వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసిన భారత్-ఇజ్రాయెల్ ఎఫ్‌టీఏ తొలి విడత చర్చలు


ఎఫ్‌టీఏ చర్చల్లో విస్తృత అంశాలపై సమీక్ష.. మే 2026లో ఇజ్రాయెల్‌లో తదుపరి విడత చర్చలు

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 6:56PM by PIB Hyderabad

భారత్-ఇజ్రాయెల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు న్యూఢిల్లీలో జరిగిన మొదటి విడత చర్చలు ఇవాళ విజయవంతంగా ముగిశాయివాణిజ్యంఆర్థిక సహకారాన్ని పెంపొందించే అంశాలపై చర్చలకు రూపొందించిన అధికారిక విధివిధానాల(టీఓఆర్)పై నవంబర్ 2025లో సంతకాలు జరిగాయి.

రెండు రోజుల పర‌్యటన నిమిత్తం ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఫిబ్రవరి 2026న జెరూసలెంలోని నెసెట్ ప్రత్యేక ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారుఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు వినియోగించుకోని వాణిజ్య సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ప్రతిష్ఠాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత్‌కు వచ్చిన ఇజ్రాయెల్ ప్రతినిధి బృందంతో 24 ఫిబ్రవరి 2026న కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమావేశమయ్యారువాణిజ్యంఆవిష్కరణలువృద్ధి రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇరుపక్షాలు పనిచేయాలనితద్వారా రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారుఆధునికసమగ్రభవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే వాణిజ్య ఒప్పందానికి ఇరుదేశాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

నాలుగు రోజుల పాటు జరిగిన చర్చల్లో వస్తు, సేవల వాణిజ్యంవస్తువుల మూల స్థాన నియమావళిశానిటరీఫైటోశానిటరీ చర్యలువాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులుసుంకాల విధానాలుమేధో సంపత్తి హక్కులుడిజిటల్ వాణిజ్యం వంటి విస్తృతమై అంశాలపై ఇరుదేశాలు చర్చించాయినిర్మాణాత్మకంగాభవిష్యత్ ప్రణాళికతో ఈ చర్చలు జరిగాయిసమగ్రసమతుల్యఇరుపక్షాలకు ప్రయోజకర ఒప్పందాల కోసం చర్చలు జరపాలని ఇరుదేశాల లక్ష్యాన్ని స్పష్టం చేశాయితదుపరి విడత ప్రత్యక్ష చర్చలు మే 2026లో ఇజ్రాయెల్‌లో జరగనున్న నేపథ్యంలో అంతకన్నా ముందుగా వర్చువల్ పద్ధతిలో చర్చలను కొనసాగించటానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

 

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం సుమారు 3.62 బిలియన్ డాలర్లుభారత్ఇజ్రాయెల్‌లో వ్యాపారాలకు స్థిరమైనఅంచనా వ్యవస్థను అందించటం ద్వారా వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతిపాదిత ఎఫ్‌టీఏ అవకాశం కల్పిస్తుందియంత్రాలురసాయనాలువస్త్రాలువ్యవసాయంవైద్య పరికరాలుఅధునాతన సాంకేతికతలు వంటి కీలక రంగాల్లో ఇప్పటికీ వినియోగించుకోని సామర్థ్యం ఉందని ఇరుపక్షాలు గుర్తించాయిఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికివాణిజ్య భాగస్వాములకు నూతన అవకాశాలను సృష్టించటానికి ఇరుదేశాలు ఇస్తున్న ప్రాధాన్యతను విజయవంతమైనన మొదటి విడత చర్చలు ప్రతిబింబిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2233344) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Malayalam