ప్రధాన మంత్రి కార్యాలయం
కృత్రిమ మేధ విషయంలో ప్రపంచ వేదికపై భారత్ కీలకం: సెర్బియా అధ్యక్షుడి కథనాన్ని పంచుకున్న ప్రధాని మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 7:57PM by PIB Hyderabad
సెర్బియా అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ వుచిక్ అభిప్రాయపడినట్లుగా కృత్రిమ మేధ రంగంలో భారత్ చూపిస్తోన్న నాయకత్వానికి లభించిన గుర్తింపును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతించారు. 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు' కేవలం ఒక సదస్సు మాత్రమే కాదని.. ఇది కృత్రిమ మేధకు సంబంధించిన ప్రపంచ చర్చా వేదికలో భారత్ను కేంద్ర బిందువుగా నిలబెట్టిన ఒక నిర్ణయాత్మక ఘట్టమని సెర్బియా అధ్యక్షుడు ప్రధానంగా పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
" ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు' అనేది కేవలం ఒక సదస్సు మాత్రమే కాదని సెర్బియా అధ్యక్షుడు రాశారు. కృత్రిమ మేధకు సంబంధించిన ప్రపంచ చర్చా వేదికలో భారత్ను ఈ సదస్సు ఏ విధంగా కేంద్ర బిందువుగా నిలబెట్టిందో ఆయన వివరంగా పేర్కొన్నారు."
***
(రిలీజ్ ఐడి: 2229375)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4