గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెంగళూరు సమీక్షల సందర్భంగా పెండింగ్‌లో ఉన్న మైనింగ్‌, అన్వేషణ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించిన కేంద్రమంత్రి జి. కిషన్‌ రెడ్డి


బెంగళూరులో జీఎస్‌ఐ, ఎన్‌ఐఆర్‌ఎం, ఐబీఎం సంస్థల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహించిన మంత్రి.. గురుదేవ్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌ ఆశీస్సులు అందుకున్న కేందమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 MAY 2026 3:09PM by PIB Hyderabad

భారతదేశ ఖనిజ భద్రతనువ్యూహాత్మక వృద్ధి లక్ష్యాలను బలోపేతం చేయటానికి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలనిమిషన్‌ మోడ్‌ విధానాన్ని అవలంబించాలని మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని మైనింగ్ఎక్స్‌ప్లోరేషన్‌ సంస్థలను సోమవారం కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ఆదేశించారు.

"అన్ని సంస్థలు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలిసాంకేతికతపారదర్శకతసామర్థ్యాలు ప్రతి సంస్థాగత ప్రక్రియకు పునాదిగా నిలిచేలా చూడాలిఈ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఏజెన్సీ నుంచి భారతదేశ ప్రజలుభారత ప్రభుత్వం.. వేగంజవాబుదారీతనంస్పష్టమైన ఫలితాలను ఆశిస్తున్నాయిఅని కేంద్రమంత్రి అన్నారుబెంగళూరులో జియోలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ (ఎన్‌ఐఆర్‌ఎం), ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ (ఐబీఎం), రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ ఏరియల్‌ సర్వే (ఆర్‌ఎస్‌ఏఎస్‌విభాగాల సీనియర్ అధికారులతో నిర్వహించిన వరుస ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయటంశాస్త్రీయసాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయటంస్థిరమైన మైనింగ్‌ పద్ధతులను ప్రోత్సహించటంవికసిత్‌ భారత్‌-2047 జాతీయ సంకల్పానికి అనుగుణంగా సంస్థాగత ప్రయత్నాలను ఒకే తాటిపైకి తీసుకురావటంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి.

సమావేశం సందర్భంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రాజెక్టులుసాంకేతిక పురోగతులుఅన్వేషణ కార్యకలాపాలను మంత్రి సమీక్షించారుముఖ్యంగా అరుదైన భూ మూలకాలు (ఆర్‌ఈఈ), లిథియంనికెల్కోబాల్ట్టంగ్‌స్టన్వెనడియంప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ (పీజీఈవంటి కీలకవ్యూహాత్మక ఖనిజాల రంగానికి సంబంధించి సమీక్ష చేశారుభారతదేశ ఖనిజ భద్రతనువ్యూహాత్మక వృద్ధి లక్ష్యాలను బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న వనరుల పెంపుఖనిజ నిర్ధారణశాస్త్రీయ సర్వేలుగనుల సుస్థిరతజియోస్పేషియల్ టెక్నాలజీలుఅధునాతన అన్వేషణ వ్యవస్థలపై మంత్రికి సమగ్ర నివేదికను సంబంధిత సంస్థలు సమర్పించాయి.

అధికారులను ఉద్దేశించి శ్రీ జికిషన్‌ రెడ్డి మాట్లాడారు. "గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వందూరదృష్టితో భారత్ స్వావలంబనప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థ దిశగా దృఢంగా సాగుతోందిభారతదేశ భవిష్యత్ వృద్ధిపారిశ్రామిక విస్తరణవ్యూహాత్మక ఖనిజ భద్రతకు గనుల తవ్వకంఅన్వేషణ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయిఅని అన్నారు.

అన్ని సంస్థలు స్పష్టమైన సమయపాలనకొలవగల ఫలితాలుమరింత జవాబుదారీతనంతో సమన్వయంతో మిషన్-మోడ్ విధానంలో పనిచేయాలని ఆదేశించారు.

భారతదేశ అన్వేషణ వ్యవస్థను బలోపేతం చేయటంలో అధునాతన సాంకేతికతలుడేటా ఇంటిగ్రేషన్‌శాస్త్రీయ ఆవిష్కరణల ప్రాముఖ్యతను మంత్రి స్పష్టం చేశారు.

"ఏఐరిమోట్ సెన్సింగ్ఇంటిగ్రేటెడ్ జియోసైన్స్ అనలిటిక్స్అధునాతన అన్వేషణ పద్ధతుల్లో సాంకేతిక ఆధారిత వ్యవస్థలపైనే ఖనిజ తవ్వకాల భవిష్యత్ ఆధారపడి ఉందిభారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచేందుకువనరుల పరంగా సురక్షితంగా ఉండేలా చేసే దిశగా పరివర్తనలో మన సంస్థలు ముందుండాలిఅని ఆయన అన్నారు.

ఎంఎండీఆర్‌ సవరణ చట్టం-2015 ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణల తర్వాత కర్ణాటకగోవాలో ఖనిజ వనరులు గణనీయంగా పెరగటంతో పాటు బంగారంరాగిపీజీఈనికెల్కోబాల్ట్ వంటి ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా పేర్కొందిదీనితో పాటు దాదాపు 48,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తృత-స్థాయి థీమాటిక్ మ్యాపింగ్ఏఐఎంఎల్‌ ఆధారిత ఖనిజ అన్వేషణఅధునాతన దశల తవ్వకాల ప్రాజెక్టులతో ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను కూడా జీఎస్ఐ వివరించింది.

జాతీయ ప్రాధాన్యత గల మౌలిక సదుపాయాలుగనుల భద్రతా ప్రాజెక్టులకు అందించిన సహకారాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ప్రదర్శించిందిఇందులో జలవిద్యుత్మెట్రో రైల్టన్నెల్ ఇంజనీరింగ్భూకంప పర్యవేక్షణసున్నితమైన మౌలిక సదుపాయాల సమీపంలో నియంత్రిత పేలుళ్ల వంటి రంగాలున్నాయిదీనితో పాటు వ్యూహాత్మక జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతుగా రాక్ మెకానిక్స్ఇంజనీరింగ్ జియాలజీ (భూగర్భ శాస్త్రం), సూక్ష్మ భూకంపాల పర్యవేక్షణజియోటెక్నికల్ పరిష్కారాల్లోని సామర్థ్యాలను ఈ సంస్థ తెలియజేసింది.

పర్యావరణ పరిరక్షణ చర్యలువేలం వేసిన ఖనిజ బ్లాకులను అందుబాటులోకి తీసుకురావటంశాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేతఖనిజ శుద్ధీకరణసుస్థిర గనుల విధానాల్లో సాధించిన పురోగతిని భారతీయ గనుల బ్యూరో సమీక్షించిందిజాతీయ కీలక ఖనిజాల మిషన్ ద్వారా ప్రస్తుతమున్న మైనింగ్‌ వ్యవస్థల నుంచి కీలకమైన ఖనిజాల సుసంపన్నతవెలికితీత సామర్థ్యానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను ఐబీఎం సమర్పించింది.

నేషనల్‌ ఏరో-జియోఫిజికల్ మ్యాపింగ్ ప్రోగ్రాం (ఎన్‌ఏజీఎంపీద్వారా సాధించిన పురోగతిని ఆర్‌ఎస్‌ఏఎస్‌ విభాగం సమర్పించిందిఇందులో వైమానిక భూభౌతిక సర్వేలుహైపర్‌స్పెక్ట్రల్ రిమోట్ సెన్సింగ్ఏఐఎంఎల్‌ ఆధారిత ఖనిజ అన్వేషణ మ్యాపింగ్ వంటి అంశాలున్నాయిఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 6.5 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా ప్రాంతాన్ని కవర్ చేసినట్లుఏరో-జియోఫిజికల్ డేటాసెట్లను ఉపయోగించి 200కు పైగా ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులను రూపొందించినట్లు ఈ సమీక్ష స్పష్టం చేసింది.

బెంగళూరు పర్యటనలో భాగంగా గౌరవ కేంద్రమంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను సందర్శించి.. అక్కడి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కుటుంబసభ్యులతో ముచ్చటించారుఈ సందర్భంగా ఆయన గురుకులాన్నిఎగ్జిబిషన్ సెంటర్‌ను సందర్శించారుభారత సాంస్కృతిక వారసత్వానికి కట్టుబడి.. విలువలతో కూడిన విద్యఆధ్యాత్మిక అవగాహనసామాజిక మార్పు కోసం ఈ సంస్థ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.

శ్రీ శ్రీ రవిశంకర్‌ను కేంద్రమంత్రి కలిసిఆశీస్సులు తీసుకున్నారు.

ఈ పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. "వికసిత్ భారత్-2047 దిశగా సాగుతున్న భారత అభివృద్ధి ప్రయాణం కేవలం ఆర్థిక పురోగతిసాంకేతిక పురోభివృద్ధితో మాత్రమే కాక... ఆధ్యాత్మిక చైతన్యంసాంస్కృతిక విలువలుసమాజం పట్ల సామూహిక సేవాభావంతోనూ ముందుకు సాగాలిఅని శ్రీ జికిషన్‌ రెడ్డి అన్నారు.

వికసిత్‌ భారత్‌-2047 విజన్‌కు అనుగుణంగా శాస్త్రీయ పురోగతిసుస్థిరాభివృద్ధిసాంస్కృతిక విలువలుసంస్థాగత ప్రతిభ ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ పర్యటన ముగిసింది.


(రిలీజ్ ఐడి: 2265222) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada