ఎంఐఎఫ్ఎఫ్ 2026: 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల స్వాగత వేదికపై సినీ ప్రముఖుల సందడి
19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 2026 ముగింపు వేడుకల వేదిక చలనచిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, దిగ్గజాలతో ఎంతో శోభాయమానంగా నిలిచింది.
ఈ వేడుకకు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, మహారాష్ట్ర ప్రభుత్వ మరాఠీ భాషా, సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ కిరణ్ కులకర్ణి, ఎన్ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్ హాజరయ్యారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్, నటి ఐమీ బారువా, నటి షీనా చోహన్, డాక్టర్ కిరణ్ శాంతారామ్, ప్రసిద్ధ యానిమేటర్ దర్శకుడు రైమండ్ క్రుమ్మె కూడా పాల్గొన్నారు.
ఎంఐఎఫ్ఎఫ్ 2026లో వారం రోజుల పాటు సాగిన సినిమా సంబరాల ముగింపు వేడుకలో మెరిసిన గ్లామర్, చిరునవ్వులు, మరపురాని క్షణాల చిత్ర సమాహారం.
19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల స్వాగత వేదికపై మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, మహారాష్ట్ర ప్రభుత్వ మరాఠీ భాషా, సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ కిరణ్ కులకర్ణి, ఎన్ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్
స్వాగత వేదికపై ప్రముఖ చలనచిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్, ఎన్ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్
స్వాగత వేదిక వద్దకు వస్తున్న నటి ఐమీ బారువా.
వేదికపై భారత చలనచిత్ర దిగ్గజ దర్శకుడు వి. శాంతారామ్ కుమారుడు డాక్టర్ కిరణ్ శాంతారామ్, భారత జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్ సాంకేతిక సలహాదారు ఉజ్వల్ నిర్గుడ్కర్
వేదికను అలంకరించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ సీఈఓ డాక్టర్ విశ్వాస్ డియోస్కర్.
ముగింపు వేడుకల స్వాగత వేదికను అలంకరించిన నటి షీనా చోహన్.
ముగింపు వేడుకల స్వాగత వేదికపై ప్రముఖ దర్శకుడు, యానిమేటర్ రైమండ్ క్రుమ్మె.
* * *
रिलीज़ आईडी:
2276405
| Visitor Counter:
3