ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ7 శిఖరాగ్ర సమావేశ సదస్సు సందర్భంగా ప్రధాని ప్రసంగం: సురక్షితంగా, వేగంగా, సమర్థంగా ఏఐ వినియోగం

प्रविष्टि तिथि: 17 JUN 2026 9:20PM by PIB Hyderabad

గౌరవనీయ పెద్దలారా,

ఈ ముఖ్యమైన అంశాన్ని మన చర్చల్లో భాగం చేసిన మిత్రుడు మెక్రాన్‌కు నా అభినందనలుమానవుడు సృష్టించిన అత్యంత విప్లవాత్మక సాంకేతికతల్లో కృత్రిమ మేధ ఒకటిఇందులో ఎలాంటి సందేహమూ లేదు.

నేడు మానవ జీవితంలో కృత్రిమ మేధ స్పృశించని అంశమంటూ లేదుమునుపెన్నడూ లేనంత వేగంగా వైజ్ఞానిక పరిశోధనలను ఏఐ వేగవంతం చేస్తోందిఇది పాలనను మరింత ప్రభావవంతంగాజవాబుదారీగా మార్చడంతోపాటు.. ఆరోగ్య రక్షణవిద్యతయారీ రంగాలనూ శక్తిమంతం చేస్తోంది.

అయితేయంత్రాలు ఎంత శక్తిమంతమయ్యాయన్నది కాదు.. జనసామాన్యాన్ని ఏ మేరకు సశక్తులను చేసిందన్నదే ఏఐకి కొలమానందీనినే భారత్ దృఢంగా విశ్వసిస్తోందిఈ యేడు నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లోనూ మానవుడే కేంద్రంగా ఏఐ అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకతను భారత్ స్పష్టం చేసిందిభారత్ తన ‘మానవ్’ సంకల్పాన్ని ఈ సదస్సులో స్పష్టంగా చాటిందిఈ సంకల్పమే ఏఐ రంగంలో భారత్‌కు మార్గదర్శకం.

ఏఐపై సందేశాన్ని అందిస్తూ.. మానవ విలువలుసమ్మిళితత్వంఅర్థవంతమైన మానవ నియంత్రణలు దానికి పునాదిగా నిలవాలని గౌరవనీయులైన పోప్ ఇటీవల పేర్కొన్నారుసాంకేతికత ఎంత అధునాతనమైనా సరే మానవులే దానికి కేంద్రంగా ఉండాలి... భారత్ మానవ్ సంకల్పంగౌరవ పోప్ సందేశం రెండూ ఇదే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాయి.

మిత్రులారా,

ఏఐ వినియోగంలో పిల్లల భద్రత అతి ముఖ్యమైన అంశంపిల్లలకు వారి మాతృభాషలో విద్యను ఏఐ అందించగలదువారిలో సృజనను పెంచుతుందిఅభ్యసన ప్రక్రియను వారికి మరింత అనుకూలంగా మారుస్తుందిఅయితేసరైన రక్షణలు లేకపోతే.. అదే సాంకేతికతతో తప్పుడు సమాచారండీప్‌ఫేక్దుష్ప్రభావాల బారిన పడే ప్రమాదమూ ఉంది.

ఈ రెండు సందర్భాల మధ్య తేడా సాంకేతికతలోనిది కాదు.. దాని వినియోగానికి దిశానిర్దేశం చేసే విలువలువిధాన నిర్ణయాలుపాలన విధానాల్లో ఆ తేడా ఉందిడిజిటల్ రంగం పిల్లల అభ్యాసానికీవికాసానికీ వేదికగా నిలవాలి తప్ప.. వారిని తప్పుదోవ పట్టించే సాధనంగా మారకుండా మనం చూసుకోవాలి.

మిత్రులారా,

అత్యాధునిక ఏఐ మోడళ్లు సైబర్ భద్రత రంగంలో అపూర్వమైన అవకాశాలను సృష్టిస్తున్నాయిఅయితేసైబర్ వేదికలో అన్ని దేశాలూ సురక్షితంగా ఉంటేనే తప్ప.. ఏ దేశమూ నిజంగా సురక్షితంగా ఉన్నట్టు కాదుఅందుకే ఎల్లప్పుడూ సైబర్ వేదికను ప్రపంచ ప్రజా ప్రయోజనంగా భారత్ పరిగణిస్తుందిఅందువల్ల ఈ ముఖ్యమైన ఏఐ సాంకేతికతలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాలిఅవి సమ్మిళితంగా ఉండాలిప్రజాస్వామ్య దేశాలు తమ కీలక సమాచార మౌలిక సదుపాయాలను కాపాడుకోవడానికీపెరుగుతున్న సైబర్ ముప్పులను సమర్థంగా ఎదుర్కొనడానికీ వీలుగా.. ప్రజాస్వామ్య దేశాలకు ఆ ఏఐ మోడళ్లు అందుబాటులో ఉండాలి.

మిత్రులారా,

భద్రతవేగంసామర్థ్యాల మధ్య సమతౌల్యంతో కూడిన సమగ్ర విధానంతో ముందుకు సాగేందుకు నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను:

మొదటిది రూపకల్పన దశ నుంచే సురక్షిత ఏఐ వ్యవస్థలను మనం ప్రోత్సహించాలిభద్రతను ఏదో అదనపు అంశంగానో లేదా చివరగా పరిగణించే విషయంగానో చూడకూడదుఏఐ రూపకల్పనలో అది మొదటి నుంచీ ప్రాథమిక అంశంగా ఉండాలి.

రెండోది ఏఐ వినియోగం విషయంలో ఆవిష్కరణలునిర్వహణ సమాంతరంగా ముందుకు సాగేలా చూసేందుకు.. ఉమ్మడి ప్రమాణాలుపరీక్ష పద్ధతులునియంత్రణ విధానాలను మనం రూపొందించుకోవాలిఅన్ని దేశాలకూ విజయవంతంగా ప్రయోజనాలను చేకూర్చేలా.. ఉమ్మడి నియమాలను ప్రపంచం రూపొందించుకున్న రంగాలకు పౌర విమానయానంనౌకా వాణిజ్య రవాణా మంచి ఉదాహరణలుబాధ్యతాయుతంగా కృత్రిమ మేధ అభివృద్ధివినియోగం విషయంలో అలాంటి పాఠాలను మనం నేర్చుకోవచ్చు.

మూడోది డీప్‌ఫేక్‌లుతప్పుడు సమాచారంసైబర్ మోసాలను ఎదుర్కోవడానికి ప్రపంచ స్థాయి సహకారాన్ని మనం బలోపేతం చేసుకోవాలిఏఐ ద్వారా రూపొందించిన కంటెంటును గుర్తించడంలో సహాయపడేందుకూడీప్‌ఫేక్‌ల ముప్పును తగ్గించడానికీ డిజిటల్ వాటర్‌ మార్కింగ్కంటెంట్ ప్రామాణీకరణ సాధనాల వంటి సాంకేతికతలను మనం ప్రోత్సహించాలి.

నాలుగోది ఏఐ ప్రయోజనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ అందేలా చూడాలిఇప్పటికే ఉన్న అంతరాలను మరింత పెంచేదిగా కాకుండా.. సమ్మిళితంగాఉమ్మడి పురోగతికి చోదకశక్తిగా ఏఐ నిలవాలి.

మిత్రులారా,

ఏఐ పట్ల మన విధానంవ్యూహం స్పష్టంగా ఉండాలిఏఐ మానవ సామర్థ్యాన్ని విస్తరించాలిప్రజలు సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకునేలా వారిని సశక్తులను చేయాలిమానవ గౌరవాన్ని కాపాడాలిఈ కీలక అంశంపై భాగస్వామ్య పక్షాలన్నింటితో సంప్రదింపులనూసహకారాన్నీ భారత్ కొనసాగిస్తుంది.

ధన్యవాదాలు.

గమనిక – ప్రధానమంత్రి ప్రసంగానికి ఇంచుమించుగా చేసిన అనువాదమిదిమౌలిక ప్రసంగం హిందీలో ఉంది.

***


(रिलीज़ आईडी: 2274775) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Manipuri , Urdu , Bengali , Assamese , Punjabi , Gujarati , Malayalam