ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఎన్హెచ్ (ఓ) పథకంలో భాగంగా హైబ్రిడ్ యాన్యుయిటీ విధానంలో మొత్తం 8.1 కి.మీ. 6 వరుసల రహదారి సొరంగ నిర్మాణానికి ఆమోదం
ఈ రహదారి సొరంగం ద్వారకా ఎక్స్ప్రెస్వే (ఎన్హెచ్ 248 బీబీ)ని ఢిల్లీ.. వసంత్ కుంజ్లో నెలకొన్న నెల్సన్ మండేలా మార్గ్తో కలుపుతుంది
ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.6989.67 కోట్లు
प्रविष्टि तिथि:
01 JUL 2026 3:06PM by PIB Hyderabad
ఎన్హెచ్ (ఓ) పథకంలో భాగంగా హైబ్రిడ్ యాన్యుయిటీ విధానం(హెచ్ఏఎమ్)లో ద్వారకా ఎక్స్ప్రెస్వే (ఎన్హెచ్ 248 బీబీ)ని ఢిల్లీ.. వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గ్తో కలిపే ఎన్హెచ్-148ఏఈలో- 6 వరుసల రహదారి సొరంగ నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 8.1 కిలోమీటర్లు. దీనికి మొత్తం మీద రూ.6969.67 కోట్లను ఖర్చు చేస్తారు.
ఈ ప్రాజెక్టు పశ్చిమ, దక్షిణ ఢిల్లీల మధ్య మెరుగైన అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది. దీంతో దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ కు యూఈఆర్ 2/ద్వారకా ఎక్స్ప్రెస్వే కలుస్తుంది. దీనికి అదనంగా గురుగ్రామ్, ద్వారకా, ఐజీఐ విమానాశ్రయం, పశ్చిమ ఢిల్లీ నుంచి దక్షిణ ఢిల్లీ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు సులభతరమవుతాయి. భూమి లోపల జంట సొరంగాలతో.. ఉపరితలం పైన రాకపోకల వ్యవధి కనీస స్థాయికి తగ్గుతుంది. అంతేకాక దక్షిణ రిడ్జ్ ఫారెస్ట్ (సొరంగానికి చెందిన 1.98 కి.మీ. భాగం రిడ్జ్ కింది నుంచి వెళ్తుంది) సురక్షితంగానూ ఉంటుంది. ఏఐఐఎమ్ఎస్, మహిపాల్పూర్ల మధ్య ఒక ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ లింకు.. సొరంగాన్ని బారాపుల్లా ఎలివేటెడ్ రోడ్డుతో అనుసంధానిస్తుంది. దీంతో పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలు.. తూర్పు ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడాలతో కలుస్తాయి.
ప్రతిపాదిత సొరంగం రంగ్పురి (దక్షిణ ఢిల్లీ) రిడ్జ్ గుండా వెళ్తుంది. దీనిని ఒక ట్విన్ ట్యూబ్ సొరంగం (టన్నెల్ బోరింగ్ మెషీన్ ను ఉపయోగించి నిర్మిస్తారు) మాదిరి డిజైన్ చేశారు. ఇది శివ్ మూర్తి ఇంటర్చేంజ్ నుంచి మొదలై, నెల్సన్ మండేలా మార్గ్, మహిపాల్పూర్ ఛతర్పూర్ రోడ్డు నాలుగు రోడ్ల కూడలి కన్నా ముందే ముగుస్తుంది.
ఈ చౌరస్తా లో రద్దీని తగ్గించడానికి నెల్సన్ మండేలా మార్గానికి సమాంతరంగా ఒక ఎలివేటెడ్ రోడ్డును (1.8 కి.మీ.) కూడా ప్రతిపాదించారు. ఛతర్పూర్ నుంచి మహిపాల్పూర్ వైపు ఇప్పటికే ఉన్న ఫ్లయ్ఓవరుకు సమాంతరంగా ఒక అదనపు ఫ్లయ్ఓవరును కూడా ప్రతిపాదించారు. ఛతర్పూర్ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం కుడి వైపు తిరిగే సదుపాయాన్ని కల్పించడానికి ఒక ఎలివేటెడ్ యూ-టర్నునూ ప్రతిపాదించారు.
ప్రధాన క్యారేజ్వే పొడవు 6.3 కి.మీ ఉంది. మహిపాల్పూర్ ఛతర్పూర్ రోడ్డులో ప్రతిపాదిత ఫ్లయ్ఓవర్, ఎలివేటెడ్ యూ-టర్నును లెక్కలోకి తీసుకొంటే, ప్రాజెక్టు మొత్తం పొడవు 8.100 కి.మీ. అవుతుంది. దీనిలో 3.140 కి.మీ. సొరంగం, 0.980 కి.మీ. సొరంగ అప్రోచ్ ర్యాంపు, 0.554 కి.మీ. ఆర్ఈ గోడతో పాటు అప్రోచ్, 2.556 కి.మీ. ఎలివేటెడ్ భాగం, 0.870 కి.మీ మేర ఎట్-గ్రేడ్ రోడ్డు కలిసి ఉన్నాయి.
జాతీయ రహదారికి చెందిన ప్రతి ఒక్క లేన్ కిలోమీటరును అభివృద్ది చేయడంలో సగటున 264 పనిదినాల ప్రత్యక్ష ఉపాధితో పాటు సగటున 55 పనిదినాల పరోక్ష ఉపాధి లభిస్తుంది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టుతో సుమారు 7.54 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధే కాకుండా 9.80 లక్షల పనిదినాల పాటు పరోక్ష ఉపాధి కూడా లభిస్తుంది. ప్రతిపాదిత హై-స్పీడ్ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రాజెక్టుతో అదనపు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.
శివ్ మూర్తి ఇంటర్చేంజ్/ ద్వారకా ఎక్స్ప్రెస్వేతో పాటు నెల్సన్ మండేలా మార్గ్/ వసంత్ కుంజ్ ల మధ్య ప్రతిపాదిత సొరంగానికి గాను ప్రాజెక్టు అలైన్మెంటు మ్యాప్
***
(रिलीज़ आईडी: 2279887)
आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam