ప్రధాన మంత్రి కార్యాలయం
తిరువళ్లువర్ దినం సందర్భంగా తిరువళ్లువర్కు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
16 JAN 2026 9:24AM by PIB Hyderabad
తిరువళ్లువర్ దినం సందర్భంగా, ఆ బహుముఖ జ్ఞానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. కాలదోషం పట్టని తిరువళ్లువర్ రచనలు, ఆయన ఆదర్శాలు తర తరాలుగా అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తిని అందిస్తున్నాయి.
సద్భావన, కరుణ నిండిన సమాజాన్ని ఆవిష్కరించాలని తిరువళ్లువర్ భావించారు.. ఈ విలువలు ఈనాటికీ సందర్భశుద్ధి కలిగినవే అని శ్రీ మోదీ అన్నారు. జ్ఞానం, ఐకమత్యాల ప్రతీక తిరువళ్లువర్.. తమిళ సంస్కృతిలో సర్వోత్తమ పార్శ్వాలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రధాని ఉద్ఘాటించారు.
కవి, సాధువు తిరువళ్లువర్ బోధనల సారాన్ని గ్రహించాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ -
‘‘ఈ రోజు, తిరువళ్లువర్ దినం.. బహుముఖ ప్రతిభాసంపన్నుడు తిరువళ్లువర్కు నేను నమస్కరిస్తున్నాను. ఆయన రచనలతో, భావాలతో అనేక మంది ఇప్పటికీ స్ఫూర్తిని పొందుతున్నారు. సమాజాన్ని ఐకమత్యం కలిగిఉండేదిగా, కరుణతో నిండి ఉండేదిగా తీర్చిదిద్దుకోవాలని ఆయన నమ్మారు. తమిళ సంస్కృతిలోని సర్వోత్తమ పార్శ్వాలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహనీయుడు తిరువళ్లువర్కు ఉన్న విశిష్ట వివేక సారంతో పొంగిపొరలే తిరుక్కురళ్ను చదవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’.
***
(रिलीज़ आईडी: 2215219)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam