ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీహార్‌లో మాదకద్రవ్యాల నిరోధక తనిఖీ… సుమారు 105 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ... ఇద్దరి అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 31 MAY 2026 5:58PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంమాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను నిర్మూలించడం కోసం చేస్తున్న నిరంతర ప్రయత్నంలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐఈ నెల 30వ తేదీన బీహార్‌లో 104.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుందిఈ అక్రమ రవాణాలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులనూ ఎన్‌డీపీఎస్ చట్టం-1985లోని సంబంధిత నిబంధనల కింద అరెస్టు చేసింది.

దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా డీఆర్ఐ చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ స్వాధీనం జరిగిందిగత ఏడాది కాలంలో బీహార్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్లక్నో జోనల్ యూనిట్ దాదాపు 46.5 కోట్ల రూపాయల విలువైన (అక్రమ మార్కెట్‌లోమాదకద్రవ్యాలుసైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకుందిఈ కేసులకు సంబంధించి 31 మందిని అరెస్టు చేసిందిఈ స్వాధీనాల్లో 107.5 కిలోల చరస్1277.81 కిలోల గంజాయి18.92 కిలోల అత్యంత నాణ్యమైన హైడ్రోఫోనిక్ గంజాయికిలోల కొకైన్112.8 గ్రాముల హెరాయిన్అక్రమ వినియోగం కోసం తరలిస్తున్న 8,012 సీసాల కోడీన్ ఆధారిత దగ్గు సిరప్‌లు ఉన్నాయి.

సమన్వయ కార్యకలాపాల ద్వారా మాదక ద్రవ్యాలుసైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాలో నిమగ్నమైన వ్యవస్థీకృత ముఠాలపై నిఘా ఉంచడం ద్వారా భారత ప్రభుత్వ 'నషా ముక్త్ భారత్' (మాదక ద్రవ్య రహిత భారత్దార్శనికతకు డీఆర్ఐ తోడ్పాటునందిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2267348) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी