొత్తం కార్యకలాపాలను ఎలక్ట్రానిక్‌ విధానంలో నిర్వహించడం గొప్ప విజయమని ఆయన అన్నారు-పీఏసీఎస్‌ల ఆవిర్భావంతో-ఆడిట్ భావన అమలు జరిగిందిజారీ చేసిన అలర్ట్‌లను పీఏసీఎస్ సమావేశాల్లో ఉంచడం ద్వారా పీఏసీఎస్‌ల మొత్తం పనితీరు పారదర్శకంగా మారుతుంది.

సహకార రంగంలో రుణ ప్రవాహాన్ని పెంచడం తాము చేపట్టిన మూడో ప్రధాన కార్యక్రమమని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి తెలిపారుసహకార బ్యాంకులను ఆధునిక బ్యాంకింగ్ సేవలతో అనుసంధానించాండిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టాంసైబర్ భద్రతనూ కల్పించాం-కేవైసీని ప్రారంభించాండిజిటల్ రుణాల వంటి వ్యవస్థలతో మన పట్టణ సహకార బ్యాంకులుజిల్లా సహకార బ్యాంకులు క్రమంగా ముందుకు సాగుతున్నాయిగతంలో రూ. 19.6 లక్షల కోట్లుగా ఉన్న జిల్లా సహకార బ్యాంకుల మొత్తం వ్యాపార విలువ ప్రస్తుతం రూ. 25 లక్షల కోట్ల మార్కును దాటిందిఇది ఒక ప్రధాన విజయంగుజరాత్‌లో చేపట్టిన ‘సహకార సంఘాల మధ్య సహకారం’ ప్రయోగం కిందప్రతి సహకార సంఘం ఒక సహకార బ్యాంకులో ఖాతాను తెరిచిందని కేంద్ర మంత్రి వివరించారు.

గుజరాత్‌లో డెయిరీలుఏపీఎంసీలుపీఏసీఎస్‌లుఅన్ని రకాల సహకార సంఘాలు సహకార బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం వల్ల జిల్లా సహకార బ్యాంకుల డిపాజిట్లూ పెరిగాయని శ్రీ అమిత్ షా అన్నారుఈ ప్రయత్నాల వల్ల అనేక జిల్లా సహకార బ్యాంకులు లాభదాయకంగా మారాయిపట్టణ సహకార బ్యాంకుల నికర లాభం దాదాపు రెట్టింపు అయిందిగత అయిదేళ్లలోమేం ఈ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులను (స్థూల ఎన్‌పీఏ) 12.8 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించాంనికర ఎన్‌పీఏను 5.1 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గించడంలోనూ మేం విజయం సాధించాందీనివల్ల ప్రజల విశ్వాసం పెరిగిందిఈ కార్యకలాపాలన్నింటినీ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ముందుకు తీసుకెళ్లడం ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందిఎన్‌సీడీసీ నికర ఎన్‌పీఏ నామమాత్రంగా మారిందిప్రజలు ఏకమైనప్పుడు చాలా పెద్ద విజయాలు సాధించగలరనేది దేశ ప్రజలకు స్పష్టమైందిసహకారాన్ని విమర్శించే వారికీ ఇది ఒక స్పష్టమైన సమాధానం. 2047 ఆగస్టు 15న దేశం స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడుమన సహకార ఉద్యమం సుసంపన్న భారత్ కోసం బలమైన పునాదిగా నిలుస్తుందని శ్రీ షా అన్నారు.

సహకార రంగానికి మార్కెట్ అనుసంధానాలనూ తాము బలోపేతం చేశామని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారుఎగుమతులుసేంద్రీయ ఉత్పత్తుల కోసం మూడు కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేశాంపాడి పరిశ్రమకు సంబంధించి క్షేత్రస్థాయిలో 100 శాతం సర్క్యులర్ ఎకానమీ అమలు కోసం మరో మూడు సహకార సంఘాలనూ ఏర్పాటు చేశాంమేం ఉప్పు రంగంలోకీ ప్రవేశించాంగతంలో రైతు పండించిన పంటలు గ్రామం నుంచి స్థానిక మండీ వరకు ప్రయాణించేవిఇప్పుడుసహకారం ద్వారా రైతు పంటలు ప్రపంచం మొత్తానికీ చేరుతున్నాయివిత్తనోత్పత్తి కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘం మూడేళ్ల తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వేతర విత్తనోత్పత్తి సంస్థగా మారుతుందని ఆయన అన్నారుదీని ద్వారా రైతులకు స్వచ్ఛమైనకల్తీలేని విత్తనాలు లభిస్తాయిఇది అధిక ఉత్పత్తికి దోహదపడుతుందిఈ విధాన ప్రణాళికలో భాగంగానే భారతీయ విత్తనాల పరిరక్షణకూ మేం ఏర్పాట్లు చేశాంఅరటిబంగాళాదుంప రైతులకు సాంకేతికంగా అభివృద్ధి చెందిన విత్తనాలను అందించడానికిమా సహకార సంఘాలు ప్రతి రాష్ట్రంలో కొత్త యూనిట్లను ప్రారంభిస్తాయిఈ యూనిట్ల ద్వారా టిష్యూ కల్చర్ మొక్కలుఅధిక దిగుబడినిచ్చేఒకే పరిమాణంలో ఉండే బంగాళాదుంపలనందించే వంగడాలు రైతులకు చేరుతాయిప్రపంచ చిప్స్ వ్యాపారాన్ని భారత్‌కు తీసుకురావడానికి ఇది సహాయపడుతుందిఈ దిశగా గుజరాత్‌లోని బనాస్ డెయిరీ శుభారంభం చేసిందిమేం ఇదే నమూనాను ప్రతి రాష్ట్రానికీ తీసుకువెళ్లిటిష్యూ కల్చర్నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు అరటిబొప్పాయిబంగాళాదుంప విత్తనాలను అందించడానికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు.

సేంద్రీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం చాలా ముఖ్యమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారుమన 140 కోట్ల మంది పౌరులుప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నాంఅందుకేభారత రైతులు సేంద్రీయ ఉత్పత్తిని పెంచాలిరసాయన ఎరువుల వాడకాన్ని ఆపివేస్తే ఉత్పత్తి తగ్గుతుందనే నమ్మకం ఒక అపోహ మాత్రమేరసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం వల్ల ఉత్పత్తి తగ్గదనీపైగా ఉత్పత్తి పెరగడంతో పాటు నేలకూ రక్షణ లభిస్తుందని గత అయిదేళ్ల కాలంలో నిరూపితమైందన్నారుమేం చక్కెరపాడి రంగాల్లో 100 శాతం సర్క్యులర్ ఎకానమీని సాధిస్తున్నాందీని ద్వారాడీఏపీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే ఎరువునూ ఉత్పత్తి చేయవచ్చుఈ దేశీయ ఎరువు డీఏపీ కంటే చవకగానాణ్యతలో మెరుగ్గా ఉండిపొలాలకు ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుందిదేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నాంరాబోయే రోజుల్లో డీఏపీని వదిలిఈ కొత్త ఎరువును స్వీకరించిఅందరూ దీనిని వినియోగించాలని శ్రీ అమిత్ షా దేశ రైతులకు విజ్ఞప్తి చేశారుసేంద్రీయ ఉత్పత్తుల కోసం ప్రపంచ మార్కెట్‌ను అన్వేషించడానికి మేం జాతీయ స్థాయి సహకార సంఘాన్ని ఏర్పాటు చేశాంసహకార మార్కెట్ అనుసంధానాలను ప్రతి గ్రామానికీ తీసుకువెళ్ళడానికిఅన్ని రాష్ట్రాల్లో మార్కెటింగ్ సమాఖ్యలను బలోపేతం చేయడానికి మేం ప్రణాళికను సిద్ధం చేశామని శ్రీ షా వివరించారుమేం చేపట్టిన అయిదో కార్యక్రమం... సుస్థిరమైనసమర్థమైన వనరులు గలనూతన సర్క్యులర్ ఎకానమీకి సంబంధించినదిమేం సహకారంలోని ప్రతి రంగంలోనూ సర్క్యులర్ ఎకానమీని అమలు చేయాలనుకుంటున్నాంమేం పాడి పరిశ్రమతో దీనిని ప్రారంభించాం అని కేంద్ర హోంమంత్రి తెలిపారు.

అన్నదాత’ను ‘శక్తిప్రదాత’గా మార్చాలన్న మోదీజీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా అన్నారుఈ రోజు ప్రారంభించిన గోమయ సహకార సంఘం లిమిటెడ్... పశువుల మేతపశు ఆరోగ్యంకృత్రిమ గర్భధారణపేడ నిర్వహణసేంద్రీయ ఎరువులుపునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ద్వారా పాడి రంగంలో సంపూర్ణ సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తుందని తెలిపారుశ్వేత విప్లవం 2.0 ద్వారా... సహకార పాడి పరిశ్రమల బలమైన నెట్‌వర్క్‌ను సృష్టించాలని మేం కోరుకుంటున్నాంరాబోయే రెండేళ్లలో పాలు ఉత్పత్తి చేసే రైతుల సంఖ్యను కనీసం 35 శాతం పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని నేను అన్ని రాష్ట్రాల పాడి సమాఖ్యలను కోరుతున్నానుమరో 35 శాతం గ్రామాల్లో కొత్త పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలిప్రాథమిక పాడి సొసైటీలను స్థాపించాలిపాల సరఫరా కోసం గ్రామంలోని ఏ రైతూ పాడి నెట్‌వర్క్‌కు వెలుపల ఉండకూడదని శ్రీ షా పేర్కొన్నారుసహకార చక్కెర రంగంలో... మేం బెల్లం నుంచి చక్కెరఇథనాల్బగాసేఇంధనంప్రెస్‌మడ్సేంద్రీయ ఎరువుసల్ఫర్ ఉత్పత్తి వరకు పూర్తి వ్యవస్థనూ అమలు చేశాంఈ ప్రయోగం విజయవంతమైందిఇందుకోసం ప్రత్యేకంగా సహకార సంఘాలనూ ఏర్పాటు చేశాంక్లస్టర్ ఆధారిత సహకార సంఘాల ద్వారాప్రతి డెయిరీ సొంతంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదుఈ వ్యవస్థ చెరకు తుది వినియోగం వరకు మొత్తం ప్రక్రియనూ చూసుకుంటుందిచక్కెర మిల్లులకు లాభాలనూ అందిస్తుంది.

అధిక చెరకు ధరల చెల్లింపులపై పన్ను ఉపశమనం కల్పించిపాత పన్ను వివాదాలను పరిష్కరించామని కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారుఒక్క చెరకు రంగంలోనే... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులకు రూ. 46,000 కోట్ల ఆదాయపు పన్నును మాఫీ చేశారన్నారుయంత్రాల ఉత్పత్తి కోసంజాతీయ భారీ ఇంజనీరింగ్ సహకార సంఘ పునరుద్ధరణ ప్రక్రియనూ ప్రారంభించామని శ్రీ షా తెలిపారుఈ సహకార సంఘం పాడి యంత్రాలుప్రాథమిక పాడి పరిశ్రమల యంత్రాలుగ్యాస్ ఉత్పత్తి యంత్రాలుఎరువుల ఉత్పత్తి యంత్రాలను తయారు చేస్తూ ముందుకు సాగుతోందిభారత్ టాక్సీ కార్యక్రమం చాలా బలంగా ముందుకు సాగుతోందిరాబోయే రెండేళ్లలోభారత్ టాక్సీ దేశంలోని 500కు పైగా నగరాలు సహా ప్రతి రాష్ట్రంలోనూ అందుబాటులోకి వస్తుందితద్వారా ప్రజలను అనవసర దోపిడీ నుంచి విముక్తి చేస్తుందని శ్రీ షా తెలిపారు.

దాదాపు 20 శాతం వ్యవసాయ రుణం, 35 శాతం ఎరువుల పంపిణీ, 31 శాతం చక్కెర ఉత్పత్తి సహకార సంఘాల ద్వారానే జరుగుతున్నాయని శ్రీ అమిత్ షా అన్నారుభారత్ టాక్సీ తరహాలోరాబోయే రోజుల్లో యుటిలిటీ అగ్రిగేటర్ కోఆపరేటివ్‌ను మరింతగా అభివృద్ధి చేయబోతున్నాంఇఫ్కో-టోకియోతో కలిసి రెండు రకాల బీమా పథకాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారాఒక సహకార జీవిత బీమా కంపెనీని ఏర్పాటు చేయబోతున్నాంఇది బీమా రంగంలోనూ సహకారాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తుందిగడిచిన అయిదేళ్లుగా ప్రతి క్షణంప్రతి రోజుప్రతి నెలాప్రతి ఏడాదీ సహకార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికే మేం అంకితమయ్యాంమా మంత్రిత్వ శాఖ ఈ దిశగా అందరినీ కలుపుకొని అవిశ్రాంతంగా కృషిచేస్తోందని కేంద్ర మంత్రి వివరించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో... సహకార రంగాన్ని ద్వితీయ శ్రేణిగా చూడటం ఇకపై ఆమోదయోగ్యం కాదని శ్రీ అమిత్ షా అన్నారుదేశాన్ని సుసంపన్నం చేసే ఈ గొప్ప ప్రణాళికలో మేమంతా అందరితో సమానంగా భుజం భుజం కలిపి నిలబడతాంమేం ఈ ప్రణాళికలో పూర్తిస్థాయిలో పాల్గొంటాంఈ రంగం ద్వారా పూర్తి లాభాన్నిదానిపై న్యాయబద్ధమైన హక్కునూ రైతులుపశుసంవర్ధక కార్మికులకు గౌరవప్రదంగా చేరేలా చూడటమే మా ప్రయత్నమని కేంద్ర మంత్రి తెలిపారు.

కార్యక్రమ ప్రారంభంలో... భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులుమాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా హోం మంత్రి శ్రీ అమిత్ షా నివాళులర్పించారుడాక్టర్ ముఖర్జీ తనలాంటి కోట్లాది మంది కార్యకర్తల జీవితాల్లో భారతీయత విలువలనుభరతమాత పట్ల గౌరవాన్నీభారతీయ సంస్కృతి ప్రాముఖ్యతనూ నెలకొల్పారని ఆయన అన్నారుశ్యామా ప్రసాద్ ముఖర్జీ లేకపోయి ఉంటేఈ రోజు కాశ్మీర్ భారత్‌లో భాగంగా ఉండేది కాదని ఆయన అన్నారుఒక దేశానికి రెండు రాజ్యాంగాలుఇద్దరు అధిపతులురెండు జెండాలు ఉండకూడదని చెప్పింది డాక్టర్ ముఖర్జీయేఆయన ఈ ఆశయం కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండాదాని కోసం తన ప్రాణాలనూ త్యాగం చేశారుఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న డాక్టర్ ముఖర్జీ కలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెరవేర్చారని శ్రీ షా అన్నారుఒకవేళ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు లేకపోయి ఉంటే... అస్సాం పాకిస్తాన్‌లో భాగమై ఉండేదనీపశ్చిమ బెంగాల్‌లోని చాలా భాగం పాకిస్తాన్‌కు వెళ్లిపోయి ఉండేదని ఆయన పేర్కొన్నారుశ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఉద్యమం వల్లే నేడు అస్సాంబెంగాల్ రాష్ట్రాలూ భారత్‌లో వైభవోపోతమైన ప్రాంతాలుగా నిలిచాయని ఆయన తెలిపారుప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో... డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఉత్సవాలను గ్రామాల నుంచి ప్రతి పట్టణంనగరం వరకూ అత్యంత వైభవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిశంకుస్థాపన చేశారుపలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 135 ఆహార ధాన్యాల నిల్వ గోదాముల బదిలీ... 85 గోదాములను జాతికి అంకితం చేయడం... 47 గోదాములకు శంకుస్థాపన... అమూల్ఎన్‌సీసీఎఫ్ ద్వారా సహకార్ వన్‌కు భూమి పూజ... ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిమహారాష్ట్రలోని జల్గావ్‌లో బీబీఎస్ఎస్ఎల్ టిష్యూ కల్చర్ కేంద్రాలకు భూమి పూజ... ఎన్‌సీడీ 3.0, జియో-ట్యాగ్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం... ఎన్‌డీడీబీ పాల సరఫరా సమీక్ష డాష్‌బోర్డ్ పోర్టల్ ప్రారంభం... కోఆపరేటివ్ ఇన్‌పుట్స్ అండ్ సర్వీసెస్ డెలివరీ మల్టీ-స్టేట్ లిమిటెడ్ కింద పాడి పశువుల ఉత్పాదకతకు సంబంధించిన కార్యక్రమాల ప్రారంభం వంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటిలో భాగంగా ఉన్నాయికోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ మల్టీ-స్టేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం... గోమయ కోఆపరేటివ్ సొసైటీ మల్టీ-స్టేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం... ఎన్‌యూసీఎఫ్‌డీసీ రెండు ప్రధాన కార్యక్రమాలైన — కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ సహకార్ సీబీఎస్పట్టణ సహకార బ్యాంకుల కోసం సంభాషణాత్మక ఏఐ-ఆధారిత ప్లాట్‌ఫామ్ అయిన సహకార్ సహయోగి ఆవిష్కరణలూ జరిగాయిఈ కార్యక్రమంలో 50,000 పీఏసీఎస్‌లను ఇ-పీఏసీఎస్‌లుగా మార్చిన మైలురాయినీ గుర్తించారుదీని ద్వారా క్షేత్రస్థాయి సహకార సంస్థల డిజిటల్ సాధికారత దిశగా కీలక ముందడుగు పడిందివిత్తన వ్యవస్థల బలోపేతం లక్ష్యంగా బీబీఎస్ఎస్ఎల్ఐసీఏఆర్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిందిఈ సందర్భంగాపాడి సహకార సంఘాల కోసం నమూనా ఉప-నియమాలనుగత అయిదేళ్లలో సహకార మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను గురించిన ఒక పుస్తకాన్నీ శ్రీ అమిత్ షా విడుదల చేశారు.

 

***


(रिलीज़ आईडी: 2281854) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada