పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో వివిధ రంగాల తాజా సమాచారం


భారత్‌కు 46,313 టన్నుల వంటగ్యాస్‌తో వస్తున్న మార్షల్ దీవుల పతాకంగల ‘ఎం.టి.సర్వ శక్తి’ నౌక నిన్న

హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి... ఇది ఈ నెల 13న విశాఖపట్నం చేరుతుందని అంచనా
నిన్న సుమారు 47.4 లక్షల వంటగ్యాస్‌ సిలిండర్ల బుకింగుకు గాను దాదాపు 47 లక్షల దేశీయ సిలిండర్లు సరఫరా అయ్యాయి

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) 2026 ఏప్రిల్ 3 నుంచి ఐదు కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్ల కోసం 10,100కు పైగా అవగాహన శిబిరాలు నిర్వహించి.. సుమారు 1,75,000 సిలిండర్లను విక్రయించాయి

దేశవ్యాప్తంగా 2026 ఏప్రిల్ నుంచి మొత్తం 11,082 టన్నుల ఆటో ‘ఎల్‌పీజీ’ని ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’లు విక్రయించాయి

యూఏఈ గగనతలంలో విమానయాన కార్యకలాపాలు పూర్తి సాధారణ స్థాయికి చేరినట్లు ‘జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ’ ప్రకటించగా... యూఏఈ-భారత్‌ మధ్య రెండు దేశాల విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి

నాడు పోస్టు చేయడమైనది: 03 MAY 2026 4:14PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాల దృష్ట్యా సమన్వయప్రతిస్పందనాత్మక చర్యల ద్వారా కీలక రంగాల సంసిద్ధతపరిస్థితుల నిర్వహణను స్థిరంగా కొనసాగిస్తోందిఈ మేరకు ఇంధన సరఫరాసముద్ర కార్యకలాపాలుఆ ప్రాంతంలోగల ప్రవాస భారతీయులకు మద్దతు తదితర అంశాల్లో తీసుకుంటున్న చర్యలపై కిందివిధంగా తాజా సమాచారం ప్రకటించింది:

విద్యుత్‌ సరఫరా... ఇంధన లభ్యత

   పశ్చిమాసియాలో నానాటికీ పరిస్థితులు మారుతున్న దృష్ట్యాపెట్రోలియం ఉత్పత్తులుఎల్‌పీజీ నిరంతరాయ సరఫరా దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా సమాచారం కిందివిధంగా ఉంది:

ప్రభుత్వ సూచనలు... పౌరులకు అవగాహన

·        పెట్రోలుడీజిల్ఎల్‌పీజీ లభ్యతకు భరోసా ఇస్తూ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్న నేపథ్యంలో పౌరులు భయాందోళనలకు లోనైవీటి కొనుగోలు కోసం ఆదుర్దా పడవద్దని సూచన జారీ చేసింది.

·        వదంతులను విశ్వసించవద్దనికచ్చితమైన సమాచారం కోసం అధికార మార్గాల్లోనే అన్వేషించాలని సలహా ఇచ్చింది.

·        ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ వేదికలను ఉపయోగించాలి తప్ప సరఫరాదారులను ఆశ్రయించవద్దని సూచించింది.

·        పీఎన్‌జీఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాల్సిందిగా కోరింది.

·        ప్రస్తుత పరిస్థితులలో పౌరులంతా తమ రోజువారీ ఇంధన వినియోగంలో పొదుపు పాటించేందుకు తగినవిధంగా కృషి చేయాలని అభ్యర్థించింది.

ప్రభుత్వ సంసిద్ధత... సరఫరా నిర్వహణ

·        ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ దేశీయ ఎల్‌పీజీగృహ వినియోగ పీఎన్‌జీసీఎన్‌జీ 100 శాతం సరఫరా (రవాణా)కు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

·        వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాకు సంబంధించి ఆస్పత్రులువిద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారుఅలాగే ఔషదఉక్కుఆటోమొబైల్విత్తనవ్యవసాయ తదితర రంగాలకూ ప్రాధాన్యం లభిస్తోందిదీనికితోడు 2026 మార్చి 2, 3 తేదీల నాటి సగటు రోజువారీ సరఫరా ప్రాతిపదికన వలస కార్మికులకు కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.

·        శుద్ధి కర్మాగారల్లో ఉత్పత్తి పెంపుపట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకుగ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం సహా అటు సరఫరా... ఇటు డిమాండ్‌ వైపు ఆయా రంగాలకు ప్రాధాన్యత వంటి పలు హేతుబద్ధ చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

·        ఎల్‌పీజీ డిమాండ్‌ ఒత్తిడి తగ్గించే దిశగా కిరోసిన్బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చింది.

·        చిన్నమధ్యతరహా వినియోగదారులకు పంపిణీ కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గు సరఫరా చేయాల్సిందిగా కోల్ ఇండియాసింగరేణి కాలరీస్‌ సంస్థలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

·        గృహవాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్ల సౌలభ్యాన్ని వేగిరపరచాలని రాష్ట్రాలకు సూచించింది.

రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు.. సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ కృషి

·        నిత్యవసరాల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం సరఫరాపై పర్యవేక్షణతోపాటు అక్రమ నిల్వ-విక్రయాలపై చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.

·        పెట్రోలుడీజిల్ఎల్‌పీజీ సహా నిత్యావసర వస్తువుల సరఫరా స్థితిగతుల పర్యవేక్షణనియంత్రణలో రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాలిఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వాలకు పలుమార్లు లేఖ రాయడంతోపాటు వీడియో  కాన్ఫరెన్స్‌ మార్గంలోనూ ఈ అంశాన్ని పునరుద్ఘాటించింది.

·        కేంద్ర ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల్లో రెండు లేఖల ద్వారా తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా ఇస్తూ నిరంతర ప్రభుత్వ సమాచార ప్రదాన ఆవశ్యకతను స్పష్టం చేసిందితదనుగుణంగా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్ష కూడా నిర్వహిస్తోందిఈ నేపథ్యంలో 02.04.2026న (మంత్రిత్వశాఖలోని పీఎన్‌జీ విభాగ కార్యదర్శి అధ్యక్షత), 06.04.2026న (పీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన సమాచార-ప్రసార శాఖవినియోగదారు వ్యవహారాల విభాగం కార్యదర్శులతోఅధికారులు సమావేశమయ్యారుఅనంతరం కింద పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.

o   రోజువారీ విలేకరుల సమావేశం నిర్వహణ.. క్రమం తప్పకుండా ప్రజలకు సలహాలు జారీ.

o   సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే సమాచారంబూటకపు వార్తలపై నిశిత పర్యవేక్షణనిరోధం.

o   జిల్లా యంత్రాంగాల ద్వారా దైనందిన చర్యలు ముమ్మరం సహా ‘ఓఎంసీ’ల సమన్వయంతో తనిఖీ-దాడుల కొనసాగింపు.

o   వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపుపై రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలో  ఉత్తర్వుల జారీ.

o   రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ‘ఎస్‌కేఓ'ల కోసం సంబంధిత ఉత్తర్వులు జారీ.

o   పీఎన్‌జీ సహా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ప్రోత్సాహం.

o   ప్రత్యేకించి గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యంతోపాటు సరఫరా స్థిరత్వం కొనసాగించేలా కిలోల ఎప్‌టీఎల్‌ సిలిండర్ల లక్షిత పంపిణీ.

o   అక్రమ నిల్వ-విక్రయాల నిరోధంపై అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కంట్రోల్‌ రూములుజిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

o   అనేక రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోజువారీ విలేకరుల సమావేశం ద్వారా తాజా సమాచారం ప్రకటిస్తున్నాయి.

అమలు... పర్యవేక్షణ చర్యలు

·        ఎల్‌పీజీ నిల్వల నిర్వహణతోపాటు అక్రమ విక్రయాల నిరోధానికి దేశవ్యాప్తంగా పటిష్ఠ చర్యలు కొనసాగుతున్నాయిఈ క్రమంలో నిన్న 1900కు పైగా దాడులు నిర్వహించారు.

·        దేశమంతటా ఆకస్మిక తనిఖీ ప్రక్రియను ‘ఓఎంసీ’లు బలోపేతం చేయడంతోపాటు నిరంతరం కొనసాగిస్తున్నాయిఈ మేరకు 349 ఎల్‌పీజీ సరఫరా కేంద్రాలకు జరిమానా విధింపు సహా నిన్నటిదాకా 74 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల కార్యకలాపాలను నిలిపివేశారు.

ఎల్‌పీజీ సరఫరా

గృహోపయోగ వంటగ్యాస్‌ తాజా స్థితి:

·        ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల వల్ల ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది.

·        గృహ వినియోగదారులకు వంటగ్యాస్‌ సరఫరాకు ప్రాధాన్యం లభిస్తోంది.

·        దేశంలో ఎక్కడా ఎల్‌పీజీ సరఫరా కేంద్రాల వద్ద పంపిణీ ఆగిన సమాచారమేదీ లేదు.

·        పరిశ్రమల ప్రాతిపదికన నిన్న ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌ 99 శాతంగా నమోదైంది.

·        దారి మళ్లింపు నిరోధంసరఫరా నిర్ధారణ కోడ్‌ (డీఏసీఆధారిత సరఫరా దాదాపు 94 శాతానికి పెరిగిందిప్రతి వినియోగదారు నమోదిత మొబైల్ నంబరుకు డీఏసీ వెళ్తుంది.

·        దేశంలో 02.05.2026న సుమారు 47.4 లక్షల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌ నమోదు కాగాదాదాపు 47 లక్షల సిలిండర్లు సరఫరా అయ్యాయి.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా... కేటాయింపు చర్యలు

·        సంస్కరణ-అనుసంధానిత 10 శాతం కేటాయింపు సహా మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును సంక్షోభానికి మునుపటికి స్థాయిలో సుమారు 70 శాతానికి పెంచారు.

·        వలస కార్మికులకు 2026 మార్చి 2-3 తేదీల నాటి సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్యప్రాతిపదికన 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితికి మించిప్రతి రాష్ట్రంలో వారికి కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల దైనందిన పరిమాణాన్ని రెట్టింపు చేయాలని 06.04.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సూచించిందితదనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే ‘ఓఎంసీ’ల సహాయంతో సరఫరా చేయడం కోసం ఈ కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అక్కడి ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి.

·        ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా 23.44 లక్షలకు పైగా కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించారు.

·        నిన్న 66,000కు పైగా కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను సరఫరా చేశారు.

·        దేశంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’లు కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి 10,100కు పైగా అవగాహన శిబిరాలను నిర్వహించిసుమారు 1,75,000 సిలిండర్లను విక్రయించాయి.

·        ఈ నేపథ్యంలో నిన్న 130కి పైగా శిబిరాల ద్వారా మొత్తం 3778 ఐదు కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించారు.

·        ఐఓసీఎల్హెచ్‌పీసీఎల్బీపీసీఎల్‌” ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో నియమించిన త్రిసభ్య కమిటీ నిరంతరం రాష్ట్ర అధికారులుపారిశ్రామిక సంస్థలతో సంప్రదిస్తూ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్‌పీజీ విక్రయ ప్రణాళికను ఖరారు చేస్తుంది.

·        ఏప్రిల్ 26 నుంచి మొత్తం 2,14,069 టన్నుల (112.66 లక్షలకు పైగా 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లకు సమానంవాణిజ్య ఎల్‌పీజీ విక్రయించారు.

·        దేశంలో 02.05.2026న సుమారు 8220 టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (4.33 లక్షలకు పైగా- 19 కిలోల సిలిండర్లకు సమానంవిక్రయించారు.

·        ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’ల ద్వారా మొత్తం 11082 టన్నుల ఆటో ‘ఎల్‌పీజీ’ని  విక్రయించారు.

సహజ వాయువు సరఫరాపీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు

  • డీ-పీఎన్‌జీసీఎన్‌జీ-రవాణాకు 100 శాతం సరఫరాలతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.

  • ఎరువుల కర్మాగారాలకు కేటాయించే మొత్తం గ్యాస్‌నువాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 98 శాతానికి పెంచారు.

  • అదనంగాసీజీడీ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సరఫరాలు సహా... ఇతర పారిశ్రామికవాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.

వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి సీజీడీ సంస్థలు తమ అన్ని జిల్లాల్లోని హోటళ్లురెస్టారెంట్లుక్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.

ఐజీఎల్ఎమ్‌జీఎల్జీఏఐఎల్ గ్యాస్బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహవాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుకేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.

ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.

పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.

రహదారి రవాణారహదారుల మంత్రిత్వ శాఖ తేదీ 24.03.26 నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేయడానికి, 'తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధాన ప్రణాళిక'ను నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తోంది.

నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువుపెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లుఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడంనిర్మించడంనిర్వహించడంవిస్తరించడం ద్వారాఉత్తర్వులు-2026ను 24.03.2026 తేదీ గల గెజిట్ ద్వారా భారత ప్రభుత్వం జారీ చేసిందిఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లు వేయడానికివిస్తరించడానికి ఒక క్రమబద్ధమైనకాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తాయిఇది అనుమతులుభూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించినివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుందిఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందనిమారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందనిపరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందనితద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.

డీ-పీఎన్‌జీ కనెక్షన్‌లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించిందిపీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.

పరిశుద్ధమైనమరింత సురక్షితమైనస్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసిందిఈ నమూనా విధానం... సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంతపెట్టుబడిదారులకు అనుకూలమైనఅమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైనసరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఉద్దేశించినదిదీనిని ఎంచుకున్న రాష్ట్రాలకువాణిజ్య ఎల్‌పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.

ఎమ్‌వోఈఎఫ్‌సీసీ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా... సీజీడీ నెట్‌వర్క్మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికినిర్వహించడానికి 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్‌పీసీబీపీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.

మార్చి 2026 నుంచిసుమారు 6.04 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లకు గ్యాసిఫికేషన్ పూర్తయిందిఅదనంగా 2.68 లక్షల కనెక్షన్‌ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారుదీంతో మొత్తం కనెక్షన్‌ల సంఖ్య 8.72 లక్షలకు చేరిందికొత్త కనెక్షన్‌ల కోసం సుమారు 6.73 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.

02.05.2026 వరకు 43,630 కంటే ఎక్కువ మంది పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్‌లను వదులుకున్నారు.

ముడి చమురు స్థితిరిఫైనరీ కార్యకలాపాలు

అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పనిచేస్తుండగా... పెట్రోల్డీజిల్ నిల్వలు తగినంతగా నిర్వహిస్తున్నారు.

గృహ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.

దేశీయ మార్కెట్‌కు పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారుసెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ధారించిన విధంగా కీలక రంగాలకు సీ3 & సీస్ట్రీమ్‌ల నిర్దిష్ట కనీస పరిమాణాలను అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం 01.04.2026 తేదీ నాటి ఉత్తర్వు ద్వారా పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు సహా ఆయిల్ రిఫైనరీ కంపెనీలనూ అనుమతించింది.

ఫార్మాస్యూటికల్స్ విభాగంరసాయనాలు-పెట్రో కెమికల్స్ విభాగంపరిశ్రమలకు ప్రోత్సాహం-అంతర్గత వాణిజ్య విభాగం ద్వారా అందిన అభ్యర్థనల ఆధారంగా... ఫార్మారసాయన రంగ కంపెనీలకు ఎల్‌పీజీ పూల్ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నులు కేటాయించారు.

ఏప్రిల్ 2026 నుంచి ముంబయికొచ్చివైజాగ్చెన్నైమధురగుజరాత్ రిఫైనరీలు రసాయనఫార్మాపెయింట్ పరిశ్రమలకు 10,600 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలిన్, 1400 మెట్రిక్ టన్నులకు పైగా బ్యూటైల్ అక్రిలేట్‌ను విక్రయించాయి.

రిటైల్ ఇంధన లభ్యతధరల సంబంధిత చర్యలు

దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లు యధావిధిగా పనిచేస్తున్నాయి.

మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసిందివినియోగదారులను అధిక ధరల నుంచి ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికిభారత ప్రభుత్వం 30.04.2026 తేదీ నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.50 నుంచి రూ. 23కు తగ్గించిందిఏటీఎఫ్‌పై సుంకాన్ని లీటరుకు రూ. 42 నుంచి రూ. 33 కు తగ్గించింది.

వదంతుల కారణంగా కొన్ని రిటైల్ అవుట్‌లెట్లలో భయాందోళనతో కొనుగోళ్లు జరుగుతున్నాయిదేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోల్డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని తెలియజేశారుపెట్రోల్డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదుపీఎస్‌యూ ఓఎంసీల రిటైల్ అవుట్‌లెట్లలోనూ ధరల పెంపు లేదు.

కిరోసిన్ లభ్యతపంపిణీ చర్యలు

సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.

18 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా... హిమాచల్ ప్రదేశ్లదాఖ్‌లు దీని అవసరం లేదని తెలియజేశాయి.

నౌకా వాణిజ్య భద్రతనౌకాయాన కార్యకలాపాలు

ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలునావికుల భద్రత కోసం ఓడరేవులునౌకాయానంజల రవాణా మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలను చేపట్టిందిమంత్రిత్వ శాఖ కింది విషయాలను పేర్కొన్నది:

నావికుల సంక్షేమంనిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖభారత మిషన్లునౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో ఓడరేవులునౌకాయానంజల రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.

నౌక సమాచారంమార్షల్ దీవుల జెండా కలిగిన ఎమ్‌టీ సర్వ్ శక్తి (ఐఎమ్‌వో నం. 9350599) పేరు గల ఎల్‌పీజీ రవాణా నౌక 46,313 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ (భారతీయ సరుకు)ని తీసుకువెళుతూ... 18 మంది భారతీయులు సహా 20 మంది సిబ్బందితో ఈ నెల 2న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిందిఈ నెల 13న ఇది విశాఖపట్నం చేరుకుంటుందని అంచనా.

ఈ ప్రాంతంలోని భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారుగత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన జరగలేదు.

డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారంప్రారంభమైనప్పటి నుంచి ఈ కంట్రోల్ రూమ్ 8,373 కాల్‌లు, 17,965 కంటే ఎక్కువ ఈమెయిళ్లను నిర్వహించిందిగత 24 గంటల్లో 38 కాల్‌లు, 127 ఈమెయిళ్లూ అందాయి.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో స్వదేశానికి వచ్చిన 31 మంది సహా... ఇప్పటివరకు మొత్తం 2,953 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి మంత్రిత్వ శాఖ సౌకర్యం కల్పించింది.

దేశవ్యాప్తంగా పోర్ట్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయిఎటువంటి రద్దీ నమోదు కాలేదు.

ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉందిఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రతరక్షణసంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందికింది విషయాలను తెలియజేసింది:

సమాచార మార్పిడికృషి విషయంలో మరింత మెరుగైన సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్ర పాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

భారత రాయబార కార్యాలయాలుకాన్సులేట్‌లు సకాలంలో సహాయం అందించడానికి ఇరవై నాలుగు గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తున్నాయిమన పౌరులకు చురుగ్గా సహాయం అందిస్తున్నాయిఅవి స్థానిక ప్రభుత్వాలతోనూ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి.

స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలువిమాన ప్రయాణ పరిస్థితులుకాన్సులర్ సేవలుభారత పౌరుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచారం సహా తాజా సూచనలను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.

భారతీయ మిషన్లు స్థానిక భారతీయ పౌరులతో చురుగ్గా మమేకమై ఉన్నాయివారి సమస్యలను పరిష్కరించడం కోసం వారు భారతీయ పౌర సంఘాలుసంస్థలువృత్తిపరమైన నిపుణుల బృందాలుభారతీయ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందిభారతీయ మిషన్లు స్థానిక అధికారులుఏజెన్సీలతో సమన్వయం చేయడంకాన్సులర్ సహాయం అందించడంస్వదేశానికి తిరిగి రావాలనే అభ్యర్థనలకు సహాయం చేయడం సహా వారికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నాయి.

ఈ ప్రాంతం నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతోమొత్తం విమానయాన పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది.

మే 2యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ... యూఏఈ గగనతలంలో సాధారణ విమానయాన కార్యకలాపాలను పూర్తిగా పునఃప్రారంభించినట్లుతాత్కాలిక ముందుజాగ్రత్త చర్యలను ఎత్తివేసినట్లు ప్రకటించిందిభారతీయయూఏఈ విమానయాన సంస్థలు యూఏఈ నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.

సౌదీ అరేబియాఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకుందిఎయిర్ ఇండియాఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ఇండిగోఖతార్ ఎయిర్‌వేస్ సంస్థలు భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.

కువైట్ గగనతలం తెరుచుకుందిజజీరా ఎయిర్‌వేస్కువైట్ ఎయిర్‌వేస్ సంస్థలు కువైట్ నుంచి భారత్‌కు విమాన కార్యకలాపాలను పునఃప్రారంభించాయి.

బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉందిఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ఇండిగోగల్ఫ్ ఎయిర్ సంస్థలూ బహ్రెయిన్ నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.

ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలతో ఇరాక్ గగనతలం తెరిచి ఉందిదీనిని భారత్‌కు తిరిగి వచ్చే ప్రయాణం కోసం ఉపయోగించుకోవచ్చు.

ఇరాన్ గగనతలం సరుకు రవాణాచార్టర్డ్ విమానాల కోసం పాక్షికంగా తెరిచి ఉందిభారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించకుండా ఉండాలనిఇప్పటికే అక్కడ ఉన్నవారు భారత రాయబార కార్యాలయం మద్దతుతో భూ సరిహద్దు మార్గాల ద్వారా స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోరడమైనదిఇప్పటివరకుటెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,504 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్ళడానికి సౌకర్యం కల్పించింది.

ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉందిఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయివీటిని భారత్‌కు తిరిగి రావడం కోసం ఉపయోగించుకోవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2257792) సందర్శకుల సూచీ సంఖ్య : : 15