వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు
2026 ఏప్రిల్ 20 నుంచి 23 వరకు వాషింగ్టన్ డీసీలో పర్యటించిన భారత ప్రతినిధి వర్గం
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2026 3:12PM by PIB Hyderabad
భారత్, అమెరికా 2026 ఫిబ్రవరి 7న ఒక సంయుక్త ప్రకటనను జారీ చేశాయి. పరస్పర లాభదాయక వాణిజ్యానికి సంబంధించిన ఒక మధ్యకాలిక ఒప్పంద ప్రణాళికపై ఆ సంయుక్త ప్రకటనలో సమ్మతిని వ్యక్తం చేశాయి. ఈ ప్రణాళిక విస్తృత భారత్, యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) సంప్రదింపుల విషయంలో రెండు దేశాల నిబద్ధతను పునరుద్ఘాటించింది. దీని ప్రకారం.. మధ్యకాలిక ఒప్పంద వివరణకు తుది రూపును ఇవ్వడంతో పాటు విస్తృత బీటీఏలో భాగంగా సంప్రదింపులను ముందుకు తీసుకు పోవడానికి యూఎస్లో సమాన హోదా కలిగిన వారితో కలిసి ముఖాముఖి సమావేశాల్లో పాల్గొనేందుకు భారతీయ పక్షం వాషింగ్టన్ డీసీని సందర్శించింది. మార్కెట్టు లభ్యత, పన్నుయేతర నిర్ణయాలు, వాణిజ్యంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు, కస్టమ్స్, వాణిజ్య సౌలభ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహం, ఆర్థిక భద్రత దిశగా చర్యలు, డిజిటల్ మాధ్యమ ప్రధాన వాణిజ్యం వంటి అనేక రంగాలపై చర్చించారు. సమావేశాలు ఫలప్రదంగానూ, సానుకూల వాతావరణంలోనూ సాగాయి. ఈ సందర్భంగా అర్థవంతంగానూ, ముందుచూపుతోనూ చర్చలు పూర్తి చేశారు. వీటిలో ప్రధాన అంశాలపై పురోగతి చోటు చేసుకుంది. ఇరు పక్షాలూ ఇక ముందు కూడా ఇదే వేగాన్ని కొనసాగించాలన్న నిబద్ధతను వ్యక్తం చేశాయి.
***
(రిలీజ్ ఐడి: 2255330)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23