సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ అమలు చేసిన డీసీఎఫ్‌డీసీ పథకం ద్వారా చలనచిత్రాలు, సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నాలను విస్తరిస్తున్న భారత్

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 2:42PM by PIB Hyderabad

జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ)కి నిధులను సమాచారప్రసార శాఖ ‘డీసీఎఫ్‌డీసీ (డెవలప్‌మెంట్కమ్యూనికేషన్డిసెమినేషన్ ఆఫ్ ఫిల్మిక్ కంటెంట్పథకం’లో భాగంగా కేటాయిస్తున్నది.

ఫిల్మ్ కంటెంటును రూపొందించడాన్నీనవకల్పనలనీప్రచారం చేయడాన్నీ ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యందీనిలో జాతీయఅంతర్జాతీయ వేదికలపై భారతీయ చలనచిత్రాలను ప్రోత్సహించడం కోసం చలనచిత్రోత్సవాల్ని ఏర్పాటు చేయడంవాటిలో పాల్గొనడంతో పాటు భారతీయ చలనచిత్రాల వ్యాప్తిని విస్తరింప చేయడానికి చలనచిత్ర రూపకర్తలకూచలనచిత్రాలతో సంబంధం గల సంస్థలకూ ఆర్థిక సహాయాన్ని అందించడం కూడా భాగమేఇది భారత చలనచిత్ర వారసత్వాన్ని సంరక్షించడంపునరుద్ధరించడండిజిటల్ మాధ్యమంలోకి మార్చడంభద్రపరిచే ప్రక్రియలకు మద్దతివ్వడంతో పాటు భారత్లో అంతర్జాతీయ చలనచిత్రాల ఆడియో-విజువల్ సహ నిర్మాణాన్నీచిత్రీకరణనీ ప్రోత్సహిస్తోంది.

మంత్రిత్వ శాఖ.. డీసీడీ‌ఎఫ్‌సీ పథకం ద్వారా చలనచిత్రోత్సవాలుకార్యశాలలుప్రదర్శనలుమాస్టర్‌క్లాసులతో పాటు ప్రచార కార్యకలాపాలను నిర్వహిస్తూ గాని లేదా మద్దతిస్తూ గాని చలనచిత్ర నిర్మాతలకూఇతర సృజనాత్మక వృత్తినిపుణులకూ సహాయ పడుతుందిఇది చలనచిత్ర రంగం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడమే కాక చలనచిత్ర రూపకర్తలుకళాకారులుసాంకేతిక నిపుణులు తదితర చిత్ర పరిశ్రమ వృత్తినిపుణుల మధ్య చర్చలకు మార్గాన్ని సుగమం చేస్తుందిదీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి   https://www.nfdcindia.com నీ,  https://mib.gov.in/en/offerings/schemes-monitoring  నీ చూడవచ్చు.


 

డీసీడీఎఫ్‌సీ పథకంలో భాగంగా నిధుల వినియోగం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి

క్రమ సంఖ్య

ఆర్థిక సంవత్సరం

ఎన్ఎఫ్‌డీసీకి కేటాయించిన,
పంపిణీ చేసిన నిధులు

(రూకోట్లలో)

ఎన్ఎఫ్‌డీసీ వినియోగించిన నిధులు

(రూకోట్లలో)

1

2021-22

84.50

77.69

2

2022-23

127.00

122.78

3.

2023-24

348.12

339.89

4.

2024-25

340.68

324.21

5

2025-26*

232.46

156.86


 

ఫిబ్రవరి 26 వరకు.

చలనచిత్రాలుసంబంధిత కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు ఏటా గోవాలో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని (ఐఎఫ్ఎఫ్ఐ.. ‘ఇఫీ’)ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని సమాచారప్రసార శాఖ ఎన్ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో  ఏర్పరుచుకుంటున్నది.

దీనికి అదనంగా, 2025 నుంచి ముంబయిలో ‘వేవ్స్’ (ప్రపంచ శ్రవణదృశ్యవినోద శిఖరాగ్ర సదస్సు)ను విజయవంతంగా నిర్వహించారుఅలాగేమహారాష్ట్ర చలనచిత్రరంగస్థలసాంస్కృతిక అభివృద్ధి సంస్థ (ఎంఎఫ్ఎస్‌సీడీసీఎల్సహకారంతో మహారాష్ట్రలోని ఫిల్మ్ సిటీలో రెసిడెన్షియల్ రైటర్స్ ల్యాబును నిర్వహించారుఆయా సంవత్సరాల వారీగా ప్రముఖ కార్యక్రమాలుస్క్రీనింగులుషోలుప్రతినిధులుపాల్గొన్నవారి వివరాలు కింద ప్రస్తావించిన విధంగా ఉన్నాయి:

సంవత్సరం

 కార్యక్రమం

స్క్రీనింగులు

షోల సంఖ్య

ప్రతినిధులు

పాల్గొనే వారు సుమారుగా

2025

భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)

380

17,999

2025

ప్రపంచ శ్రవణదృశ్యవినోద శిఖరాగ్ర సదస్సు (‘వేవ్స్’)

-

1,00,000 +

2024

భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)

435

15,384

2024

ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)

314

12,027

2023

భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)

318

13,902

2022

భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)

293

12,431

2022

ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)

119

8,898

2021

భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)

236

8,888


 

ఈ కార్యక్రమాల్లో  వివిధ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు.

ఈ సమాచారాన్ని సమాచారప్రసార శాఖపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ లోక్‌సభలో శ్రీ జికుమార్ నాయక్ ‌కు ఈ రోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలియజేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2238443) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam