రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

భారత అండర్-19 క్రికెట్ జట్టు ఘనవిజయంపై ఎగువసభలో అభినందనలు తెలియజేసిన రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీ. పీ. రాధాకృష్ణన్

నాడు పోస్టు చేయడమైనది: 09 FEB 2026 1:56PM by PIB Hyderabad

గౌరవనీయ సభ్యులారా.. జింబాబ్వేలోని హరారేలో జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లండు జట్టుపై ఘనవిజయం సాధించి మన దేశానికి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టిన భారత అండర్-19 క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనను నేను ఎంతో గర్వంతో ప్రస్తావిస్తున్నాను.

రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవడం మన యువతలో ఉన్న అపారమైన నైపుణ్యాలనుఅంకితభావాన్నిక్రీడా నైపుణ్యాన్ని మరోసారి చాటిచెప్పింది.

గౌరవనీయ సభ్యులారా..నేను ఎల్లప్పుడూ బృంద స్ఫూర్తిని అభినందిస్తానుఈ విజయం మొత్తం జట్టుకు దక్కినప్పటికీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధికంగా 175 పరుగులు సాధించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మాటలను రికార్డుల్లో నమోదు చేయాలనుకుంటున్నానుఫైనల్ వరకు జరిగిన ప్రయాణంలో అతని తోటి క్రీడాకారులు ప్రదర్శించిన అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయివారి ఉజ్వల భవిష్యత్తుకు ఇవి నిదర్శనం.

నాతో పాటు ఈ సభ తరఫున జట్టు కెప్టెన్, క్రీడాకారులుకోచ్‌లుసహాయక సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానుఈ యువ ఛాంపియన్లు రాబోయే కాలంలో మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.

 

***


(రిలీజ్ ఐడి: 2225565) సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , Tamil , English , हिन्दी , Bengali , Gujarati