వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖరీఫ్ సన్నద్ధతను వేగవంతం చేసిన కేంద్రం: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


భారత వ్యవసాయ భవితను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఖరీఫ్ సదస్సులో ఏకమైన ‘టీమ్ అగ్రికల్చర్’

ప్రతి రాష్ట్రానికీ విభిన్న వ్యవసాయ విధానం ఉన్నందున ప్రాంతీయ వ్యూహాలు తక్షణ అవసరం

చరిత్రాత్మకంగా 376 మిలియన్ టన్నులకు పైగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిన భారత్

ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్

పప్పుధాన్యాలు, నూనెగింజల రంగంలో స్వయం-సమృద్ధి సాధనకు ప్రాధాన్యం

వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం దాకా... కొత్త వ్యవసాయ రోడ్‌మ్యాప్‌ రూపొందించనున్న ఖరీఫ్ సదస్సు: శ్రీ చౌహాన్

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 5:23PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్‌లో ఖరీఫ్ సదస్సు-2026 గురించి విలేకరుల సమావేశంలో ప్రసంగించారుఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... దేశంలో ఆహార భద్రతను నిర్ధారించడంరైతుల జీవనోపాధిని మెరుగుపరచడంపౌరులకు పౌష్టికాహారాన్ని అందించడం కేంద్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాలుగా ఉన్నాయన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారుజాతీయ ఖరీఫ్ ప్రచారం-2026 పై రెండు రోజుల వ్యవసాయ సదస్సును ఈ నెల 2829 తేదీల్లో న్యూఢిల్లీలోని పూసాలో గల ఎన్ఏఎస్‌సీ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నారుఈ సదస్సులో దేశవ్యాప్త వ్యవసాయ మంత్రులుశాస్త్రవేత్తలుఉన్నతాధికారులతో పాటు ఐసీఏఆర్రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటున్నారురాబోయే ఖరీఫ్ సీజన్ సన్నాహాలపై ఈ రెండు రోజుల్లో సవివరమైన చర్చలుసమీక్షలు నిర్వహిస్తారు.

ఖరీఫ్ సదస్సులో ఏకమైన ‘టీమ్ అగ్రికల్చర్’

ఈ ఖరీఫ్ సదస్సు 'టీమ్ అగ్రికల్చర్మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని శ్రీ చౌహాన్ అన్నారు'టీమ్ అగ్రికల్చర్అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదనీ... రాష్ట్ర ప్రభుత్వాలుభారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలుకేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికారులురైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులువ్యవసాయ రంగానికి సంబంధించిన భాగస్వాములందరూ ఇందులో భాగమని ఆయన స్పష్టం చేశారువ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమనీరాష్ట్రాల చురుకైన భాగస్వామ్యంతోనే ఈ రంగంలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారుకేంద్రం మధ్యవర్తిగాభాగస్వామిగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారుఈ సదస్సులో ఖరీఫ్రబీ పంటల సన్నాహాలు... నాణ్యమైన విత్తనాల లభ్యతక్షేత్రస్థాయిలో వివిధ వ్యవసాయ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం వంటి అంశాలపై చర్చిస్తారని తెలిపారు.

ఈ సమావేశానికి ముందే రాష్ట్రాలతో వీడియో అనుసంధానం ద్వారా సమావేశాలు జరిగాయనీఈ సమావేశాల్లో పలు అంశాలపై విస్తృతంగా చర్చించామనీ కేంద్ర మంత్రి తెలిపారుఈ సంప్రదింపుల ఆధారంగారాష్ట్రాలు వారి సన్నద్ధతా ప్రణాళికలతో ఈ సమావేశానికి హాజరైనట్లు ఆయన పేర్కొన్నారురాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై కూలంకషంగా చర్చించడంతో పాటుసమన్వయ ప్రయత్నాల ద్వారా ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలని ఆయన సూచించారు.

గతంలో ఈ సదస్సు ఒక రోజు కార్యక్రమంగా జరిగేదిదేశ పరిమాణంవైవిధ్యం దృష్ట్యా ఒకే రోజులో సమగ్ర చర్చలు పూర్తి చేయడం సాధ్యపడలేదుఈ సంవత్సరం సదస్సు మొదటి రోజున వివిధ రాష్ట్రాల అధికారులు బృందాలుగా ఏర్పడి కూలంకషంగా చర్చలు జరుపుతుండగా... రెండో రోజున రాష్ట్ర వ్యవసాయ మంత్రులు ఈ చర్చల్లో పాల్గొంటారు.

విభిన్న వ్యవసాయ పరిస్థితుల కోసం ప్రాంతీయ స్థాయి చర్చలు ప్రారంభం

దేశానికి ఉన్న విస్తారమైన భౌగోళికవాతావరణ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని... ప్రభుత్వం జాతీయ వ్యవసాయ సదస్సుకు మించి సంప్రదింపుల ప్రక్రియను విస్తరించిందిఇప్పుడు ప్రాంతీయ సదస్సులనూ నిర్వహించడం ప్రారంభించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారుజైపూర్లక్నోభువనేశ్వర్‌లలో ఇప్పటికే మూడు ప్రాంతీయ సదస్సులు జరిగాయని ఆయన తెలియజేశారుఈశాన్యదక్షిణ భారత్ కోసం మరో రెండు సదస్సులను ప్రతిపాదించగా... వాటి తేదీలనూ త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలిపారు.

ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యవసాయ పద్ధతులువాతావరణ పరిస్థితులు గణనీయంగా మారుతుంటాయనీ... అందుకే ప్రాంతీయ స్థాయి చర్చలు మరింత ఆచరణాత్మకంగాప్రభావవంతంగా ఉంటాయని శ్రీ చౌహాన్ అన్నారు. "రాష్ట్రాలతో చిన్న బృందాలుగా చర్చలు జరిపినప్పుడు... ప్రతి రాష్ట్రానికి సంబంధించిన నిర్దిష్ట సమస్యలుఅవసరాలపై వివరంగా చర్చించడం సాధ్యమవుతుందిఅని ఆయన అన్నారుభవిష్యత్తులో వ్యవసాయ-వాతావరణ మండలాల ఆధారంగా ప్రాంతీయ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారుఐసీఏఆర్ వర్గీకరణను ప్రస్తావిస్తూ... దేశాన్ని స్థూలంగా ఎనిమిది వ్యవసాయ-వాతావరణ మండలాలుగా విభజించవచ్చని ఆయన అన్నారు. "కేవలం ఐదు మండలాల ఆధారంగా కాకుండాఈ ఎనిమిది మండలాల ఆధారంగా ప్రాంతీయ సమావేశాలను నిర్వహించడం కోసమే మా ప్రయత్నంతద్వారా వ్యవసాయ వ్యూహాలుపథకాలు క్షేత్రస్థాయికి సమర్థంగా చేరతాయిఅని ఆయన జోడించారుఖరీఫ్ సమావేశానికి సంబంధించిన ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ సిద్ధం చేశామనీఇందులో వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై విస్తృత చర్చలు ఉన్నాయని ఆయన తెలియజేశారు.

గోధుమవరిమొక్కజొన్ననూనెగింజల పంటల్లో రికార్డు స్థాయి ఉత్పత్తి

వ్యవసాయ రంగం సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ... రైతుల కృషిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానపరమైన మద్దతుశాస్త్రీయ పరిశోధనరాష్ట్రాల సహకారం వల్ల ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ గత రికార్డులన్నింటినీ అధిగమించిందని శ్రీ చౌహాన్ అన్నారు. "రైతుల కృషిప్రభుత్వ పథకాలుకొత్తగా అభివృద్ధి చేసిన విత్తన వంగడాల వల్లే ఈ ఏడాది దేశం రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధించిందని చెప్పడానికి వ్యవసాయ మంత్రిగా నాకు ఎంతో సంతృప్తిగా ఉందిఅని ఆయన వ్యాఖ్యానించారు. 2025-26 సంవత్సరానికి భారత మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 376.563 మిలియన్ టన్నులకు చేరుకుందనీఇది గత ఏడాది కంటే దాదాపు 18.8 మిలియన్ టన్నులు అధికమని కేంద్ర మంత్రి తెలిపారువరి ఉత్పత్తిలోనూ భారత్ సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. "వరి ఉత్పత్తి 154.024 మిలియన్ టన్నులకు చేరుకుందిదీంతో భారత్ ఇప్పుడు చైనాను అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచిందిఅని ఆయన అన్నారుగోధుమ ఉత్పత్తి 120.657 మిలియన్ టన్నులకు చేరుకోగామొక్కజొన్న ఉత్పత్తి 55.092 మిలియన్ టన్నులుగా నమోదైంది ఈ రెండూ రికార్డు స్థాయిలేనని కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ వివరించారు.

నూనెగింజల ఉత్పత్తిలోనూ దేశం గణనీయ రికార్డులను సాధించిందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారుఈ ఏడాది నూనెగింజల ఉత్పత్తి 43.059 మిలియన్ టన్నులుగా అంచనా వేశారువేరుశనగ ఉత్పత్తి 13.074 మిలియన్ టన్నులకు చేరుకోగాఆవాల ఉత్పత్తి 13.768 మిలియన్ టన్నులకు పెరిగిందిఈ రెండూ రికార్డు స్థాయిలో ఉన్నాయిపప్పుధాన్యాల ఉత్పత్తి చెప్పుకోదగిన వృద్ధిని నమోదు చేసిందనీరాబోయే సంవత్సరాల్లో మరింత పెరుగుదలకు అత్యంత అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఖరీఫ్ వ్యూహంపై జాతీయ స్థాయి చర్చలు

పప్పుధాన్యాలునూనెగింజల కోసం ప్రత్యేక మిషన్లను ఏర్పాటు చేశామనీవిత్తన నాణ్యతను మెరుగుపరచడంవిత్తన మార్పిడి రేట్లను పెంచడంప్రదర్శనలుప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై రాష్ట్రాలతో విస్తృతంగా చర్చిస్తామని కేంద్ర మంత్రి తెలిపారుదేశంలో ఉద్యానవన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందనిదీనికి అపారమైన సామర్థ్యం ఉందని శ్రీ చౌహాన్ అన్నారుఈ సదస్సులో ఉద్యానవన సమగ్ర అభివృద్ధి మిషన్కాటన్ మిషన్‌పైనా చర్చలు జరుగుతాయన్నారువాతావరణ మార్పును వ్యవసాయానికి ఒక ప్రధాన సవాలుగా అభివర్ణిస్తూ... మారుతున్న వాతావరణ సరళిఅస్తవ్యస్తమైన వర్షపాతం వ్యవసాయ పరిస్థితులను వేగంగా మారుస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. “ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయిఒకేసారి అధిక వర్షపాతం కురిసిఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు పొడి వాతావరణం ఉంటున్న సందర్భాలూ ఉన్నాయిఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని సురక్షితంగాసుస్థిరంగా మార్చే చర్యలపై చర్చలు అవసరం” అని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయంభూసార కార్డులుఎరువుల సమతుల్య వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారుఅవగాహన లోపం కారణంగా చాలా మంది రైతులు ఎరువులను అధికంగా వాడుతున్నారనీవాటిని సమతుల్యంగా వాడటం అత్యవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారుచిన్నసన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సమీకృత వ్యవసాయ నమూనాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. "దేశంలో వ్యవసాయ క్షేత్రాల పరిమాణం చిన్నదిఅందువల్లపరిమిత భూమిలో రైతులు ఎలా అధిక ఆదాయం సంపాదించగలరనే దానిపై చర్చల్లో ప్రధానంగా దృష్టి సారిస్తాంఅని ఆయన అన్నారు.

వ్యవసాయానికి తగినంత ఆర్థిక సహాయం ప్రాముఖ్యతనూ కేంద్ర మంత్రి స్పష్టం చేశారురైతులకు కేవలం పంట ఉత్పత్తికే కాకుండా... పంటల కోతల అనంతర నిర్వహణనష్ట నివారణకూ మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారురాష్ట్రాలవారీగా వ్యవసాయ రుణాల పంపిణీ అసమానంగా ఉందనీకొన్ని రాష్ట్రాలు ఇతర వాటి కంటే గణనీయంగా తక్కువ వ్యవసాయ రుణాలను పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. "రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులుతగినంత పెట్టుబడి మూలధనం అందుబాటులో ఉంటే... వారు మెరుగైన వ్యవసాయ పద్ధతులను చేపట్టగలుగుతారుఅని శ్రీ చౌహాన్ వ్యాఖ్యానించారు.

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిపీఎం-ఆశా పథకండిజిటల్ వ్యవసాయంరైతు గుర్తింపు కార్డు (ఫార్మర్ ఐడీ)రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓలనుబలోపేతం వంటి అంశాలపైనా ఈ సదస్సులో చర్చిస్తారని కేంద్ర మంత్రి తెలిపారుఈ చర్చల కోసం రాష్ట్రాలను వేర్వేరు బృందాలుగా విభజించారురోజంతా ఈ బృందాల మధ్య సవివరమైన చర్చలు జరుగుతాయిమరుసటి రోజునరాష్ట్ర వ్యవసాయ మంత్రుల సమక్షంలో వివిధ వ్యవసాయ అంశాలపై ప్రజెంటేషన్లు ఉంటాయిఖరీఫ్ పంట కాలానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక ఉమ్మడి వ్యవసాయ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తాయి'ఖేత్ బచావో అభియాన్పైనా ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తామని శ్రీ చౌహాన్ తెలిపారుసమష్టిగా నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహిత సమన్వయంతో పనిచేస్తాయని ఆయన జోడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2266420) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Gujarati , Kannada