ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ రచయిత, జ్ఞాని, మేధావి శ్రీ బల్బీర్ పుంజ్ మృతికి ప్రధాని నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
19 APR 2026 12:08AM by PIB Hyderabad
ప్రముఖ రచయిత, జ్ఞాని, మేధావి శ్రీ బల్బీర్ పుంజ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
శ్రీ బల్బీర్ పుంజ్ పాత్రికేయ ప్రపంచానికి గొప్ప సేవలు అందించిన ప్రముఖ రచయిత, జ్ఞాని, మేధావి అని శ్రీ మోదీ కొనియాడారు. ఆయన రచనలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయని, జాతీయ పునరుజ్జీవనం దిశగా ఆయనకున్న అభిరుచిని ప్రతిబింబిస్తాయన్నారు. పార్లమెంటులో శ్రీ పుంజ్ ప్రసంగాలు వాస్తవాలతో, సిద్ధాంతంతో కూడుకొని ఉండేవన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘శ్రీ బల్బీర్ పుంజ్ ప్రముఖ రచయిత, జ్ఞాని, మేధావి. పాత్రికేయ ప్రపంచానికి గొప్ప సేవలను అందించారు. ఆయన రచనలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయి. జాతీయ పునరుజ్జీవనం పట్ల ఆయనకున్న బలమైన అభిరుచిని ప్రతిబింబిస్తాయి. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు వాస్తవాలు, సిద్ధాంతంతో కూడుకొని ఉండేవి.
ప్రధానంగా విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు, మేధావుల్లో బీజేపీని బలోపేతం చేయడానికి శ్రీ బల్బీర్ పుంజ్ అవిశ్రాంతంగా కృషి చేశారు. గుజరాత్తో సహా వివిధ రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆనాటి మా చర్చలను ఆత్మీయంగా స్మరించుకుంటున్నాను. ఆయన మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’
***
(రిలీజ్ ఐడి: 2253461)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Urdu
,
English
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam