ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి


ద్వైపాక్షిక సహకారంలో నిరంతర పురోగతిని పీఎంకి వివరించిన సెక్రటరీ రూబియో

వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అమెరికా దృక్పథాన్ని పంచుకున్న సెక్రటరీ రూబియో

శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని, సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చిన పీఎం

అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 23 MAY 2026 4:25PM by PIB Hyderabad

అమెరికా విదేశాంగ మంత్రి గౌరవ మార్కో రూబియో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

రక్షణవ్యూహాత్మక సాంకేతికతలువాణిజ్యంపెట్టుబడులుఇంధన భద్రతఅనుసంధానతవిద్యప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో నిరంతరం సాధిస్తున్న పురోగతిపై ప్రధానమంత్రికి సెక్రటరీ రూబియో వివరించారు.

పశ్చిమాసియా సహా పలు ప్రాంతీయప్రపంచ సమస్యలపై యూ.ఎస్‌దృక్పథాన్ని సెక్రటరీ రూబియో పంచుకున్నారు.

శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుచర్చలుదౌత్యపరంగా ఘర్షణలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని సెక్రటరీ రూబియోను ప్రధానమంత్రి కోరారుఇరుదేశాల మధ్య పరస్పర సంప్రదింపులు కొనసాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2264556) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Kannada , Malayalam