భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్యావరణ, ఆర్థిక భద్రతకు అండమాన్, నికోబార్ దీవుల జీవ వైవిధ్యం అత్యంత కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్


శ్రీ విజయపురంలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) సందర్శన సందర్భంగా అండమాన్, నికోబార్ దీవులను 'జీవవైవిధ్య సజీవ ప్రయోగశాల'గా అభివర్ణించిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

ద్వీప జీవవైవిధ్యం వాతావరణ స్థితిస్థాపకతకు కీలకం.. భారత జీవవైవిధ్య విజ్ఞానాన్ని బలోపేతం చేసిన ఐదు దశాబ్దాల జడ్ఎస్ఐ పరిశోధనలు: డాక్టర్ జితేంద్ర సింగ్

భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థ దార్శనికతకు, పర్యావరణ లక్ష్యాలకు జడ్ఎస్ఐ వంటి శాస్త్రీయ సంస్థల బలోపేతమే కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్

प्रविष्टि तिथि: 19 JAN 2026 12:15PM by PIB Hyderabad

పర్యావరణఆర్థిక భద్రతకు అండమాన్నికోబార్ దీవుల జీవ వైవిధ్యం అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతికభూ విజ్ఞాన శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), పీఎంవోసిబ్బందిప్రజా ఫిర్యాదులుపెన్షన్లుఅణుశక్తిఅంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

శ్రీ విజయపురంలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐఅండమాన్నికోబార్ ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ద్వీపాల్లోని జీవవైవిధ్య వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి వివరించారు.

శాస్త్రవేత్తలుఅధికారులను ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్.. అండమాన్నికోబార్ దీవులను "జీవవైవిధ్య సజీవ ప్రయోగశాల"గా అభివర్ణించారుఇక్కడ ఆత్యాధునిక విజ్ఞాన శాస్త్రంసంరక్షణస్థిరమైన జీవనోపాధి పరస్పరం ముందుకు సాగాలని తెలిపారుజీవవైవిధ్య పరిరక్షణవాతావరణ స్థితిస్థాపకతసముద్రయాన ఆర్థిక వృద్ధిపై జాతీయ విధానాలను రూపొందించటంలో జెడ్ఎస్ఐ వంటి సంస్థల ప్రామాణిక శాస్త్రీయ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు.

జెడ్ఎస్ఐ శాస్త్రవేత్త-ఎఫ్ఆఫీసర్ ఇన్ ఛార్జి డాక్టర్ సిశివపెరుమాన్ మంత్రికి స్వాగతం పలికారుఈ సందర్భంగా ప్రాంతీయ కేంద్రం ముఖ్య ఉద్దేశాలనుప్రస్తుత పరిశోధనా కార్యక్రమాలను మంత్రికి వివరించారుఅండమాన్నికోబార్ దీవుల్లోని విలక్షణమైన జంతు వైవిధ్యాన్ని నమోదు చేసిపరిరక్షించిపర్యవేక్షించటంలో ఈ కేంద్రం కీలక పాత్రను పోషిస్తుందని తెలిపారుటాక్సానమీమాలిక్యులర్ సిస్టమాటిక్స్డీఎన్ఏ బార్ కోడింగ్జీవవైవిధ్య అంచనాసామర్థ్య పెంపు వంటి అంశాల్లో జెడ్ఎస్ఐ కృషిని ప్రముఖంగా ప్రస్తావించారు.

1977లో ప్రారంభమైన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐఅండమాన్నికోబార్ ప్రాంతీయ కేంద్రం.. ఐదు దశాబ్దాలుగా శాస్త్రీయ సేవలను అందిస్తుందిపలు రకాల జంతు సమూహాలపై దాదాపు 90 పరిశోధనా కార్యక్రమాలను పూర్తిచేసిఉష్ణమండల ద్వీప జీవవైవిధ్య పరిశోధనల్లో కీలక సంస్థగా ఎదిగిందిఇక్కడి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు 85 పుస్తకాలనుప్రముఖ జాతీయఅంతర్జాతీయ జర్నల్స్ లో 850కిపైగా పరిశోధనా పత్రాలను ప్రచురించటం ద్వారా భారత జీవవైవిధ్య విజ్ఞాన సంపదను పెంపొందించటానికి గణనీయంగా కృషి చేశారు.

అండమాన్నికోబార్ దీవుల్లోని ప్రముఖ పర్యాటకవిద్యా కేంద్రాల్లో ఒకటైన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐమ్యూజియాన్ని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సందర్శించారుఈ మ్యూజియంలో 22 జంతు సమూహాలకు చెందిన సుమారు 3,500 నమూనాలున్నాయిప్రజలకు అవగాహన కల్పించటంలోవిద్యార్థులుపరిశోధకులకు జ్ఞానాన్ని అందించటంలో మ్యూజియం పాత్రను మంత్రికి వివరించారుఏటా సుమారు 75,000 నుంచి 1,00,000 మంది విద్యార్థులుపరిశోధకులుపర్యాటకులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తున్నట్లు చెప్పారుఈ దీవుల్లో మాత్రమే కనిపించే జీవులుఅంతరించిపోతున్నప్రమాదంలో ఉన్న జంతుజాలానికి సంబంధించిన నమూనాలనుప్రదర్శనలను మంత్రి ఎంతో ఆసక్తిగా పరిశీలించారు.

సైన్స్ లో 20కి పైగా కొత్త జాతులనునార్కొండమ్ ట్రీ ష్రూ వంటి వాటిని ఈ కేంద్రంలోని శాస్త్రవేత్తలు గుర్తించారని.. అండమాన్నికోబార్ దీవులుభారత్ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి దాదాపు 900 కొత్త జంతుజాల రికార్డులను నమోదు చేసినట్లు మంత్రికి తెలిపారుఈ ఆవిష్కరణలు ఆ ప్రాంత జీవవైవిధ్యానికున్న ప్రపంచస్థాయి ప్రాముఖ్యతను స్పష్టం చేస్తాయి.

భారతదేశపు మొదటి నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్ సీఆర్ఆర్ఐ)కి నోడల్ సెంటర్‌గా పోర్ట్ బ్లెయిర్‌లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐవ్యవహరిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్‌కు వివరించారుభారత జలాల్లో పగడపు దిబ్బల పరిశోధనపర్యవేక్షణను బలోపేతం చేయటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంతీరప్రాంత పర్యావరణ వ్యవస్థలను రక్షించటానికి, సముద్ర పాలనను ప్రోత్సహించటానికి ఇటువంటి ప్రత్యేక పరిశోధనా సంస్థలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాలుపరిరక్షణ ప్రణాళికలుసామాజిక అవగాహనతో శాస్త్రీయ పరిశోధనలను అనుసంధానించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలుసిబ్బందితో మాట్లాడిన అనంతరం కేంద్రమంత్రి స్పష్టం చేశారుభారతదేశ పర్యావరణ లక్ష్యాలను సాధించటంలోబ్లూ ఎకానమీ సామర్థ్యాన్ని స్థిరంగా వినియోగించుకోవటంలో పటిష్టమైన శాస్త్రీయ సంస్థల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.

సర్వే కేంద్రంలో జరుగుతున్న పనుల పట్ల అభినందనలు వ్యక్తం చేస్తూఅక్కడి అంశాలను వివరించినందుకుమ్యూజియం అంతా చూపించినందుకు డాక్టర్ శివపెరుమాన్జడ్ఎస్ఐ బృందానికి డాక్టర్ జితేంద్ర సింగ్ ధన్యవాదాలు తెలిపారు. "అత్యంత సమాచారభరితమైనవిద్యాప్రదమైన అనుభవం"గా ఈ పర్యటనను అభివర్ణించారుఅక్కడున్న జంతుశాస్త్ర సేకరణలు శాస్త్రీయ అవగాహనను పెంచటమే కాకభారతదేశపు గొప్పఅమూల్యమైన జీవవైవిధ్యం పట్ల ప్రజల్లో చైతనాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు

 

***


(रिलीज़ आईडी: 2216193) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil