ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒమన్‌లోని భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 18 DEC 2025 1:32PM by PIB Hyderabad

మస్కట్‌లో అక్కడి భారతీయుల భారీ సమావేశాన్నుద్దేశించి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారువివిధ భారతీయ పాఠశాలలకు చెందిన సుమారు 700 మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుఒమన్‌లో భారతీయ పాఠశాలలను నెలకొల్పి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతున్నాయిఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లోని కుటుంబాలుమిత్రుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారుఆత్మీయంగావర్ణశోభితంగా తనకు స్వాగతం పలికిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారుఒమన్‌లో స్థిరపడిన భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను కలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారువైవిధ్యమే భారతీయ సంస్కృతికి మూలమనీభారతీయులు ఏ సమాజంతోనైనా కలిసిపోవడానికి ఈ వైవిధ్యమే కారణమని వ్యాఖ్యానించారుఒమన్‌లో భారతీయ సమాజానికి లభిస్తున్న గౌరవాన్ని ప్రస్తావిస్తూ.. సహజీవనంసహకారం భారతీయ ప్రవాసుల విశేష లక్షణమని ప్రధానమంత్రి ప్రశంసించారు.

మాండవీ నుంచి మస్కట్ వరకు.. భారత్ఒమన్ మధ్య ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలున్నాయనీకఠోర పరిశ్రమఐక్యత ద్వారా ఆ సంబంధాలను ఇక్కడి భారతీయ ప్రవాసులు నేడు మరింత ముందుకు తీసుకెళ్తున్నారనీ ప్రధానమంత్రి అన్నారుభారత్ కో జానియే క్విజ్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారిని ఆయన ప్రశంసించారు. భారత్ - ఒమన్ సంబంధాలకు విజ్ఞానమే కేంద్రంగా ఉందంటూ, ఆ దేశంలో భారతీయ పాఠశాల్ని నెలకొల్పి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అభినందనలు తెలిపారుఒమన్‌లో అక్కడి భారతీయుల సంక్షేమానికి దోహదపడుతున్న గౌరవ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌కు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

భారత వికాసంఅభివృద్ధిలో విప్లవాత్మక మార్పుల గురించీ.. వేగంగావిస్తృతంగా దేశం మారుతున్న తీరు గురించీ.. గత త్రైమాసికంలో శాతానికి పైగా వృద్ధిరేటుతో సత్తా చాటిన భారత ఆర్థిక వ్యవస్థ శక్తి గురించీ ప్రధానమంత్రి మాట్లాడారుగత 11 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధితయారీఆరోగ్య సంరక్షణపర్యావరణ హిత వృద్ధిమహిళా సాధికారత రంగాల్లో దేశంలో గణనీయమైన మార్పులొచ్చాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలుఅంకుర సంస్థలుడిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా.. 21వ శతాబ్దం కోసం భారత్ సన్నద్ధమవుతోందని ఆయన వ్యాఖ్యానించారుప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 50 శాతానికి పైగా వాటా ఉన్న భారత యూపీఐ.. మనకు గర్వకారణమనిఅది మన గొప్ప విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారుచంద్రుడిపై కాలుమోపడం నుంచి త్వరలో చేపట్టనున్న గగన్‌యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర వరకు... అంతరిక్ష రంగంలో భారత్ ఇటీవల సాధించిన అద్భుత విజయాలను ఆయన ప్రస్తావించారుభారత్ ఒమన్ మధ్య సహకారంలో అంతరిక్ష రంగం ముఖ్య భాగమన్న ఆయన యువతనుద్దేశించి ఇస్రో ప్రారంభించిన ‘యువికా’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విద్యార్థులను ఆహ్వానించారుభారత్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదనీవస్తువులు సేవల నుంచి డిజిటల్ మార్గాల వరకు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

అక్కడి భారతీయుల సంక్షేమానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుమన ప్రజలకు ఎప్పుడుఎక్కడ సహాయం అవసరమైనా.. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు.

ఏఐ సహకారండిజిటల్ అభ్యసనంఆవిష్కరణల్లో భాగస్వామ్యం, వ్యాపారపరంగా ఆదానప్రదానాల ద్వారా.. భారత్ - ఒమన్ భాగస్వామ్యం భవిష్యత్ సన్నద్ధంగా ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. యువత పెద్ద కలలు కనాలనినిశితంగా అభ్యసించాలనిసాహసోపేతమైన ఆవిష్కరణలు చేయాలనీ.. తద్వారా మానవాళికి అర్థవంతంగా సేవలందించాలనీ ఆయన పిలుపునిచ్చారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2206118) సందర్శకుల సూచీ సంఖ్య : : 42