పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బారామతీ విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన పౌర విమానయాన శాఖ


బ్లాక్ బాక్స్ స్వాధీనం… సమగ్ర, గడువు ఆధారిత దర్యాప్తునకు ప్రాధాన్యత

प्रविष्टि तिथि: 29 JAN 2026 11:23AM by PIB Hyderabad

బారామతీ సమీపంలో విమానం కూలిపోయిన సంఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చర్యలకు ఉపక్రమించిందిఅవసరమైన ప్రతిస్పందన పూర్వక చర్యల్ని చేపట్టడంతో పాటు దర్యాప్తు యంత్రాంగాల్ని రంగంలోకి దింపిందికూలంకషమైనపారదర్శకమైనగడువుతో కూడిన దర్యాప్తునకు ప్రాధాన్యాన్ని ఇస్తోంది.
న్యూఢిల్లీ లో ముగ్గురితో కూడిన ఏఏఐబీ అధికారుల బృందంతో పాటుడీజీసీఏ ముంబయి ప్రాంతీయ కార్యాలయానికి చెందిన మరో ముగ్గురు అధికారుల బృందం కూడా జనవరి 28 న ప్రమాద స్థలాన్ని సందర్శించాయిఏఏఐబీ డైరెక్టర్ జనరల్ శ్రీ జి.వి.జియుగంధర్ అదే రోజు అక్కడికి చేరుకున్నారుదర్యాప్తు శరవేగంగా సాగుతున్నదిదుర్ఘటనకు గురైన విమానం బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తును నిర్ణీత కాలం లోపలప్రామాణిక విధి విధానాలతో పాటు నిర్దేశిత మార్గదర్శక సూత్రాలను తూచా తప్పకుండా అనుసరిస్తూ పూర్తి చేయడానికి పౌర విమానయాన శాఖ (ఎంఓసీఏకట్టుబడి ఉంది.
ఏఏఐబీ నియమావళి- 2025 లోని 5, 112వ నియమాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతోంది.

 

***


(रिलीज़ आईडी: 2220045) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam