ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిస్వార్థ సేవ, కరుణ భావననూ


చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 9:12AM by PIB Hyderabad

నిస్వార్థ సేవా భావనతో చేసే పనే సిసలైన మానవత్వమని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారుఅలాంటి పనులు మనసుకు సంతోషాన్ని కలిగించడంతో పాటుసమాజ సంక్షేమానికీ తోడ్పాటును అందిస్తాయని ఆయన తెలిపారు.
‘‘
అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా
అనుగ్రహశ్చ దానం చ శీలమేతత్ప్రశస్యతే’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి  పంచుకున్నారు.

ఏ జీవి పట్ల అయినా సరేమనస్సుతోవాక్కుతోకర్మల పరంగా ద్వేషాన్ని పెంచుకోకూడదు. అన్నిటి పట్ల కరుణ భావనతో మెలగాలిఉదార బుద్ధితో దానం చేయాలిఈ కార్యాలను అత్యున్నత నడవడికగా గుర్తించాలనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు ఇస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘
నిస్వార్ధ బుద్ధితో చేసిన పనే నిజమైన మానవత అనిపించుకుంటుందిదీంతో అంతరంగానికి ఆనందం కలుగుతుందిసమాజానికి కూడా మేలు జరుగుతుంది.
‘‘
అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా
అనుగ్రహశ్చ దానం చ శీలమేతత్ప్రశస్యతే’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2258304) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Gujarati , Malayalam