పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలోని పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం

ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలలో ఎక్కడా సరఫరా నిలిచిపోలేదు

నిన్న 51.8 లక్షలకు పైగా గృహాలకు ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ

ఇప్పటివరకు ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్న 42,500 మంది పీఎన్‌జీ వినియోగదారులు

మార్చి 2026 నుంచి, సుమారు 5.45 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు పూర్తయిన గ్యాసిఫికేషన్

అదనంగా 2.62 లక్షల కనెక్షన్‌ల కోసం మౌలిక సదుపాయాల కల్పన

గల్ఫ్ ప్రాంతం నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన 2,764 మందికి పైగా భారతీయ నావికులు

గత 24 గంటల్లో 24 మంది రాక

ఫిబ్రవరి 28 నుంచి ఆ ప్రాంతం నుంచి భారత్‌కు వచ్చిన సుమారు 12.96 లక్షల మంది

నాడు పోస్టు చేయడమైనది: 26 APR 2026 4:06PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యాభారత ప్రభుత్వం సమన్వయ ప్రతిస్పందన చర్యల ద్వారా కీలక రంగాల్లో సంసిద్ధతనుకొనసాగింపును నిర్ధారించడంలో చురుగ్గా నిమగ్నమై ఉందిఈ ప్రాంతంలోని ఇంధన సరఫరానౌకా వాణిజ్య కార్యకలాపాలుభారత పౌరులకు అందించే మద్దతుకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం తెలియజేసింది:

ఇంధన సరఫరాఇంధన లభ్యత

హార్మూజ్ జలసంధికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులుఎల్‌పీజీ నిరంతరాయంగా లభించేలా చూసేందుకు పెట్రోలియంసహజ వాయువుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోందిమంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:

ప్రజలకు సూచనలుపౌరులకు అవగాహన

పెట్రోల్డీజిల్ఎల్‌పీజీల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందునపౌరులు వీటిని భయాందోళనతో కొనుగోలు చేయడం మానుకోవాలి.

వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూసరైన సమాచారం కోసం అధికారిక వనరులపై ఆధారపడాలి.

ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలనిపంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి.

పీఎన్‌జీవిద్యుత్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిందిగా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లోపౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరడమైనది.

ప్రభుత్వ సంసిద్ధతసరఫరా నిర్వహణ చర్యలు

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గృహావసరాల కోసం ఎల్‌పీజీపీఎన్‌జీసీఎన్‌జీ (రవాణా)లకు 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలో ఆసుపత్రులకువిద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారుఔషధఉక్కుఆటోమొబైల్విత్తనవ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు. 2026 మార్చి 2, 3 తేదీల్లో నమోదైన సగటు దైనందిన సరఫరా ఆధారంగా వలస కార్మికులకు అందించే కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.

సరఫరాడిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసిందివీటిలో రిఫైనరీ ఉత్పత్తి పెంపుదల... పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ విరామాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకుగ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకూ పెంచడం... సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు ఉన్నాయి.

ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు అందుబాటులో ఉంచుతున్నారు.

చిన్నమధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసే నిమిత్తం రాష్ట్రాలకు అదనపు బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ 'కోల్ ఇండియా', 'సింగరేణి కాలరీస్'లను ఆదేశించింది.

గృహవాణిజ్య వినియోగదారులు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను పొందుటను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుసంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు

నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడం... అక్రమ నిల్వలుబ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.

పెట్రోల్డీజిల్ఎల్‌పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలోనియంత్రించడంలో రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉందిభారత ప్రభుత్వం ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలువీడియో అనుసంధానాల ద్వారా పునరుద్ఘాటించింది.

తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా కల్పించేందుకుప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిన ఆవశ్యకతను భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల నాటి లేఖల ద్వారా స్పష్టం చేసిందిరాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. 02.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శితో పాటు సమాచార-ప్రసార శాఖవినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శుల అధ్యక్షతనసమావేశాలు నిర్వహించారుఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు:

రోజువారీ పత్రికా సమావేశాలను నిర్వహించడంక్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయడం.

సోషల్ మీడియాలో నకిలీ వార్తలుతప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడంతిప్పికొట్టడం.

జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు చర్యలను ముమ్మరం చేయడంఓఎమ్‌సీలతో సమన్వయం ద్వారా సోదాలుతనిఖీలను కొనసాగించడం.

తమ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్‌కేవో కోసం ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

పీఎన్‌జీ వినియోగాన్నిప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.

ముఖ్యంగా గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యమివ్వడంసరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి లక్ష్యానికి అనుగుణంగా కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల పంపిణీని అమలు చేయడం.

అక్రమ నిల్వలు,  బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లనుజిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

అనేక రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా ప్రకటనలను జారీ చేస్తున్నాయి... సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

అమలుపర్యవేక్షణ చర్యలు

ఎల్‌పీజీ అక్రమ నిల్వలుబ్లాక్ మార్కెటింగ్‌లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయినిన్న దేశవ్యాప్తంగా 2,100కు పైగా సోదాలు నిర్వహించారు.

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి310 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలకు జరిమానాలు విధించగానిన్నటి వరకు 70 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల లైసెన్సును నిలిపివేశాయి.

ఎల్పీజీ సరఫరా

గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా స్థితి...

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.

గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా కోసం అత్యంత ప్రాధాన్యత కొనసాగుతోంది.

ఎల్‌పీజీ పంపిణీదారుల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.

సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 94 శాతానికి పెంచారునమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు డీఏసీ వస్తుంది.

25.04.202651.8 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేశారు.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాకేటాయింపు చర్యలు

మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయిఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీసిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుందిఈ కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయివీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 1, 2026 నుంచి 19.44 లక్షలకు పైగా కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లను విక్రయించారు.

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లు సుమారు 82,000 

అమ్ముడయ్యాయి

2026 ఏప్రిల్ నుంచిప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు 8,95కంటే ఎక్కువ అవగాహన శిబిరాలను నిర్వహించాయిఈ శిబిరాల ద్వారా 1,42,000కి పైగా కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

నిన్న 190కి పైగా శిబిరాల ద్వారా కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లు 3846 అమ్ముడయ్యాయి.

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్హెచ్‌పీసీఎల్బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ... రాష్ట్ర ప్రభుత్వ అధికారులుపరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.

2026 ఏప్రిల్ నెలలో (25-04-2026 వరకుమొత్తం 1,64,655 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ అమ్ముడైంది (ఇది దాదాపు 86.66 లక్షల 19 కేజీల సిలిండర్లతో సమానం).

25.04.20269131 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (సుమారు 4.80 లక్షల - 19 కేజీల సిలిండర్లకు సమానంవిక్రయించారు.       

సహజ వాయువు సరఫరాపీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు

డీ-పీఎన్‌జీసీఎన్‌జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు.

ఎరువుల కర్మాగారాలకు ఇచ్చే మొత్తం గ్యాస్ కేటాయింపులనువాటి గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.

దీంతో పాటు సీజీడీ వ్యవస్థల ద్వారా అందే సరఫరాలతో సహాఇతర పారిశ్రామికవాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.

వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికిసీజీడీ సంస్థలు తమ అన్ని జీఏల్లోని హోటళ్లురెస్టారెంట్లుక్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

గృహవాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లను పెంచేందుకు ఐజీఎల్‌ఎంజీఎల్‌జీఏఐఎల్ గ్యాస్‌బీపీసీఎల్‌ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలుకేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.

ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.

· పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుగుణంగా 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్యపరమైన ఎల్‌పీజీ కేటాయింపులను పొందుతున్నాయి.

· సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించడం కోసం 2026 ఏప్రిల్ 24 నాటి లేఖ ద్వారా.. ‘కాలవ్యవధిని తగ్గిస్తూ సత్వర ఆమోద వ్యవస్థ’ను కేంద్ర రోడ్డు రవాణారహదారుల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా మూడు నెలల పాటు అమల్లోకి తెచ్చింది.

·  నిత్యావసర వస్తువుల చట్టం- 1955 కింద సహజ వాయువుపెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్లుఇతర సదుపాయాల నిర్మాణంపైప్‌లైన్ల నిర్వహణవిస్తరణ ద్వారాఉత్తర్వు- 2026ను భారత ప్రభుత్వం 2026 మార్చి 24 నాటి గెజిట్ ద్వారా ప్రకటించిందిదేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణంవిస్తరణ కోసం ఒక క్రమబద్ధమైనకాలపరిమితితో కూడిన విధానాన్ని ఈ ఉత్తర్వు నిర్దేశిస్తుందిఅనుమతుల్లో జాప్యాన్నిభూసేకరణ సంబంధిత సమస్యలను నివారిస్తూ... నివాస ప్రాంతాలు సహా అన్ని చోట్లా సహజ వాయు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి ఇది తోడ్పడుతుందిదీనివల్ల పీఎన్‌జీ వ్యవస్థ వృద్ధి వేగవంతమవడంతోపాటు.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుందిఇది శుద్ధ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ.. భారత ఇంధన భద్రతనుగ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

·  డీ-పీఎన్‌జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్బీ ఆదేశించిందిఅలాగేపీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడం కోసం.. జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను 2026 జూన్ 30 వరకు పొడిగించారు.

· పర్యావరణానికి మేలు చేసేసురక్షితమైనస్వావలంబన కలిగిన ఇంధన భవితను ప్రోత్సహించేలా.. రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను భారత ప్రభుత్వం రూపొందించిందిసీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు సొంతంగా పెట్టుబడిదారులకు అనుకూలమైనఅమలు ప్రాతిపదికన వ్యవస్థలను రూపొందించుకోవడానికి.. సమగ్రమైనసరళమైన మార్గదర్శకంగా ఈ నమూనా విధానం ఉపయోగపడుతుందిఈ విధానాన్ని అమలు చేసే రాష్ట్రాలకు.. వాణిజ్యపరమైన ఎల్‌పీజీ తదుపరి విడత అదనపు కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తారు.

· సీజీడీ వ్యవస్థమౌలిక సదుపాయాలను నెలకొల్పేందుకు లేదా వాటి నిర్వహణకు 15 రోజుల్లోగా అనుమతి మంజూరు చేయడం కోసం ఎస్‌పీసీబీపీసీసీలకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా.. 2026 ఏప్రిల్ నాటి ఉత్తర్వుల ద్వారా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)ని పర్యావరణఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

·  2026 మార్చి నుంచి దాదాపు 5.45 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైందిమరో 2.62 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలను కల్పించారుదీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 8.07 లక్షలకు చేరిందిఅంతేకాకుండా దాదాపు 6.14 లక్షల వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.

· 2026 ఏప్రిల్ 25 నాటికి 42,500కు పైగా పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.

ముడి చమురు లభ్యతరిఫైనరీ కార్యకలాపాలు

·        అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయితగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయిపెట్రోల్డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.

·        గృహ వినియోగానికి అనుగుణంగా రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.

·        దేశీయ మార్కెట్‌కు అవసరమైన పెట్రోకెమికల్ ముడిసరుకు అందుబాటులో ఉండేలా చూసేందుకు చూడడం కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక సంయుక్త కార్యవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందిఅనంతరం సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీనిర్దేశించిన విధంగా దేశంలోని చమురు శుద్ధి కంపెనీలుపెట్రోకెమికల్ కాంప్లెక్సులు తమ వద్ద ఉండే సీ3, సీ4  నిల్వలను నిర్ణీత పరిమాణంలో కీలక రంగాలకు అందుబాటులో ఉంచేందుకు 2026 ఏప్రిల్ నాటి ఉత్తర్వుల ద్వారా భారత ప్రభుత్వం అనుమతించింది.

·        ఔషధ విభాగంరసాయనాలు పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ)పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీఅభ్యర్థనల మేరకు.. ఔషధరసాయన రంగ కంపెనీల కోసం మొత్తం ఎల్పీజీ నిల్వల (ఎల్‌పీజీ పూల్నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నులను కేటాయించారు.

·        2026 ఏప్రిల్ నుంచి ముంబయికొచ్చివైజాగ్చెన్నైమథుర రిఫైనరీలు.. రసాయనఫార్మా పరిశ్రమలకు 7,600 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలిన్‌ను విక్రయించాయి.

రిటైల్ ఇంధన లభ్యతధరల నియంత్రణ చర్యలు

·        దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.

·        మధ్యప్రాచ్యంలో సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయిఅయినప్పటికీ వినియోగదారులపై భారం పడకుండా భారత ప్రభుత్వం పెట్రోలుడీజిలుపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.

·        భారత ప్రభుత్వం 2026 ఏప్రిల్ 11 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిలు‌పై లీటరుకు రూ. 55.50,  ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 42 ఎగుమతి సుంకాన్ని పెంచిందిదేశీయ మార్కెట్‌లో ఈ ఉత్పత్తుల లభ్యత కోసం ఈ చర్యలు చేపట్టింది.

·        వదంతుల కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో భయాందోళనతో ఎక్కువగా కొనుగోలు చేశారుదేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోలుడీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయిపెట్రోలుడీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదుప్రభుత్వ రంగ సంస్థలుచమురు మార్కెటింగ్‌ కంపెనీల రిటైల్‌ అవుట్‌లెట్లలోనూ ధరలను పెంచలేదు.

 కిరోసిన్ లభ్యతపంపిణీ చర్యలు

·        రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.

·        18 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయిహిమాచల్ ప్రదేశ్లడాఖ్ ప్రాంతాలు కిరోసిన్ అవసరం లేదని తెలిపాయి.

సముద్ర భద్రతనౌకా రవాణా కార్యకలాపాలు

·        ఈ ప్రాంతంలోని భారతీయ నౌకలునావికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలనూ ఓడరేవులునౌకాయానంజలమార్గాల మంత్రిత్వ శాఖ చేపట్టిందిమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి:

·        నావికుల సంక్షేమంసముద్ర కార్యకలాపాల్లో అంతరాయాలను తొలగించడం లక్ష్యంగా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖభారత రాయబార కార్యాలయాలుసముద్ర రంగ భాగస్వాములతో సమన్వయాన్ని మంత్రిత్వ శాఖ కొనసాగిస్తోంది.

·        ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారుగత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

·        డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం ప్రారంభమైనప్పటి నుంచి 7,755 కాల్స్16,518కి పైగా ఈమెయిళ్లకు జవాబిచ్చిందిగత 24 గంటల్లో 57 కాల్స్192 ఈమెయిళ్లు వచ్చాయి.

·        డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్ద్వారా.. ఇప్పటివరకు గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి 2,764 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారుగత 24 గంటల్లో 24 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.

·        దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయిఎలాంటి రద్దీ నమోదు కాలేదు.

ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత

గల్ఫ్,  పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందిఈ ప్రాంతంలోని భారతీయుల భద్రతరక్షణసంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

·        భారత రాయబార కార్యాలయాలుపోస్టులు ఇరవై నాలుగు గంటల హెల్ప్‌లైన్లను నిర్వహిస్తూభారత పౌరులకు క్రియాశీలకంగా చేయూతనిస్తున్నాయిస్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.

·        స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలువిమాన ప్రయాణ పరిస్థితులుకాన్సులర్ సేవలుభారతీయులకు సాయమందించేలా తీసుకుంటున్న వివిధ చర్యలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.

·        స్థానిక భారతీయులతో భారతీయ రాయబార కార్యాలయాలు చురుగ్గా మమేకమై ఉన్నాయిఈ ప్రాంతంలోని వివిధ సంఘాలుసంస్థలువృత్తి నిపుణుల బృందాలుభారతీయ కంపెనీలుఇతర భాగస్వాములతో నిరంతరం చర్చిస్తున్నాయి.

·        ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆ ప్రాంతంలోని నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందికి భారత రాయబార కార్యాలయాలు అన్ని విధాలా సాయమందిస్తున్నాయిస్థానిక అధికారులుసంస్థలతో సమన్వయంకాన్సులర్ సాయాన్ని అందించడంవారు భారత్‌కు తిరిగి రావాలన్న అభ్యర్థనలకు సాయమందించడం వంటివి చేస్తున్నారు.

·        ఫిబ్రవరి 28 నుంచి ఈ ప్రాంతం నుంచి దాదాపు 12,96,000 మంది భారత్‌కు ప్రయాణించారు.

·        యూఏఈలో భద్రతకార్యాచరణ కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు యూఏఈ భారత్ మధ్య పరిమిత సంఖ్యలో వాణిజ్యపరమైన విమాన సేవలను నడుపుతున్నాయిఈ రోజు యూఏఈ భారత్‌ మధ్య దాదాపు 110 విమానాలు నడుస్తాయని అంచనా.

·        సౌదీ అరేబియాఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోకి వివిధ ప్రాంతాలకు విమాన సేవలు కొనసాగుతున్నాయి.

·        ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉండడంతో.. భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ఖతార్ ఎయిర్‌వేస్ విమానాలను నడుపుతోంది.

·        కువైట్ గగనతలం తెరిచి ఉందికువైట్ నుంచి భారత్‌కు పరిమిత విమాన సర్వీసులను జజీరా ఎయిర్‌వేస్కువైట్ ఎయిర్‌వేస్ తిరిగి ప్రారంభించాయి.

·        బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉందిబహ్రెయిన్ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు గల్ఫ్ ఎయిర్ విమానాలను నడుపుతోంది.

·        ఇరాక్ గగనతలం తెరిచి ఉందివివిధ ప్రాంతాలకు పరిమిత విమాన సర్వీసులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయిభారత్‌కు తదుపరి ప్రయాణం కోసం వీటిని ఉపయోగించవచ్చు.

·        సరుకు రవాణాచార్టర్డ్ విమానాల కోసం ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉందిభారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించొద్దనిఇప్పటికే ఇరాన్‌లో ఉన్నవారు మన రాయబార కార్యాలయ సహకారంతో భూ సరిహద్దు ద్వారా తిరిగి రావాలని ప్రభుత్వం కోరిందిటెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,445 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్లేందుకు సౌకర్యం కల్పించింది.

·        ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉందిఈ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలకు పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయిభారత్‌కు ప్రయాణం కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు

 

***


(రిలీజ్ ఐడి: 2255748) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam