ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘స్వస్థ్ భారత్ పోర్టల్’ ప్రారంభం


దేశ ఆరోగ్య రంగంలో డిజిటల్ ప్రధాన మార్పులకు వేగాన్నందించడానికి

అనేక ఆరోగ్య సంబంధిత వ్యవస్థల ఏకీకరణ

ఒకే చోటులో అన్ని సదుపాయాలతో ‘స్వస్థ్ భారత్ పోర్టల్’.. ఏపీఐ మాధ్యమం ద్వారా కార్యక్రమాల ఏకీకరణ.. అంతర నిర్వహణీయతకు వీలు.. తగ్గనున్న పరిపాలన భారం

ఆరోగ్య కార్యక్రమాల్లో డేటా ఎంట్రీ పునరావృతిని నివారించే వేదిక ఇది.. రిపోర్టింగ్ వ్యవస్థీకరణ..సత్వర నిర్ణయాలు

ఏబీడీఎమ్ అనుగుణంగా ‘స్వస్థ్ భారత్ పోర్టల్’.. సురక్షిత స్వాస్థ్య డేటాను ఇచ్చి పుచ్చుకోవడానికీ, అంతర నిర్వహణీయ డిజిటల్ ఆరోగ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఏబీహెచ్‌ఏ ఏకీకరణకీ మార్గం సుగమం

ప్రతిపాదిత లాభాలు: 20 నుంచి 30 శాతానికి తగ్గనున్న మౌలిక సదుపాయాల భారం... 20 నుంచి 40 శాతానికి తగ్గనున్న డేటా ఎంట్రీ, మానవ వనరుల భారం

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 11:05AM by PIB Hyderabad

దేశ ఆరోగ్యసంరక్షణ రంగంలో మరో ముఖ్యమైన మార్పునకు శ్రీకారం చుట్టారు. ‘స్వస్థ్ భారత్ పోర్టల్‌’దీనిని ఇటీవల ‘‘నూతన ఆవిష్కరణలుసమ్మిళితత్వంభారత ఆరోగ్య భవిష్యత్తుకు రూపాన్నిచ్చే అత్యుత్తమ అభ్యాసాలు’’ అంశంపై పదో జాతీయ శిఖరాగ్ర సదస్సును నిర్వహించిన సందర్భంగా ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఈ పోర్టల్ ను ప్రారంభించారుఇది మరింత ఏకీకరించినసమర్థమైనవిస్తరణకు అనువైన డిజిటల్ ప్రజారోగ్య ప్రణాళిక దిశగా మరో కీలక మార్పునకు ఒక నిదర్శనమని చెప్పవచ్చు.

 

 

వివిధ జాతీయ స్వాస్థ్య కార్యక్రమాల్లో భాగంగా సేవల అందజేతపర్యవేక్షణరిపోర్టింగ్ ప్రక్రియలలో సహాయాన్ని అందించడానికి అనేక డిజిటల్ అప్లికేషన్లను ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఎఫ్‌డబ్ల్యూగత కొన్ని సంవత్సరాల కాలంలో అభివృద్ధిపరిచిందిఈ వేదికలు పెద్ద ఎత్తున డిజిటల్ సమాచార సమీకరణకు దోహదం చేశాయికానీ వీటిలో చాలా అప్లికేషన్లను విడి విడిగా నిర్వహిస్తున్నారుదీంతో ఒకే రకం ప్రయత్నాల్నే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తోందిడేటాసెట్స్ చీలికలువాలికలు అవుతున్నాయివనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు.

 

ఈ సవాలును అధిగమించడానికి స్వస్థ్ భారత్ పోర్టల్‌ను ఒక సమష్టి వేదిక (యాగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్)గా తెర మీదకు తీసుకు వచ్చారుఇది ఏపీఐ-ఆధారిత ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ ద్వారా ప్రస్తుత అప్లికేషన్లను ఏకీకరిస్తుందిఅంతర నిర్వహణీయతకీకలయికకీ మార్గాన్ని సుగమం చేస్తుందికార్యక్రమాలన్నిటినీ ఒక ఏకీకరించిన డిజిటల్ స్థాయికి తీసుకురావడం సాధ్యపడుతోందిఏకీకృత డిజిటల్ లేయర్‌.. అనేక జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఒకే తెరపైకి తీసుకువస్తుందిదీంతో పలుమార్లు లాగిన్ అయ్యేప్రతి సారీ డేటాను ఎంటర్ చేసే అగత్యం ఇకపై ఎదురవదుఅంతేకాదుఆరోగ్య సేవల్ని అందించే సంస్థలపై పరిపాలనపరమైన భారం గణనీయంగా తగ్గిపోతుందిఅదే సమయంలోఅన్ని స్థాయుల్లోనూ సామర్థ్యం మెరుగుపడుతుంది.

భారత్‌లో ముందు వరుసలోని ఆరోగ్య కార్యకర్తలు, ‘ఆశా’ (ఏఎస్‌హెచ్ఏకార్యకర్తలుఏఎన్ఎమ్‌లుసీహెచ్ఓలువైద్య అధికారుల (ఎమ్ఓస్)కు తరచు కార్యక్రమాల వివరాలను నమోదు చేసేందుకు అనేక రకాల అప్లికేషన్లను ఉపయోగించడానికి చాలా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ‘స్వస్థ్ భారత్ పోర్టల్’ రూపంలో ఒకే వేదికను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇకపై ఈ సమస్య ఉండదుడేటా తేలికగా సేకరించవచ్చుడేటా విజువలైజేషన్ టూల్స్థానికంగా పర్యవేక్షణసాక్ష్యాధారిత ప్రణాళిక రచన కోసం డేటాను ఉపయోగించుకొనే సౌలభ్యాలు సమకూరుతాయిఈ పోర్టల్ ఏబీడీఎమ్‌కు అనుగుణంగా ఏబీహెచ్ఏ (ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా)తో పాటుఏకీకరణకూ మద్దతిస్తుందిఫలితంగా రోగి ఆరోగ్య రికార్డును ఎలాంటి ఇబ్బందీ లేకుండాసురక్షితంగా ఇచ్చి పుచ్చుకోవడం సాధ్యపడుతుందిఒక విస్తృతఅంతర నిర్వహణీయ డిజిటల్ ఆరోగ్య అనుబంధ విస్తారిత వ్యవస్థలాగా అభివృద్ధి పరిచే దృష్టితో డిజైన్ చేశారుఆరోగ్యసంరక్షణ రంగ వృత్తినిపుణుల రిజిస్ట్రీ (హెల్త్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ.. హెచ్‌పీఆర్), ఆరోగ్య సదుపాయాల రిజిస్ట్రీ (హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ.. హెచ్ఎఫ్ఆర్వంటి జాతీయ రిజిస్ట్రీలతో కలుపుతారు.

 

స్వస్థ్ భారత్ పోర్టల్‌’లో…. :

• మౌలిక సదుపాయాల్లో పునరావృతాన్ని తగ్గించడంవివిధ కార్యక్రమాల్లో స్వతంత్ర హోస్టింగుస్టోరేజీకంప్యూట్ వనరులను కొనసాగిస్తారుస్వస్థ్ భారత్ పథకం మాధ్యమం ద్వారా వీటిని జోడించడం పూర్తి చేసినప్పుడుఈ దశలు తగ్గిపోతాయి.

• డేటాను ప్రతిసారీ నమోదు చేయడం తగ్గుతుందిఒకే విధమైన లబ్ధిదారుల సమాచారాన్ని అనేక వేదికల్లో నమోదు చేసే ప్రక్రియకు బదులు ఇక ఒకే వేదికపై నమోదు చేస్తారుదీంతో అనేక సార్లు చేయాల్సిన పని తగ్గుతుంది.

• ఏకీకరించిన మానవ వనరులు (హెచ్ఆర్రంగంలోకిఅన్ని కార్యక్రమాల్లోనూ వేర్వేరు అభివృద్ధినిర్వహణ (మెయింటెనెన్స్బృందాల అవసరం ఉండేదిఇప్పుడు ఏకీకరించిన వ్యవస్థతోమానవ వనరుల భారం తగ్గుతుంది.

• మెరుగుపడనున్న అంతర నిర్వహణీయతసిస్టమ్‌ను ఏపీఐ మాధ్యమం నుంచి ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ విధానంలోకి మార్చిన కారణంగా అంతర నిర్వహణీయత అధికమవుతుంది.

స్వస్థ్ భారత్ పోర్టల్’ రాకతో ప్రస్తుతం వివిధ కార్యక్రమ విభాగాల ద్వారా నిర్వహిస్తున్న వ్యక్తిగత పోర్టళ్లతో పోలిస్తే మానవ వనరులుసమయంఐటీ మౌలిక స్వరూపం.. ఈ అంశాల్లో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పొదుపునకు ఆస్కారం ఏర్పడుతుందిస్వస్థ్ భారత్ పోర్టల్ ఒక ఏకీకరించినసమర్థమైనవిస్తరణకనువైన డిజిటల్ ప్రజా మౌలిక స్వరూపం దిశగా మార్పునకు రంగాన్ని సిద్దం చేస్తుందిదీంతో సామర్థ్యంలో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదవుతుంది.

• మౌలిక సదుపాయాలుదాదాపు 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతాయి

• డేటా నమోదుకు పట్టే సమయంసుమారు 20 నుంచి 40 శాతం వరకు తగ్గుతాయి

• మానవ వనరుల పునరావృతంఇంచుమించు 20 నుంచి 40 శాతం వరకూ తగ్గుతాయి

• నిర్ణయాలు తీసుకోవడంలో వేగంపెరుగుతుంది

ఈ విధంగా, దేశ ప్రజారోగ్య వ్యవస్థలో కలయిక (కన్వర్జెన్స్), సామర్థ్యండేటా చోదకశక్తిగా నిలిచే పరిపాలనల దిశగా పరివర్తన ప్రధానమైన ప్రయాణానికి ‘స్వస్థ్ భారత్ పోర్టల్’ ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2258375) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Gujarati