ప్రధాన మంత్రి కార్యాలయం
సౌర ఇంధనం, వ్యవసాయం, ఉమ్మడి సౌభాగ్యంపై వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 JUN 2026 1:05PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ, అంతర్జాతీయ సౌర కూటమి డీజీ శ్రీ ఆశీష్ ఖన్నా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
సౌర విద్యుత్తు పెద్ద మార్పును తీసుకువస్తోందని ఈ వ్యాసం తెలిపింది. వ్యవసాయం కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగిస్తున్న భారత్ నమూనా ఆఫ్రికాకు ఆచరణీయ నమూనాను అందిస్తోందనీ, ఇది సౌభాగ్యాన్ని పటిష్ఠపరిచి ప్రజలకు సాధికారతను కల్పించడంతో పాటు ఆహార భద్రతను ప్రోత్సహిస్తోందని వ్యాసంలో వివరించారు. ఈ ఘనత భారత్ రైతులకూ, దేశానికీ గర్వకారణమని వ్యాసంలో పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘సౌర విద్యుత్తు పెద్ద మార్పును తీసుకువస్తోంది. వ్యవసాయం కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగిస్తున్న భారత్ నమూనా ఆఫ్రికాకు ఆచరణీయ నమూనాను అందిస్తూ, సౌభాగ్యాన్ని పటిష్ఠపరిచి ప్రజలకు సాధికారతను కల్పించడంతో పాటు ఆహార భద్రతను ప్రోత్సహిస్తోంది. ఇది మన రైతులకూ, మన అందరికీ నిజంగా గర్వకారణం.
కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ, అంతర్జాతీయ సౌర కూటమి డీజీ శ్రీ ఆశీష్ ఖన్నా రాసిన, లోతైన అవగాహన కలిగించే ఈ వ్యాసాన్ని చదవండి’’ అని తెలిపింది.
***
(रिलीज़ आईडी: 2273980)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam