ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ నెల 17-18 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి


ఈ నెల 17న మాల్దాలో రూ. 3,250 కోట్లకు పైగా విలువైన పలు రైలు, రహదారి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం, కొన్నింటికి శంకుస్థాపన


హౌరా-గౌహతి (కామాఖ్య) మధ్య తొలి దేశీయ వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

పూర్తి ఏసీ సౌకర్యం గల వందే భారత్ స్లీపర్ రైలుతో ఆధునిక, సౌకర్యవంతమైన, చౌకగానే సుదూర ప్రయాణానుభవం
సింగూర్, హుగ్లీలో రూ. 830 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన

బాలాగఢ్‌లో విస్తరించిన పోర్ట్ గేట్ వ్యవస్థకు శంకుస్థాపన: అంతర్గత జలరవాణా, ప్రాంతీయ అనుసంధానం బలోపేతం

ఏడు అమృత్ భారత్ రైళ్ల ప్రారంభంతో ఇతర రాష్ట్రాలతో పశ్చిమ బెంగాల్‌కు రైలు అనుసంధానం బలోపేతం

प्रविष्टि तिथि: 16 JAN 2026 1:55PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 17-18 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.

జనవరి 17వ తేదీన మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు మాల్దాను సందర్శించిమాల్దా టౌన్ రైల్వే స్టేషన్‌లో హౌరాగౌహతి (కామాఖ్యమధ్య నడిచే దేశీయ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఅనంతరం సుమారు 1:45 గంటలకు ప్రధానమంత్రి మాల్దాలో జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 3,250 కోట్లకు పైగా విలువైన పలు రైలురహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసిపలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.

ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం సుమారు గంటలకు ప్రధానమంత్రి హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో సుమారు రూ. 830 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిశంకుస్థాపన చేస్తారు.

మాల్దాలో ప్రధానమంత్రి కార్యక్రమాలు

ప్రధానమంత్రి మాల్దాను సందర్శించి... పశ్చిమ బెంగాల్ఈశాన్య ప్రాంత కనెక్టివిటీని బలోపేతం చేయడంఅభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ఉద్దేశించిన రూ. 3,250 కోట్ల విలువైన పలు రైలురహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేస్తారుపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

ప్రధానమంత్రి మాల్దా టౌన్ రైల్వే స్టేషన్‌ను సందర్శిస్తారుఅక్కడ నుంచి హౌరా-గౌహతి (కామాఖ్యమధ్య భారత తొలి వందే భారత్ స్లీపర్ రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తారుఆధునిక భారత్‌లో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి అభివృద్ధి చేసిన పూర్తి స్థాయి ఎయిర్ కండిషన్ కలిగిన వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు చౌకలోనే విమాన ప్రయాణం లాంటి అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉందిఇది సుదూర ప్రయాణాలను వేగంగాసురక్షితంగామరింత సౌకర్యవంతంగా చేస్తుందిహౌరా-గౌహతి (కామాఖ్యమార్గంలో ప్రయాణ సమయాన్ని దాదాపు 2.5 గంటలు గణనీయంగా తగ్గించడం ద్వారా ఈ రైలు ఆధ్యాత్మిక పర్యటనలుపర్యాటక రంగాలకు కొత్త ఊపునిస్తుంది.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారువీటిలో బలూర్‌ఘాట్-హిలి మధ్య కొత్త రైలు మార్గంన్యూ జల్‌పాయ్‌గురిలో అత్యాధునిక సరుకు రవాణా నిర్వహణ సౌకర్యాలుసిలిగురి లోకో షెడ్ ఆధునీకరణజల్‌పాయ్‌గురి జిల్లాలో వందే భారత్ రైలు నిర్వహణ సౌకర్యాల ఆధునీకరణలు భాగంగా ఉన్నాయిఈ ప్రాజెక్టులు ప్రయాణికులసరుకు రవాణా కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు ఉత్తర బెంగాల్‌లో సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయిఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తాయి.

న్యూ కూచ్‌బెహార్–బామన్‌హాట్న్యూ కూచ్‌బెహార్–బాక్సిర్‌హాట్ మధ్య రైలు మార్గాల విద్యుదీకరణను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారుదీనివల్ల వేగవంతమైనపరిశుభ్రమైనమరింత ఇంధన సామర్థ్యం గల రైలు కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయి.

కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారున్యూ జల్పైగురినాగర్‌కోయిల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... న్యూ జల్పైగురి-తిరుచిరాపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... అలీపుర్‌దువార్-ఎస్ఎంవీటీ బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... అలీపుర్‌దువార్ ముంబయి (పన్వేల్అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దీనిలో భాగంగా ఉన్నాయిఇది చౌకలోనే నమ్మదగిన సుదూర ప్రాంత రైలు కనెక్టివిటీని పెంచుతుందిఈ సేవలు సాధారణ పౌరులువిద్యార్థులువలస కార్మికులువ్యాపారుల రవాణా అవసరాలకు మద్దతునిస్తాయిఅదే సమయంలో అంతర్-రాష్ట్ర ఆర్థికసామాజిక సంబంధాలనూ బలోపేతం చేస్తాయి.

ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో కూడిన రెండు కొత్త రైలు సర్వీసులు రాధికాపూర్ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్బలూర్‌ఘాట్ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లనూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ రైళ్లు ఈ ప్రాంత యువతకువిద్యార్థులకుఐటీ నిపుణులకు బెంగళూరు వంటి ప్రధాన ఐటీఉపాధి కేంద్ర నగరాలకు ప్రత్యక్షసురక్షితసౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

జాతీయ రహదారి-31డిలోని ధూప్‌గురి–ఫలకాటా విభాగాన్ని పునరుద్ధరించినాలుగు వరుసలుగా విస్తరించే కీలక రహదారి ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారుఈ ప్రాజెక్టు ఉత్తర బెంగాల్‌లో ప్రాంతీయ రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులసరుకు రవాణానూ సులభతరం చేస్తుంది.

ఈ ప్రాజెక్టులు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలోమెరుగైన కనెక్టివిటీని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయితూర్పుఈశాన్య ప్రాంతాలను దేశాభివృద్ధికి కీలక చోదకాలుగా బలోపేతం చేస్తాయి.

హుగ్లీలో ప్రధానమంత్రి కార్యక్రమాలు

హుగ్లీలోని సింగూర్‌లో రూ. 830 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించిశంకుస్థాపన చేస్తారు.

బాలాగఢ్‌లో అంతర్గత జలరవాణా (ఐడబ్ల్యూటీటెర్మినల్రహదారి పైవంతెనతో విస్తరించిన పోర్ట్ గేట్ వ్యవస్థకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

సుమారు 900 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బాలాగఢ్‌ను... సంవత్సరానికి సుమారు 2.7 మిలియన్ టన్నుల (ఎంపీటీఏసామర్థ్యంతో ఒక ఆధునిక కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్నారుకంటైనర్ల ద్వారా రవాణా చేసే సరుకుల కోసం ఒకటిపొడిగా ఉండే భారీ సరుకుల కోసం మరొకటి చొప్పున... రెండు ప్రత్యేక కార్గో హ్యాండ్లింగ్ జెట్టీల నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది.

రద్దీగా ఉండే పట్టణ కారిడార్ల నుంచి భారీ సరుకు రవాణాను మళ్లించడం ద్వారా సరుకు తరలింపు సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడం బాలాగఢ్ ప్రాజెక్ట్ లక్ష్యంఇది రహదారి భద్రతను మెరుగుపరుస్తుందికోల్‌కతా నగరంలో వాహన రద్దీనికాలుష్యాన్నీ తగ్గిస్తుందినివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందిమెరుగైన మల్టీమోడల్ కనెక్టివిటీసరుకు రవాణా సామర్థ్యంతో ప్రాంతీయ పరిశ్రమలుఎంఎస్ఎంఈలువ్యవసాయ ఉత్పత్తిదారులకు సరసమైన ఖర్చుతో మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుందిఈ ప్రాజెక్ట్ గణనీయమైన ప్రత్యక్షపరోక్ష ఉపాధిని సృష్టిస్తుందిసరుకు రవాణాటెర్మినల్ కార్యకలాపాలు... రవాణా సేవలు... నిర్వహణఅనుబంధ కార్యకలాపాల్లో ఉద్యోగాల కల్పన ద్వారా స్థానిక సమాజాలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

కోల్‌కతాలో అత్యాధునిక ఎలక్ట్రిక్ కాటమరాన్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారుకొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ దేశీయ జల రవాణా కోసం దేశీయంగా నిర్మించిన ఎలక్ట్రిక్ కాటమరాన్‌లలో ఇది ఒకటిఅధునాతన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌లులిథియం-టైటనేట్ బ్యాటరీ టెక్నాలజీతో కూడిన 50 మంది ప్రయాణికుల సామర్థ్యం గల హైబ్రిడ్ ఎలక్ట్రిక్ అల్యూమినియం కాటమరాన్... పూర్తి ఎలక్ట్రిక్ జీరో-ఎమిషన్ మోడ్‌లోనూమరింత మన్నిక కోసం హైబ్రిడ్ మోడ్‌లోనూ పనిచేయగలదుఈ నౌక హుగ్లీ నది వెంబడి పట్టణ నదీ రవాణాపర్యావరణ సంబంధిత-పర్యాటకంమారుమూల ప్రాంతాల ప్రయాణికుల కనెక్టివిటీకి మద్దతునిస్తుంది.

జయరాంబతి–బరోగోపినాథ్‌పూర్–మాయనాపూర్ కొత్త రైలు మార్గాన్నీ ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ మార్గం తార్కేశ్వర్–బిష్ణుపూర్ కొత్త రైలు మార్గం ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన భాగంకొత్త రైలు మార్గంతో పాటు మాయనాపూర్-జయరాంబతి మధ్య బరోగోపినాథ్‌పూర్‌లో హాల్ట్‌తో కూడిన కొత్త రైలు సర్వీస్‌నూ ప్రారంభిస్తారుఇది బాంకురా జిల్లా నివాసితులకు ప్రత్యక్ష రైలు అనుసంధానాన్ని అందిస్తుందితద్వారా రోజువారీ ప్రయాణికులకువిద్యార్థులకుయాత్రికులకు ప్రయాణాన్ని మరింత సరసమైనదిగాసౌకర్యవంతంగా మారుస్తుంది.

మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారువాటిలో కోల్‌కతా (హౌరా) - ఆనంద్ విహార్ టెర్మినల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... కోల్‌కతా (సీల్దా) - బనారస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... కోల్‌కతా (సంత్రాగచ్చి) - తాంబరం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.

***


(रिलीज़ आईडी: 2215488) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam