పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో అంతర-మంత్రిత్వశాఖల తాజా సమాచారం


· దేశంలో ఎరువుల నిల్వలు సరఫరాలు అవసరాలను మించి ఉన్నందువల్ల లభ్యతకు భరోసా లభిస్తోంది

· పశ్చిమాసియా సంక్షోభం పర్యవసానంగా లభ్యత మెరుగు దిశగా సుమారు 84 లక్షల టన్నుల ఎరువులను అదనంగా సమీకరించారు

· ఎల్‌పీజీ సరఫరా కేంద్రాల్లో ఎక్కడా కొరత నమోదు కాలేదు… నిన్న పరిశ్రమల ప్రాతిపదికన ఆన్‌లైన్ సిలిండర్ బుకింగ్‌ 99 శాతానికి పెరిగింది

· దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 23.58 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లను విక్రయించారు

· ఈ ఏడాది మార్చి నుంచి సుమారు 6.12 లక్షల పీఎన్‌జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్ పూర్తి కాగా... అదనంగా 2.67 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు మౌలిక సదుపాయాలు కల్పించారు... దీంతోపాటు కొత్త కనెక్షన్ల కోసం సుమారు 6.79 లక్షల మంది దరఖాస్తు చేశారు

· పశ్చిమాసియాలోని భారతీయ నావికులందరూ సురక్షితం... గడచిన 24 గంటల్లో భారతీయ పతాకంగల నౌకలకు ఎలాంటి ఇబ్బందులూ కలగలేదు

· పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు అదనపు విమానాలు నడుస్తున్నందున పౌర విమాన సదుపాయం మెరుగవుతూనే ఉంది

నాడు పోస్టు చేయడమైనది: 04 MAY 2026 6:33PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తాజా సమాచారం తెలియజేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో పెట్రోలియం-సహజ వాయువు, ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు తమతమ శాఖల సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ మేరకు ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారత పౌరులకు చేయూత, మొత్తంగా కీలక రంగాల్లో స్థిరత్వానికి భరోసాపై చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఎరువులు-రసాయనాల మంత్రిత్వశాఖ ఎరువుల నిల్వ పరిస్థితి, లభ్యతపై స‌మాచార‌మిచ్చింది.

దేశంలో ఎరువుల నిల్వలు... లభ్యత

మొత్తం మీద ఎరువుల నిల్వల స్థితి (లక్షల టన్నుల్లో)

ఉత్పత్తి

నేటి పరిస్థితి

నిరుడు ఇదే రోజున పరిస్థితి

యూరియా

74.48

74.03

డీఏపీ

22.47

15.22

ఎన్‌పీకే

59.53

46.26

ఎస్‌ఎస్‌పీ

26.71

26.63

ఎంఓపీ

12.52

12.84

మొత్తం

195.71

174.98

·        ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా 390.54 లక్షల టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ-కుటుంబ సంక్షేమ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి మించి సుమారు 195.71 లక్షల టన్నుల మేర (అంటే 50శాతానికి పైగాఎక్కువ) అదనపు నిల్వలున్నాయి. ఇది సాధారణ స్థాయితో పోలిస్తే దాదాపు 33 శాతానికన్నా గణనీయంగా అధికం. ప్రభుత్వం అనుసరిస్తున్న మెరుగైన ప్రణాళిక, ముందస్తు నిల్వలు, సమర్థ రవాణా నిర్వహణను ఈ పరిస్థితి ప్రతిబింబిస్తుంది.

·        రాష్ట్రాలలో సరఫరా పటిష్ఠంగా ఉంది... ఈ మేరకు 2026 మే 1 నుంచి మే 30 వరకు  అవసరాలకు మించి లభ్యత గణనీయంగా అధికం. యూరియా అవసరం 2.66 లక్షల టన్నులు కాగా, లభ్యత 62.28 లక్షల టన్నులుగా ఉంది. డీఏపీ అవసరం 0.85 లక్షల టన్నులకుగాను లభ్యత 20.32 లక్షల టన్నులుగా, ఎంఓపీ అవసరాలు 0.22 లక్షల టన్నులకుగాను లభ్యత 7.60 లక్షల టన్నులుగా ఉంది. ఇక ఎన్‌పీకే 1.16 లక్షల టన్నులు అవసరం కాగా, లభ్యత 49.71 లక్షల టన్నులుగానూ, ఎస్‌ఎస్‌పీ అవసరం 0.55 లక్షల టన్నులకుగాను లభ్యత 24.60 లక్షల టన్నులుగానూ ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు పటిష్ఠ ప్రారంభాన్ని ఎరువుల నిల్వలు సూచిస్తున్నాయి.

ప్రధాన ఎరువుల చిల్లర ధర: ఎలాంటి మార్పు లేదు

ఉత్పత్తి

బస్తా ధర (రూ)

యూరియా

266.5

డీఏపీ

1350

టీఎస్‌పీ

1300

సంక్షోభం అనంతరం ఎరువుల దేశీయ ఉత్పాదన – దిగుమతులు (లక్షల టన్నుల్లో)

ఉత్పత్తి

సంక్షోభానంతర దేశీయ ఉత్పాదన

సంక్షోభం తర్వాత భారత రేవులకు దిగుమతులు

యూరియా

40.72

9.98

డీఏపీ

5.39

0.76

ఎన్‌పీకే

13.65

3.54

ఎస్‌ఎస్‌పీ

7.95

0

ఎంఓపీ

0

2.41

మొత్తం

67.71

16.69

·        సంక్షోభం అనంతరం అదనంగా సుమారు 84 లక్షల టన్నుల ఎరువులను సమీకరించారు.

·        ఈ ఏడాది ఏప్రిల్ నెలలో, యూరియా ఉత్పత్తి 25వ తేదీ నాటి 21.89 లక్షల టన్నులతో పోలిస్తే దేశీయ ఉత్పాదన దాదాపు 20.98 లక్షల టన్నులకు చేరింది.

·        అంతర్జాతీయ యూరియా టెండర్ కింద ఫిబ్రవరి నెలాఖరు  నుంచి ఇప్పటిదాకా భారత్‌ మొత్తం 38.07 లక్షల టన్నులు (ఆర్‌సీఎఫ్‌ 13.07 లక్షల టన్నులు, ఐపీఎల్‌ 25 లక్షల టన్నులు) సరఫరాను ఖరారు చేసుకుంది.

·        ప్రస్తుత (మే) నెలతోపాటు వచ్చే (జూన్‌) నెలలో భారత ఓడరేవులకు చేరనున్న ‘ఎస్‌ఓహెచ్‌’ నుంచి భారత్‌ సుమారు 6 లక్షల టన్నుల ఎన్‌పీకే ఎరువును సమీకరించింది.

·        డీఏపీ, టీఎస్‌పీ, అమ్మోనియం సల్ఫేట్ కోసం అంతర్జాతీయ టెండర్ కింద- భారత ఎరువుల కంపెనీలు 12 లక్షల టన్నుల డీఏపీ, 4 లక్షల టన్నుల టీఎస్‌పీ, 3 లక్షల టన్నుల అమ్మోనియం సల్ఫేట్ సమీకరణకు శుక్రవారం... అంటే- 24.04.2026న సమగ్ర గ్లోబల్ టెండర్‌ జారీచేసింది. తద్వారా సీజన్‌ గరిష్ఠ స్థాయికి చేరే సమయంలో లభ్యత తగినంతగా ఉంటుంది.

·        ఎరువుల ఉత్పాదకాలైన యూరియా, ఫాస్ఫరస్-పొటాషియం ఎరువుల లభ్యతను ఎరువుల శాఖ క్రమం తప్పకుండా సమీక్షిస్తోంది.

·        అవసరాల మేరకు ఎరువుల లభ్యతకు భరోసా ఇస్తూ ఇప్పటిదాకా 7 ‘ఈజీఓఎస్‌’ సమావేశాలు నిర్వహించగా, లభ్యత సంబంధిత చాలా సవాళ్లు పరిష్కారమయ్యాయి.

·        ఎరువుల విషయంలో భద్రత, స్థిరత్వం, పటిష్ఠం పరంగా పరిస్థితులను భారత్‌ చక్కగా నిర్వహిస్తోంది. దీంతో ప్రధాన ఎరువులన్నీ అవసరాలకు మించి లభ్యతకు భరోసా ఇస్తున్నాయి.

విద్యుత్‌ సరఫరా... ఇంధన లభ్యత

   పశ్చిమాసియాలో నానాటికీ పరిస్థితులు మారుతున్న దృష్ట్యా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయ సరఫరా దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ- ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా సమాచారం కిందివిధంగా ఉంది:

ప్రభుత్వ సూచనలు... పౌరులకు అవగాహన

·        పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతకు భరోసా ఇస్తూ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్న నేపథ్యంలో పౌరులు భయాందోళనలకు లోనై, వీటి కొనుగోలు కోసం ఆదుర్దా పడవద్దని సూచన జారీ చేసింది.

·        వదంతులను విశ్వసించవద్దని, కచ్చితమైన సమాచారం కోసం అధికార మార్గాల్లోనే అన్వేషించాలని సలహా ఇచ్చింది.

·        ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ వేదికలను ఉపయోగించాలి తప్ప సరఫరాదారులను ఆశ్రయించవద్దని సూచించింది.

·        పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాల్సిందిగా కోరింది.

·        ప్రస్తుత పరిస్థితులలో పౌరులంతా తమ రోజువారీ ఇంధన వినియోగంలో పొదుపు పాటించేందుకు తగినవిధంగా కృషి చేయాలని అభ్యర్థించింది.

ప్రభుత్వ సంసిద్ధత... సరఫరా నిర్వహణ

·        ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ దేశీయ ఎల్‌పీజీ, గృహ వినియోగ పీఎన్‌జీ, సీఎన్‌జీ 100 శాతం సరఫరా (రవాణా)కు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

·        వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాకు సంబంధించి ఆస్పత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ఔషద, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ తదితర రంగాలకూ ప్రాధాన్యం లభిస్తోంది. దీనికితోడు 2026 మార్చి 2, 3 తేదీల నాటి సగటు రోజువారీ సరఫరా ప్రాతిపదికన వలస కార్మికులకు 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.

·        శుద్ధి కర్మాగారల్లో ఉత్పత్తి పెంపు, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం సహా అటు సరఫరా... ఇటు డిమాండ్‌ వైపు ఆయా రంగాలకు ప్రాధాన్యత వంటి పలు హేతుబద్ధ చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

·        ఎల్‌పీజీ డిమాండ్‌ ఒత్తిడి తగ్గించే దిశగా కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చింది.

·        చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గు సరఫరా చేయాల్సిందిగా కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ సంస్థలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

·        గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్ల సౌలభ్యాన్ని వేగిరపరచాలని రాష్ట్రాలకు సూచించింది.

రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు.. సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ కృషి

·        నిత్యవసరాల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం సరఫరాపై పర్యవేక్షణతోపాటు అక్రమ నిల్వ-విక్రయాలపై చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.

·        పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ సహా నిత్యావసర వస్తువుల సరఫరా స్థితిగతుల పర్యవేక్షణ, నియంత్రణలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వాలకు పలుమార్లు లేఖ రాయడంతోపాటు వీడియో  కాన్ఫరెన్స్‌ మార్గంలోనూ ఈ అంశాన్ని పునరుద్ఘాటించింది.

·        కేంద్ర ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల్లో రెండు లేఖల ద్వారా తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా ఇస్తూ నిరంతర ప్రభుత్వ సమాచార ప్రదాన ఆవశ్యకతను స్పష్టం చేసింది. తదనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్ష కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 02.04.2026న (మంత్రిత్వశాఖలోని పీఎన్‌జీ విభాగ కార్యదర్శి అధ్యక్షత), 06.04.2026న (పీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన సమాచార-ప్రసార శాఖ, వినియోగదారు వ్యవహారాల విభాగం కార్యదర్శులతో) అధికారులు సమావేశమయ్యారు. అనంతరం కింద పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.

o   రోజువారీ విలేకరుల సమావేశం నిర్వహణ... క్రమం తప్పకుండా ప్రజలకు సలహాలు జారీ.

o   సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే సమాచారం, బూటకపు వార్తలపై నిశిత పర్యవేక్షణ, నిరోధం.

o   జిల్లా యంత్రాంగాల ద్వారా దైనందిన చర్యలు ముమ్మరం సహా ‘ఓఎంసీ’ల సమన్వయంతో తనిఖీ-దాడుల కొనసాగింపు.

o   వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలో   ఉత్తర్వుల జారీ.

o   రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ‘ఎస్‌కేఓ'ల కోసం సంబంధిత ఉత్తర్వులు జారీ.

o   పీఎన్‌జీ సహా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ప్రోత్సాహం.

o   ప్రత్యేకించి గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యంతోపాటు సరఫరా స్థిరత్వం కొనసాగించేలా 5 కిలోల ఎప్‌టీఎల్‌ సిలిండర్ల లక్షిత పంపిణీ.

o   అక్రమ నిల్వ-విక్రయాల నిరోధంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కంట్రోల్‌ రూములు, జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

o   అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోజువారీ విలేకరుల సమావేశం ద్వారా తాజా సమాచారం ప్రకటిస్తున్నాయి.

అమలు... పర్యవేక్షణ చర్యలు

·        ఎల్‌పీజీ నిల్వల నిర్వహణతోపాటు అక్రమ విక్రయాల నిరోధానికి దేశవ్యాప్తంగా పటిష్ఠ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న 1570కు పైగా దాడులు నిర్వహించారు.

·        దేశమంతటా ఆకస్మిక తనిఖీ ప్రక్రియను ‘ఓఎంసీ’లు బలోపేతం చేయడంతోపాటు నిరంతరం కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు 349 ఎల్‌పీజీ సరఫరా కేంద్రాలకు జరిమానా విధింపు సహా నిన్నటిదాకా 74 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల కార్యకలాపాలను నిలిపివేశారు.

ఎల్‌పీజీ సరఫరా

గృహోపయోగ వంటగ్యాస్‌ తాజా స్థితి:

·        ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల వల్ల ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది.

·        గృహ వినియోగదారులకు వంటగ్యాస్‌ సరఫరాకు ప్రాధాన్యం లభిస్తోంది.

·        దేశంలో ఎక్కడా ఎల్‌పీజీ సరఫరా కేంద్రాల వద్ద పంపిణీ ఆగిన సమాచారమేదీ లేదు.

·        పరిశ్రమల ప్రాతిపదికన నిన్న ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌ 99 శాతంగా నమోదైంది.

·        దారి మళ్లింపు నిరోధం, సరఫరా నిర్ధారణ కోడ్‌ (డీఏసీ) ఆధారిత సరఫరా దాదాపు 94 శాతానికి పెరిగింది. ప్రతి వినియోగదారు నమోదిత మొబైల్ నంబరుకు డీఏసీ వెళ్తుంది.

·        దేశంలోని ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలు నిన్న ఆదివారం కూడా పని చేయడం ద్వారా గృహ వినియోగదారులకు సిలిండర్ల సరఫరా చేశాయి.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా... కేటాయింపు చర్యలు

·        సంస్కరణ-అనుసంధానిత 10 శాతం కేటాయింపు సహా మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును సంక్షోభానికి మునుపటికి స్థాయిలో సుమారు 70 శాతానికి పెంచారు.

·        వలస కార్మికులకు 2026 మార్చి 2-3 తేదీల నాటి సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ప్రాతిపదికన 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితికి మించి, ప్రతి రాష్ట్రంలో వారికి 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల దైనందిన పరిమాణాన్ని రెట్టింపు చేయాలని 06.04.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సూచించింది. తదనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే ‘ఓఎంసీ’ల సహాయంతో సరఫరా చేయడం కోసం ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అక్కడి ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి.

·        ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా 23.58 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించారు.

·        దేశంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’లు 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి 10,170కు పైగా అవగాహన శిబిరాలను నిర్వహించి, సుమారు 1,76,500 సిలిండర్లను విక్రయించాయి.

·         ‘ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌” ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో నియమించిన త్రిసభ్య కమిటీ నిరంతరం రాష్ట్ర అధికారులు, పారిశ్రామిక సంస్థలతో సంప్రదిస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్‌పీజీ విక్రయ ప్రణాళికను ఖరారు చేస్తుంది.

·        2026 ఏప్రిల్ నుంచి మొత్తం 2,15,332 టన్నుల (113.33 లక్షలకు పైగా 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లకు సమానం) వాణిజ్య ఎల్‌పీజీ విక్రయించారు.

·        ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’ల ద్వారా మొత్తం 11106 టన్నుల ఆటో ‘ఎల్‌పీజీ’ని  విక్రయించారు.

 సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు

డీ-పీఎన్‌జీ, సీఎన్‌జీ-రవాణాకు 100 శాతం సరఫరాలతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.

ఎరువుల కర్మాగారాలకు కేటాయించే మొత్తం గ్యాస్‌ను, వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 98 శాతానికి పెంచారు.

అదనంగా, సీజీడీ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సరఫరాలు సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.

వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి సీజీడీ సంస్థలు తమ అన్ని జిఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.

ఐజీఎల్, ఎమ్‌జీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.

ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.

పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.

రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తేదీ 24.03.26 నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేయడానికి, 'తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధాన ప్రణాళిక'ను 3 నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తోంది.

నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను 24.03.2026 తేదీ గల గెజిట్ ద్వారా భారత ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లు వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తాయి. ఇవి అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తాయి. ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.

డీ-పీఎన్‌జీ కనెక్షన్‌లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది. పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.

పరిశుద్ధమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం... సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు, వాణిజ్య ఎల్‌పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.

ఎమ్‌వోఈఎఫ్‌సీసీ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా... సీజీడీ నెట్‌వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్‌పీసీబీ, పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.

మార్చి 2026 నుంచి, సుమారు 6.12 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లకు గ్యాసిఫికేషన్ పూర్తయింది. అదనంగా 2.67 లక్షల కనెక్షన్‌ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్‌ల సంఖ్య 8.79 లక్షలకు చేరింది. కొత్త కనెక్షన్‌ల కోసం సుమారు 6.79 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.

03.05.2026 వరకు 43,760 కంటే ఎక్కువ మంది పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్‌లను వదులుకున్నారు.

ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు

అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పనిచేస్తుండగా... పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా నిర్వహిస్తున్నారు.

గృహ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.

దేశీయ మార్కెట్‌కు పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ధారించిన విధంగా కీలక రంగాలకు సీ3 & సీ4 స్ట్రీమ్‌ల నిర్దిష్ట కనీస పరిమాణాలను అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం 01.04.2026 తేదీ నాటి ఉత్తర్వు ద్వారా పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు సహా ఆయిల్ రిఫైనరీ కంపెనీలనూ అనుమతించింది.

ఫార్మాస్యూటికల్స్ విభాగం, రసాయనాలు-పెట్రో కెమికల్స్ విభాగం, పరిశ్రమలకు ప్రోత్సాహం-అంతర్గత వాణిజ్య విభాగం ద్వారా అందిన అభ్యర్థనల ఆధారంగా... ఫార్మా, రసాయన రంగ కంపెనీలకు ఎల్‌పీజీ పూల్ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల కేటాయింపు చేశారు.

9 ఏప్రిల్ 2026 నుంచి ముంబయి, కొచ్చి, వైజాగ్, చెన్నై, మధుర, గుజరాత్ రిఫైనరీలు రసాయన, ఫార్మా, పెయింట్ పరిశ్రమలకు 10,750 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలిన్, 1670 మెట్రిక్ టన్నులకు పైగా బ్యూటైల్ అక్రిలేట్‌ను విక్రయించాయి.

రిటైల్ ఇంధన లభ్యత, ధరల సంబంధిత చర్యలు

దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లు యధావిధిగా పనిచేస్తున్నాయి.

మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసింది. వినియోగదారులను అధిక ధరల నుంచి ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి, భారత ప్రభుత్వం 30.04.2026 తేదీ నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.50 నుంచి రూ. 23కు తగ్గించింది. ఏటీఎఫ్‌పై సుంకాన్ని లీటరుకు రూ. 42 నుంచి రూ. 33కు తగ్గించింది.

వదంతుల కారణంగా కొన్ని రిటైల్ అవుట్‌లెట్లలో భయాందోళనతో కొనుగోళ్లు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పీఎస్‌యూ ఓఎంసీల రిటైల్ అవుట్‌లెట్లలోనూ ధరల పెంపు లేదు.

కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు

సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.

18 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా... హిమాచల్ ప్రదేశ్లదాఖ్‌లు దీని అవసరం లేదని తెలియజేశాయి.

నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు

పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న నౌకా వాణిజ్య పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను అందించింది. అందులో కింది విషయాలను తెలియజేసింది:

నావికుల సంక్షేమం, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖభారత మిషన్లునౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో ఓడరేవులునౌకాయానంజల రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.

ఈ ప్రాంతంలోని భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన జరగలేదు.

డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారం: ప్రారంభమైనప్పటి నుంచి ఈ కంట్రోల్ రూమ్ 8,414 కాల్‌లు, 18,064 కంటే ఎక్కువ ఈమెయిళ్లను నిర్వహించింది. గత 24 గంటల్లో 41 కాల్‌లు, 99 ఈమెయిళ్లూ అందాయి.

స్వదేశానికి తరలించడంపై తాజా సమాచారం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో స్వదేశానికి వచ్చిన 23 మంది సహా... ఇప్పటివరకు మొత్తం 2,976 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి మంత్రిత్వ శాఖ సౌకర్యం కల్పించింది.

పోర్ట్ కార్యకలాపాలు: దేశవ్యాప్తంగా పోర్ట్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.

ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కింది విషయాలను తెలియజేసింది:

సమాచార మార్పిడి, కృషి విషయంలో మరింత మెరుగైన సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు సకాలంలో సహాయం అందించడానికి ఇరవై నాలుగు గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తున్నాయి. మన పౌరులకు చురుగ్గా సహాయం అందిస్తున్నాయి. అవి స్థానిక ప్రభుత్వాలతోనూ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి.

స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారత పౌరుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచారం సహా తాజా సూచనలనూ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.

భారతీయ మిషన్లు స్థానిక భారతీయ పౌరులతో చురుగ్గా మమేకమై ఉన్నాయి. వారి సమస్యలను పరిష్కరించడం కోసం వారు భారతీయ పౌర సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన నిపుణుల బృందాలు, భారతీయ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. భారతీయ మిషన్లు స్థానిక అధికారులు, ఏజెన్సీలతో సమన్వయం చేయడం, కాన్సులర్ సహాయం అందించడం, స్వదేశానికి తిరిగి రావాలనే అభ్యర్థనలకు సహాయం చేయడం సహా వారికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నాయి.

ఈ ప్రాంతం నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తం విమానయాన పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది.

యూఏఈ గగనతలం తెరిచి ఉంది. భారత్, యూఏఈ విమానయాన సంస్థలు యూఏఈ నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.

సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఖతార్ ఎయిర్‌వేస్ సంస్థలు ఖతార్ నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.

కువైట్ గగనతలం తెరుచుకుంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ సంస్థలు కువైట్ నుంచి భారత్‌కు విమాన కార్యకలాపాలను పునఃప్రారంభించాయి.

బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, గల్ఫ్ ఎయిర్ సంస్థలూ బహ్రెయిన్ నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.

ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలతో ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. దీనిని భారత్‌కు తిరిగి వచ్చే ప్రయాణం కోసం ఉపయోగించుకోవచ్చు.

ఇరాన్ గగనతలం సరుకు రవాణా, చార్టర్డ్ విమానాల కోసం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించకుండా ఉండాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారత రాయబార కార్యాలయం మద్దతుతో భూ సరిహద్దు మార్గాల ద్వారా స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోరడమైనది. ఇప్పటివరకు, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,504 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్ళడానికి సౌకర్యం కల్పించింది.

ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. వీటిని భారత్‌కు తిరిగి రావడం కోసం ఉపయోగించుకోవచ్చు.

 

***

 


(రిలీజ్ ఐడి: 2257936) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam