ప్రధాన మంత్రి కార్యాలయం
పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు ప్రధానమంత్రి నివాళులు
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 11:07AM by PIB Hyderabad
కిందటి సంవత్సరం ఇదే రోజున పహల్గామ్లో జరిగిన భయంకర ఉగ్రవాద దాడిలో ప్రాణాలను కోల్పోయిన అమాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. బాధితులను ప్రధానమంత్రి స్మరించుకుంటూ వారిని ఎప్పటికీ మరువబోమన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాల వెన్నంటి నిలవాలన్న దేశ ప్రజల అచంచల నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు.
కష్టకాలంలో భారత్ ఏకతాటి మీద నిలిచిందనీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న సంకల్పం దృఢతరమైందనీ శ్రీ మోదీ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ భారత్ ఎన్నటికీ తలొగ్గదనీ, ఉగ్రవాదుల కుతంత్రాలు ఎన్నటికీ ఫలించవనీ ఆయన పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘కిందటేడాదిలో ఇదే రోజున పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలను కోల్పోయిన సామాన్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారిని మరచిపోవడం ఎన్నటికీ జరగదు. ఈ నష్టం నుంచి కోలుకొనేందుకు ప్రయత్నిస్తున్న బాధిత కుటుంబాలకు నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
ఒక దేశ ప్రజలుగా దుఃఖ సమయంలో దృఢసంకల్పంతో ఒక్కటిగా నిలుద్దాం. ఉగ్రవాదం ఏ రూపాన్ని ధరించి తెగబడినా సరే, దాని ఎదుట భారత్ ఏనాటికీ తల వంచదు. ఉగ్రవాదుల క్రూర ప్రణాళికలు ఎప్పటికీ సఫలం కానే కావు’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254445)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam