గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీబీ-జీ రామ్ జీ పథకం అమలుకు మద్దతుగా 100 మందికి పైగా ప్రాంతీయ అధికారుల నియామకం


రాష్ట్రాలు, యూటీలకు సహాయం, సామర్థ్య పెంపుదల, కార్యలాపాలు సజావుగా సాగేందుకు చర్యలు

వీబీ-జీ రామ్ జీ అమలుకు ముమ్మర ఏర్పాట్లు, బడ్జెట్ నిధులు కేటాయించిన 27 రాష్ట్రాలు, యూటీలు.. రూ.95,692 కోట్లు కేటాయించిన కేంద్రం

प्रविष्टि तिथि: 19 JUN 2026 10:40AM by PIB Hyderabad

జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీచట్టం-2025కు మద్దతుగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రాంతీయ అధికారులను నియమించిందిపథకం అమలు సులభతమయ్యేందుకు రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు సహకరించేందుకు ఈ కీలక చర్యను చేపట్టింది.

అమలు ప్రక్రియను సులభతరం చేసేలాసలహాదారులుగా ప్రాంతీయ అధికారులు సేవలందిస్తారుస్థానిక సామర్థ్యాలను బలోపేతం చేసేందుకుఅమలుకు మద్దతిచ్చేందుకుజ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటానికికార్యాచరణ సవాళ్ల పరిష్కారానికిఉత్తమ పద్ధతుల అవలంబన ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వాలుజిల్లా పాలనా విభాగంతో కలిసి వీరు పనిచేస్తారు.

ఇందుకోసం అధికారులను సన్నద్ధం చేయటానికి గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించిందిచట్టానికి సంబంధించిన కీలక అంశాలుఅమలు విధానంసంస్థాగత ఏర్పాట్లుసాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలురాష్ట్రాలుజిల్లాలకు అందుబాటులో ఉన్న సహాయక వ్యవస్థల గురించి ఈ కార్యక్రమంలో వివరించారుగ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్ అధ్యక్షతనజాయింట్ సెక్రటరీ శ్రీమతి రోహిణి ఆర్భాజిభాకరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నూతన చట్టం అమలుకు అవసరమైన అంశాలను అర్థం చేసుకునేందుకుపరస్పర అనుభవాలుఉత్తమ విధానాలను పంచుకోవటాన్ని ప్రోత్సహించేందుకుసామర్థ్య పెంపుదల ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకుకార్యాచరణకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలుజిల్లా పరిపాలనా వ్యవస్థక్షేత్ర స్థాయి సిబ్బందితో ప్రాంతీయ అధికారులు సంప్రదింపులు జరుపుతారువివిధ భాగస్వాముల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకుసమర్థవంతమైన అమలుకు మద్దతిచ్చేందుకు ఈ అధికారులు సహకరిస్తారుదేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని సజావుగా అమలు చేసేందుకుసంస్థాగత సహాయాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

రాష్ట్రాలుయూటీల్లో ఈ నూతన విధానాన్ని అమలు చేసే సమయంలో సమన్వయాన్ని పెంపొందించటంక్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవటంనిరంతరం సంస్థాగత మద్దతును అందించటం ద్వారా ప్రాంతీయ అధికారి కీలక పాత్ర పోషిస్తారుఇబ్బందులు లేకుండాసజావుగాసమర్థవంతంగా వీబీ-జీ రామ్ జీ వ్యవస్థ పనిచేయటంలో సహాయపడతారు.

హామీతో కూడిన వేతన ఉపాధిని జీవనోపాధి ప్రోత్సాహంవాతావరణ స్థిరత్వంగ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనసాంకేతిక ఆధారిత పాలనతో అనుసంధానించటం ద్వారా వీబీ-జీ రామ్ జీ-2025 చట్టం.. గ్రామీణ ఉపాధిని స్థిరమైనసమగ్ర గ్రామీణాభివృద్ధికి ప్రధాన సాధనంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందివికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు (వీజీపీపీలు), జీఐఎస్ ఆధారిత ప్రణాళికలువివిధ పథకాల సమన్వయం ద్వారా వికసిత్ భారత్-2047 దార్శనికతను ఈ చట్టం ముందుకు తీసుకెళ్తుంది.

దేశవ్యాప్తంగా సన్నద్ధతతో ఉండేలా మంత్రిత్వ శాఖ ఏకకాలంలో విస్తృతమైన ముందస్తు చర్యలను చేపట్టిందివీటిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.95,692 కోట్ల తాత్కాలిక కేటాయింపుల ఆమోదండీబీటీ స్పర్శ్ వేదికలోకి అన్ని రాష్ట్రాలుయూటీలను చేర్చటందాదాపు 93 శాతం క్రియాశీల కార్మికులకు ఈ-కేవైసీ పూర్తి చేయటంఫేస్ అథెంటికేషన్ హాజరు విధానాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావటంప్రత్యేక డిజిటల్ వేదికల అభివృద్ధిపెద్దఎత్తున సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలున్నాయి.

ఇప్పటి వరకు సాధించిన పురోగతిని తెలియజేస్తూ.. 27 రాష్ట్రాలుయూటీలు ఈ చట్టం అమలుకు ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు చేశాయిఆరు రాష్ట్రాలుయూటీలు వీబీ-జీ రామ్ జీ కార్యాచరణ ద్వారా రాష్ట్ర పథకాలను అధికారికంగా ప్రకటించాయిమిగిలిన రాష్ట్రాలుయూటీలు పథకాలను ఖరారు చేసే దశలో ఉన్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2275210) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Odia , English , Urdu , हिन्दी , Bengali-TR , Bengali , Gujarati , Tamil , Kannada