భారత ఎన్నికల సంఘం
శాసనసభలకు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు-2026
కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటంతో పాటు వేగవంతమైన నివేదికలను, మెరుగైన సైబర్ భద్రతను అందించే ఈసీఐనెట్
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 4:42PM by PIB Hyderabad
-
శాసనసభలకు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు-2026లో ఎన్నికల ప్రక్రియను క్రమబద్దీకరించటంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పటిష్ఠ ఐటీ వేదిక ఈసీఐనెట్ కీలక పాత్ర పోషించింది. నిశితంగా పర్యవేక్షించటం, వేగంగా నివేదికలను అందించటం, పారదర్శకతను పెంపొందించటంలో ఇది ఎంతగానో తోడ్పడింది.
-
జనవరి 2026లో అధికారికంగా ప్రారంభమైనప్పటి నుంచి ఈసీఐనెట్ యాప్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు 10 కోట్లకు పైగా డౌన్లోడ్లు అయ్యాయి. నవంబర్ 2025లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఈసీఐనెట్ బీటా వెర్షన్ను వినియోగించారు.
-
ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 9, 23, 29 తేదీల్లో ఈసీఐనెట్ను సందర్శించిన వారి సంఖ్య 98.3 కోట్లకు పైగా నమోదు కాగా, ఓట్ల లెక్కింపు రోజు మే 4, 2026న నిమిషానికి సగటున 3 కోట్ల మంది చూశారు.
-
ఓట్ల లెక్కింపు రోజున మన దేశం, ఇతర దేశాల నుంచి ఎన్నికల ఫలితాల పోర్టల్ లక్ష్యంగా జరిగిన 68 లక్షలకు పైగా సైబర్ దాడులను ఈసీఐనెట్ సైబర్ సెక్యూరిటీ సమర్థవంతంగా అడ్డుకుంది.
-
కౌంటింగ్ రోజున ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను పెంచే దిశగా ఈ ఎన్నికల్లో తొలిసారిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డు విధానాన్ని అమలు చేశారు.
-
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనధికార వ్యక్తులు రాకుండా అడ్డుకునేందుకు కేవలం అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించేలా 3.2 లక్షలకు పైగా క్యూఆర్ కోడ్లను రూపొందించారు.
***
(రిలీజ్ ఐడి: 2258556)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18