హోం మంత్రిత్వ శాఖ
సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు
దేశ కీలక సంస్థలను కాపాడడంలో గాని, లేదా సంక్షోభ సమయాల్లో దేశాన్ని రక్షించడంలో గాని
వారి అంకిత భావం నిజమైన దేశభక్తికీ, వృత్తినైపుణ్యంతో కూడిన నిబద్ధతకీ అద్దం పడుతోంది
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులకు నివాళులు
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 11:31AM by PIB Hyderabad
కేంద్ర పారిశ్రామిక భద్రతాదళ (సీఐఎస్ఎఫ్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆ దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో ‘‘సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. దేశ కీలక సంస్థలను కాపాడడంలో, సంక్షోభ సమయాల్లో దేశాన్ని రక్షించడంలో వారి అంకిత భావం.. సిసలైన దేశభక్తికీ, వృత్తినైపుణ్యంతో కూడిన నిబద్ధతకీ అద్దం పడుతోంది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులకు నేను నివాళులు అర్పిస్తున్నాను ’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2237395)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam