ప్రధాన మంత్రి కార్యాలయం
స్వర్ణ భారతం దిశగా సాగుతున్న అభివృద్ధి ఆధారిత పాలనా నమూనాను వివరిస్తూ మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 JUN 2026 9:56PM by PIB Hyderabad
మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పంచుకున్నారు.
ఈ కథనంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్ణ భారత్ నిర్మాణం దిశగా సాగుతున్న అభివృద్ధి ఆధారిత పాలనా నమూనాను మాజీ ఉప రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ కాలంలో 4,399 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కీలక ఘట్టాన్ని అసాధారణ విజయంగా అభివర్ణిస్తూ మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఒక కథనాన్ని రాశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్ణ భారత్ నిర్మాణం దిశగా సాగుతున్న పీఎం మోదీ అభివృద్ధి ఆధారిత పరిపాలనా విధానాన్ని ఆయన కొనియాడారు".
(रिलीज़ आईडी: 2271501)
आगंतुक पटल : 6