ప్రధాన మంత్రి కార్యాలయం
వికసిత్ భారత్ యువ నేతల చర్చ-2026 కార్యక్రమంలో తన ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
13 JAN 2026 9:16AM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నేతల చర్చ-2026’ కార్యక్రమంలో తన ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాల్లో ఇలా రాశారు:
‘‘గత 11 సంవత్సరాలుగా దేశంలో ప్రతి రంగంలోనూ అవకాశాల తలుపులు అనేకం తెరుచుకుంటున్నాయి. కంటెంటు, సృజనాత్మకత రంగాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి.. ఈ రంగాల్లో మన యువ సహచరులు రామాయణ, మహాభారతాల్లోని స్ఫూర్తిదాయక కథలను కూడా గేమింగ్ జగతిలో భాగంగా చేయవచ్చు. మన హనుమాన్ జీ యే పూర్తి ప్రపంచంలో గేమింగుకు సారథ్యాన్ని వహించ గలుగుతారు!
#YoungLeadersDialogue2026”
‘‘మనం ప్రారంభించిన తదుపరి తరం సంస్కరణల పరంపర.. ఇప్పుడు రిఫార్మ్ ఎక్స్ప్రెస్లా మారింది. దీనిలో ప్రధాన ప్రయోజనాల్ని మన యువ శక్తి కోసమే ఉద్దేశించాం.
#YoungLeadersDialogue2026”
‘‘బానిసత్వ మనస్తత్వం నుంచి మనం బయటపడి, మన వారసత్వాన్నీ, మన ఆలోచనల్నీ సదా అగ్ర స్థానంలో నిలబెట్టాలి. స్వామి వివేకానందుల వారి జీవితం మనకు నేర్పుతున్నది కూడా ఇదే.
#YoungLeadersDialogue2026”
(रिलीज़ आईडी: 2215013)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam