మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన సీబీఎస్ఈ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం


విద్యార్థుల ప్రయోజనాలే మాకు ప్రధానం.. అన్ని సమస్యలనూ పరిష్కరిస్తాం: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 7:09PM by PIB Hyderabad

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలను సమీక్షించడం కోసం న్యూఢిల్లీలోని సీబీఎస్ఈ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు.

పాఠశాల విద్యాశాఖఅక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్సీబీఎస్ఈ చైర్‌పర్సన్ శ్రీ రాహుల్ సింగ్ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వికామకోటిఐఐటీ కాన్పూర్ డైరెక్టర్పాఠశాల విద్యాశాఖకేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్సీనియర్ అధికారులుఎస్బీఐఇండియన్ బ్యాంక్బ్యాంక్ ఆఫ్ బరోడాకెనరా బ్యాంకు సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలోపారదర్శకంగావిద్యార్థులతో మైత్రీపూర్వక ధోరణిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో అధికారులను మంత్రి ఆదేశించారుపారదర్శకతజవాబుదారీతనంవిద్యార్థి ప్రయోజనాలే కేంద్రంగా పరీక్షా విధానాన్ని నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారువిద్యార్థులుతల్లిదండ్రుల వాస్తవిక ఆందోళనలన్నింటినీ త్వరితగతిన సమర్థంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పరీక్ష ఫలితాల అనంతర సేవల పురోగతిని మంత్రి సమీక్షించారుఇందులో భాగంగా విద్యార్థుల సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడంమూల్యాంకనంపర్యవేక్షణ వ్యవస్థను మెరుగుపరచడంసీబీఎస్ఈ డిజిటల్ వేదికలను ఆధునికీకరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారువీటితోపాటు పరీక్షలకు సంబంధించిన సేవలను విద్యార్థులకు మరింత సులభంగావేగంగా అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ సమీక్ష సాగింది.

ఈ ఏడాది దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారనీఇందులో దాదాపు 98 లక్షల జవాబు పత్రాలుదాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలు ఉన్నాయని సంబంధిత అధికారులు మంత్రికి వివరించారుఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు దాదాపు 11 లక్షల స్కాన్ చేసిన జవాబు పత్రాలను పోర్టల్ ద్వారా పొందారని వారు తెలిపారు.

విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్య అంశమని పునరుద్ఘాటించిన శ్రీ ప్రధాన్.. ఈ విషయంలో ఎలాంటి లోపాలు లేదా వైఫల్యాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారువ్యవస్థ లోపలవెలుపల... ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

పరీక్షల అనంతర సేవలందించే పోర్టల్‌లో లాగిన్ యాక్సెస్ సమస్యలుసర్వర్‌పై విపరీతమైన లోడ్చెల్లింపులకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతున్నట్టు వచ్చిన నివేదికలను కూడా మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు.

అంతరాయం లేకుండా విద్యార్థులకు నిరంతర సేవలను అందించడం కోసం.. పోర్టల్ స్థిరత్వంసర్వర్ సామర్థ్యంలాగిన్ నిర్వహణపేమెంట్ గేట్‌వే అనుసంధాన ప్రక్రియలను సమీక్షించే బాధ్యతను.. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లుడిజిటల్ వ్యవస్థల నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాంకేతిక బృందానికి అప్పగించారు.

విద్యా మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.  

***


(రిలీజ్ ఐడి: 2266433) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil