భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం ఈ డ్రైవ్ పథకం

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2026 4:41PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్’ (పీఎం--డ్రైవ్పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగిందిఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలుత్రిచక్ర వాహనాలు (-రిక్షాలు-కార్టులుఎల్వర్గం), -అంబులెన్సులు-ట్రక్కులు వంటి అనేక ఈవీ విభాగాలకు డిమాండ్ ఆధారిత ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోందితద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడానికి తోడ్పడుతోందిఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు (కొనుగోలుదారులు లేదా తుది వినియోగదారులుముందస్తు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే వాహనం ధర తగ్గుతుందిఈ ప్రోత్సాహక మొత్తాన్ని భారత ప్రభుత్వం వాహన తయారీదారులకు (ఓఈఎమ్ లుతిరిగి చెల్లిస్తుంది.

 

ఈ పథకం ద్వారా 28 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు లభిస్తోంది. 2026 జనవరి 27 నాటికి ఈ పథకం కింద మొత్తం 22.12 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయివీటిలో 19.19 లక్షల ఈ-ద్విచక్ర వాహనాలు.. 2.93 లక్షల ఈ-త్రి చక్ర వాహనాలు ఉన్నాయి.

 

ఈ పథకం కింద 14,028 ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం కోసం రూ. 4,391 కోట్లను కేటాయించారువీటిలో 40 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన ఏడు నగరాల్లో (బెంగళూరుఢిల్లీముంబయిహైదరాబాద్అహ్మదాబాద్పూణేసూరత్) 13,800 -బస్సులను రెండు దశల్లో కేటాయించారుమొదటి దశలో కేటాయించిన 10,900 -బస్సుల కోసం సీఈఎస్ఎల్ ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా.. రెండో దశలో కేటాయించిన మిగిలిన 2,900 -బస్సుల కోసం 09.01.2026న టెండర్లను పిలిచారు.

ఈ పథకం ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటునకుటెస్టింగ్ సౌకర్యాల ఆధునీకరణకు కూడా మద్దతు అందిస్తోందిదేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రజా ఛార్జింగ్ స్టేషన్లు (ఈవీపీసీఎస్ఏర్పాటు కోసం రూ. 2,000 కోట్లను కేటాయించారు.

 

ఈ చర్యలు దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేశాయి. వినియోగదారుల్లోలో నమ్మకాన్ని పెంచాయిస్వచ్ఛమైనస్థిరమైన రవాణా పరిష్కారాలను స్వీకరించేలా ప్రోత్సహించాయి.

 

డిసెంబర్ 31, 2025 నాటికి పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్రత్రిచక్ర వాహన కొనుగోలుదారులకు అందించిన డిమాండ్ ప్రోత్సాహక రీయింబర్స్‌మెంట్ కింద మొత్తం రూ. 1,703 కోట్లను సంబంధిత వాహన తయారీదారులకు ప్రభుత్వం తిరిగి చెల్లించింది.

 

ఈ సమాచారాన్ని నేడు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2222821) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Kannada