ప్రధాన మంత్రి కార్యాలయం
భూ మాత నిత్య స్ఫూర్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 11:12AM by PIB Hyderabad
భూ మాత శాశ్వత స్ఫూర్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకుంటూ:
‘‘యస్యాం వృక్షా వానస్పత్యా ధ్రువాస్తిష్ఠన్తి విశ్వహా
పృథివీం ధేనుం ప్రదుహాం న ఉదిచ్ఛన్తు నమోస్తు పృథివ్యై’’ అని పేర్కొన్నారు.
ఈ సుభాషితం ‘‘మొక్కలనీ, వృక్షాలనీ సదా బలంగా, స్థిరంగా నిలిపి ఉంచుతున్న ఈ నేల.. మనకు అన్ని సుఖాలూ, సదుపాయాలతో పాటు వనరులని కూడా సమకూర్చు గాక. భూ మాతకు మనం నమస్కరిద్దాం’’ అనే సందేశాన్ని అందిస్తోంది.
భూమి మన తల్లి.. దీనిని పరిరక్షించుకోవడంలోనే మానవాళి సంక్షేమం ఇమిడివుంటుంది. పుడమిని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం, అంతేకాదు.. రాబోయే తరాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన పవిత్ర ప్రతిన కూడా అని శ్రీ మోదీ వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్నిపొందుపరుస్తూ -
‘‘పృథ్వి మన మాత. ధరణిని సంరక్షించుకోవడంలోనే మానవాళి సంక్షేమం నిహితమై ఉంది. దీనిని రక్షించడం మన సామూహిక బాధ్యత మాత్రమే కాకుండా, భావి తరాల వారి పట్ల మనం తీసుకోవాల్సిన పవిత్ర సంకల్పం కూడా.
‘‘యస్యాం వృక్షా వానస్పత్యా ధ్రువాస్తిష్ఠన్తి విశ్వః
పృథివీం ధేనుం ప్రదుహాం న ఉదిచ్ఛన్తు నమోస్తు పృథివ్యై’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2254421)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10