ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శాంతంగా ఉండడంతో పాటు వివేకాన్ని కలిగి ఉంటూ ఆలోచించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 10:00AM by PIB Hyderabad

కఠిన పరిస్థితుల్లో శాంతంగా ఉండడానికీవివేకాన్ని ఉపయోగించి ఆలోచించడానికీ ప్రాధాన్యాన్ని ఇవ్వాలని సూచిస్తున్న సంస్కృత భాషా సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

భారత్ యువత... సాధించాలని సంకల్పించునకున్న ప్రతిదీ చేజిక్కించుకొంటారని ప్రధాని అన్నారుదేశం సత్వర అభివృద్ధి మార్గంలో ముందుకు సాగిపోయేటట్లు చేస్తోంది మన యువత శక్తేనని శ్రీ మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,

‘‘దేశ యువత మనసులో ఏదైనా సాధించాలని తీర్మానించుకొంటేదానిని చేసి చూపిస్తారుమన దేశం ప్రస్తుతం శర వేగంగా అభివృద్ధి మార్గంలో దూసుకుపోతోందంటే అందుకు మన యువశక్తి సామర్థ్యమే కారణం.

వ్యసనే వార్థకృచ్ఛ్రే వా భయే వా జీవనాన్తకే

విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ నావసీదతి.

కష్టం వచ్చినప్పుడూఆర్థికంగా సంకట స్థితి తలెత్తినప్పుడూలేదా ప్రాణాపాయకర స్థితి ఎదురైనప్పుడూ శాంతంగా ఉండి వివేకంతో ఆలోచించే వ్యక్తి ఎన్నటికీ విఫలమయ్యే ప్రసక్తే ఉండదుకఠిన పరిస్థితుల్లోనెమ్మదిగా ఉంటూ అన్నీ ఆలోచించి తీసుకొనే నిర్ణయాలు ఆ వ్యక్తిని దు:ఖం నుంచీహానీ నుంచీ కాపాడుతాయి’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2250737) సందర్శకుల సూచీ సంఖ్య : : 13