హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్’ ప్రయోగాత్మక ప్రాజెక్టును


గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా..

పిల్లలకు పోలియో చుక్కలు వేసిన కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా

దీర్ఘకాలిక విధానాలను రూపొందించడమే కాక వాటిని నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ,

క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలుచేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

సర్వతోముఖ, సమ్మిళిత అభివృద్ధికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ప్రధాని

జనన, మరణాల నమోదు డేటాతో ముడిపడిన పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్ తో ప్రతి పాపాయికీ విశిష్ట గుర్తింపు

ప్రభుత్వ పథకాల లబ్ధి దానంతట అదే సకాలంలో అందుతుంది

లబ్ధిదారు గుర్తింపు, ప్రభుత్వ అందుబాటు ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు

ఇందులో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించనున్న పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్

ఏకీకృత పర్యవేక్షక వ్యవస్థతో, ఆపన్నులకు పథకాలు పక్కాగా చేరేలా చూడనున్న పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్

ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీ పద్ధతిలో పేదలకు పారదర్శక, ప్రభావశీల సంక్షేమాన్ని

అందించడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేసిన మోదీ ప్రభుత్వం

పేద కుటుంబాలు తరాల తరబడి ఎదుర్కొంటూ వచ్చిన అనేక సమస్యలను

కేవలం 12 సంవత్సరాల్లో పరిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 28 JUN 2026 9:51PM by PIB Hyderabad

పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్’ ప్రయోగాత్మక ప్రాజెక్టును కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ రోజు ప్రారంభించారుఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్కేంద్ర హోం కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్‌తో పాటు అనేక మంది ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ స్వాతంత్య్రం వచ్చిన తరువాతి భారత్ 100 సంవత్సరాల చరిత్రను ఎవరైనా రాస్తేఆ చరిత్ర రెండు భాగాలుగా ఉంటుందన్నారుఒకటో భాగం 2014కు ముందు భారత్‌‌ గురించీరెండో భాగం 2014కు తరువా భారత్‌‌ గురించీ ఉంటుందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో భారతదేశ ప్రజానీకం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. 2014 తరువాతప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోదేశంలోని ప్రతి రంగంలోనూ భారీ మార్పు చోటు చేసుకొందన్నారుదేశ సమగ్రసర్వతోముఖ అభివృద్ధికి ప్రధాని శ్రీ మోదీ కొత్త నిర్వచనాన్ని ఇచ్చారని శ్రీ షా అన్నారుమోదీ ప్రభుత్వం ప్రతి రంగంలో దీర్ఘకాలిక విధానాలను రూపొందించడమే కాకుండావాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చేటట్లు చూసిందని శ్రీ షా అన్నారుదేశ భద్రతను బలోపేతం చేయడానికీదేశ సంస్కృతిని పరిరక్షించడానికీవిద్యా విధానాన్ని అమలుపరచడానికీస్వయంసమృద్ధి దిశగా పురోగమించడానికీప్రతి రంగంలో విధానాల రూపకల్పనతో పాటు వాటిలో సమయానుసారంగా సంస్కరణలను తీసుకువస్తున్నారని శ్రీ షా అన్నారు.
భారత్‌లో కోట్లాది మంది పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సమగ్ర ప్రయత్నాలు సాగాయని శ్రీ అమిత్ షా వివరించారుప్రస్తుతం దేశంలో బీదలకు ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు పంపుతున్న మొత్తం ఎంతయినా సరేపూర్తిగా వారి చెంతకే చేరుతోందన్నారుప్రయోజనాల నేరు బదిలీ (డీబీటీపద్ధతిని ప్రవేశపెట్టి నిరుపేదల సంక్షేమంలో ఒక కొత్త యుగాన్ని మోదీ ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారుఇళ్లువిద్యుత్తునల్లా నీరుమరుగుదొడ్లుగ్యాస్ సిలిండర్లుఉచితంగా కేజీల ఆహార ధాన్యాలుఉచితంగా రూ.5 లక్షల వరకూ వైద్య చికిత్సతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది పేద ప్రజలకు 90 శాతం చౌక మందులను కేవలం 12 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అందజేసిందన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి స్వేచ్ఛా భారతావనిలో తమకు రావలసినవి పొందడానికి పాట్లు పడవలసివస్తున్న కోట్ల కొద్దీ ప్రజలకు న్యాయంగా వారికి దక్కవలసిన వాటాను నరేంద్ర మోదీ వారికి ఇచ్చిందని కేంద్ర హోం మంత్రి అన్నారుదేశంలో కోట్ల మందికి తరాల తరబడి ఎడతెగక వస్తున్న సమస్యల్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ 12 సంవత్సరాల్లోనే పరిష్కరించారని కూడా శ్రీ షా అన్నారు.
ప్రతి ఒక్కరికీ అందుతున్న పాలన ఫలితాలను ఆరా తీసే ఒక వ్యవస్థను ఈ రోజు ఇక్కడ పక్కాగా ప్రారంభించామని శ్రీ అమిత్ షా అన్నారుఇవాళబాలలకు పోలియో డోసులు వేయించారు. పోషణ కిట్లను కూడా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారుఈ పూర్తి డేటాబేసును ఏకీకరించిదానిని జనన మరణ డేటాతో ముడిపెట్టి పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్ సాయంతో ప్రతి ఒక్క బిడ్డకూ ఒక ఐడీనీఒక విశిష్ట సంఖ్యనీ సమకూరుస్తారని వెల్లడించారుఈ వేదికతోప్రభుత్వ పథకాలన్నింటి ప్రయోజనాల్నీ అందిస్తారన్నారుపీఎమ్ ఫ్యామిలీ ట్రాకర్ ఒక ఏకీకృత పర్యవేక్షక వ్యవస్థను తీసుకువస్తుందనీదాన్లో భాగంగా అవసరమైన వారిని గుర్తించివారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనీ శ్రీ షా అన్నారు.
దేశ ఆరోగ్య రంగంలో ఒక పెను మార్పును ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు తీసుకు వచ్చారని కేంద్ర హోం మంత్రి అన్నారుదేశ ఆరోగ్యసంరక్షణ రంగ అవసరాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారనీవాటిలో.. వైద్యుల లభ్యతకోట్లాది పౌరులకు రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్స సౌకర్యంమందులను తక్కువ ధరల్లో అందేటట్లు చూడడంఆరోగ్య సంబంధిత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ఆయుష్ ద్వారా భారత సాంప్రదాయిక స్వాస్థ్య సంరక్షణ వ్యవస్థల్ని పునరుత్తేజితం చేసినట్లు పేర్కొన్నారుఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకరును ఈ రోజు ప్రారంభించినట్లు శ్రీ షా తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2278926) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , हिन्दी , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam