ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

భారత్‌ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది: ప్రధాని

ప్రపంచం మాంద్యం, అపనమ్మకం, విచ్ఛిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అభివృద్ధి, నమ్మకంతో దేశాల మధ్య వారధిగా భారత్: ప్రధానమంత్రి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక వృద్ధి చోదకంగా మారుతున్న భారత్: ప్రధాని

భారత నారీశక్తి అద్భుతాలు చేస్తోంది:మన కుమార్తెలు నేడు ప్రతి రంగంలో రాణిస్తున్నారు: ప్రధాని

మన వేగం స్థిరంగా ఉంది: మన దిశ ఒకే విధంగా ఉంది: మన తొలి ప్రాధాన్యం ఎల్లప్పుడూ దేశమే: ప్రధానమంత్రి

ప్రతి రంగం పాత వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి, గర్వంతో కొత్త విజయాలను లక్ష్యంగా పెట్టుకుంది: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 06 DEC 2025 8:32PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూదేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కావడాన్ని గమనించినట్టు తెలిపారుసదస్సు నిర్వాహకులకుతమ ఆలోచనలు పంచుకున్నవారందరికీ ఆయన అభినందనలు తెలిపారుశోభనాజీ ప్రస్తావించిన రెండు అంశాలను తాను శ్రద్ధగా గమనించినట్లు శ్రీ మోదీ తెలిపారుఅందులో మొదటిదిగతంలో తాను ఈ వేదికకు వచ్చినప్పుడు చేసిన ఒక సూచనను ఆమె గుర్తు చేశారనిమీడియా సంస్థల విషయంలో అలా సూచనలు ఇవ్వడం చాలా అరుదనిఅయినా తాను ఆ పని చేశానని ఆయన అన్నారుఆ సూచనను శోభనా జీవారి బృందం ఉత్సాహంగా అమలు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారుఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడుఫొటోగ్రాఫర్లు క్షణాలను చిరస్మరణీయంగా మలిచిన తీరును చూశాననిఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆయన కోరారుశోభనా జీ ప్రస్తావించిన రెండో అంశం గురించి శ్రీ మోదీ వివరిస్తూతాను దేశానికి సేవ చేస్తూ ఉండాలన్నది కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదనిఇదే విధంగా సేవలు కొనసాగించాలని హిందుస్థాన్ టైమ్స్ పత్రికే స్వయంగా చెబుతున్నట్లుగా తాను భావిస్తున్నానని అన్నారుఇందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంవత్సరం సదస్సు 'ట్రాన్స్‌ఫార్మింగ్ టుమారో' (రేపటిని మార్చడంఅనే ఇతివృత్తాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారుహిందూస్తాన్ టైమ్స్ పత్రికకు 101 సంవత్సరాల చరిత్ర ఉందనిఈ పత్రికకు మహాత్మా గాంధీమదన్ మోహన్ మాలవ్యఘన్‌శ్యామదాస్ బిర్లా వంటి మహనీయుల ఆశీస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారుఈ పత్రిక 'రేపటిని మార్చడంగురించి చర్చిస్తున్నప్పుడుభారతదేశంలో జరుగుతున్న మార్పు కేవలం అవకాశాలకు సంబంధించినది మాత్రమే కాదనిఅది జీవితాలనుఆలోచనలనుదిశలను మారుస్తున్న నిజమైన కథనం అని దేశానికి నమ్మకం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.  

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినం కూడా నేడే అని గుర్తుచేస్తూయావత్ భారతీయుల తరపున శ్రీ మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. 21వ శతాబ్దంలో ఇప్పటికే నాలుగో వంతు గడిచిపోయిన కీలక దశలో మనం ఉన్నామని ఆయన చెప్పారుఈ 25 ఏళ్లలో ప్రపంచం అనేక ఎత్తుపల్లాలను చూసిందని ఆయన పేర్కొన్నారుఆర్థిక సంక్షోభాలుప్రపంచ మహమ్మారిసాంకేతిక అంతరాయాలువిచ్ఛిన్నమైన ప్రపంచంనిరంతరం జరుగుతున్న యుద్ధాలు వంటి సవాళ్లను ప్రపంచం చవిచూసిందని ఆయన వివరించారు.ఈ పరిస్థితులన్నీ ఏదో ఒక రూపంలో ప్రపంచాన్ని సవాలు చేస్తున్నాయనిప్రపంచం అనిశ్చితితో నిండి ఉందని ప్రధానమంత్రి చెప్పారు. “ఈ అనిశ్చిత పరిస్థితుల్లో భారత్ లో మాత్రం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోందిఒక భిన్నమైన స్థాయిలో భారత్ తనను తాను ప్రదర్శించుకుంటోంది” అని శ్రీ మోదీ అన్నారుప్రపంచం మాంద్యం  గురించి మాట్లాడుతున్నప్పుడుభారత్ మాత్రం వృద్ధి కథను లిఖిస్తోందని పేర్కొన్నారుప్రపంచం అపనమ్మకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలోభారత్ విశ్వాసానికి ఒక ఆధారంగా మారుతోందని వివరించారుఅలాగేప్రపంచం విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నప్పుడుభారత్ ఒక వారధిగా ఉద్భవిస్తోందని స్పష్టం చేశారు.

కొద్ది రోజుల క్రితమే విడుదలైన భారత రెండో త్రైమాసిక జీడీపీ (జీడీపీగణాంకాలను ప్రధాని ప్రస్తావిస్తూఆ గణాంకాలు ఎనిమిది శాతానికి పైగా వృద్ధి రేటును చూపాయనిఇది ప్రగతి లోని కొత్త వేగాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.  ఈ వృద్ధి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదనిఇది ఒక బలమైన స్థూల ఆర్థిక సంకేతమని ప్రధానమంత్రి స్పష్టం చేశారునేడు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదక శక్తిగా మారుతోందనే సందేశాన్ని ఈ సంఖ్య అందిస్తోందని ఆయన తెలిపారు.

ప్రపంచ వృద్ధి మూడు శాతంగాజీ-7 దేశాల ఆర్థిక వ్యవస్థల సగటు వృద్ధి ఒకటిన్నర శాతంగా ఉన్న సమయంలో ఈ గణాంకాలు వచ్చాయని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారుఇటువంటి పరిస్థితులలో భారత్ అధిక వృద్ధి తక్కువ ద్రవ్యోల్బణానికి ఒక నమూనాగా ఆవిర్భవించిందని ఆయన చెప్పారుగతంలో ఆర్థికవేత్తలు అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేసిన సమయం ఉండేదని శ్రీ మోదీ గుర్తు చేశారుకానీఈ రోజు అదే ఆర్థికవేత్తలు తక్కువ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు.

భారత్ సాధించిన విజయాలు సాధారణమైనవి కావనిఅలాగే కేవలం గణాంకాలకు సంబంధించినవి కూడా కాదని,  గత దశాబ్దంలో దేశం తీసుకొచ్చిన ప్రధాన మార్పును అవి సూచిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారుప్రధాన మార్పు అంటేసుస్థిరత్వంసమస్యలకు పరిష్కారాలు కనుగొనే ధోరణిఅపోహల మేఘాలను తొలగించడం,ఆకాంక్షలను విస్తృతం చేయడం అని వివరించారుఈ కారణం చేతనే నేటి భారతదేశం తనను తాను మార్చుకుంటోందనిరాబోయే రేపటిని కూడా మారుస్తోందని ఆయన తెలిపారు.

రేపటిని మారుస్తున్నాం అని చర్చిస్తున్నప్పుడుఈ మార్పుపై ఉన్న విశ్వాసం నేడు జరుగుతున్న కార్యకలాపాల బలమైన పునాదిపై ఆధారపడి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారునేటి సంస్కరణలు మాత్రమే రేపటి మార్పునకు మార్గం సుగమం చేస్తున్నాయని ఆయన చెప్పారు.  

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వివరిస్తూ,  భారతదేశ సామర్థ్యంలో అధిక భాగం చాలా కాలం పాటు వినియోగంలోకి రాలేదని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ వినియోగంలోకి రాని సామర్థ్యానికి ఎక్కువ అవకాశాలు దక్కినప్పుడుదేశ అభివృద్ధిలో అది పూర్తిగానిస్సంకోచంగా పాల్గొన్నప్పుడుదేశంలో మార్పు తథ్యమని ఆయన తెలిపారుగత దశాబ్దాలలో తూర్పు భారతదేశంఈశాన్య రాష్ట్రాలుగ్రామాలుటైర్-2, టైర్-3 నగరాలుమహిళా శక్తిఆవిష్కరణలు చేసే యువతసముద్ర సామర్థ్యం బ్లూ ఎకానమీఅంతరిక్ష రంగం వంటి వాటి పూర్తి సామర్థ్యం వినియోగం కాలేదని ప్రధాని తెలిపారుగుర్తు చేశారుఈ వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని వినియోగించే దృష్టితో నేడు భారత్ పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారుతూర్పు భారతదేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలుఅనుసంధానంపరిశ్రమలలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు.  గ్రామాలుచిన్న పట్టణాలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయనిచిన్న పట్టణాలు స్టార్టప్‌లుఎంఎస్ఎంఈలకు  కొత్త కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారుగ్రామాల్లోని రైతులు ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేసి నేరుగా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానం అవుతున్నారని ఆయన వివరించారు.  

భారతదేశ మహిళా శక్తి అసాధారణ విజయాలను సాధిస్తోందిమన కుమార్తెలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారుఅని ప్రధానమంత్రి ఉద్ఘాటించారుఈ మార్పు కేవలం మహిళా సాధికారతకు మాత్రమే పరిమితం కాకుండాసమాజ ఆలోచనాధోరణినిశక్తిని సైతం సమూలంగా మారుస్తోందని ఆయన స్పష్టం చేశారు.

నూతన అవకాశాలు సృష్టించినప్పుడుఅడ్డంకులు తొలగించినప్పుడుఆకాశంలో ఎదగడానికి కొత్త రెక్కలు తోడవుతాయిఅని ప్రధానమంత్రి అన్నారుదీనికి ఉదాహరణగాగతంలో కేవలం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భారత అంతరిక్ష రంగాన్ని ఆయన ప్రస్తావించారుఅంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగానికి సైతం తెరిచేందుకు సంస్కరణలు ప్రవేశపెట్టామనిఆ ఫలితాలు ఇప్పుడు దేశానికి స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారుకేవలం పదిపదకొండు రోజుల క్రితమే తాను హైదరాబాద్‌లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారుస్కైరూట్ ఒక ప్రైవేట్ భారతీయ అంతరిక్ష సంస్థ అనిఈ సంస్థ ప్రతి నెలా ఒక రాకెట్‌ను నిర్మించే సామర్థ్యం దిశగా కృషి చేస్తోందనిప్రస్తుతం విక్రమ్-1 అనే ఫ్లైట్-రెడీ రాకెట్‌ను అభివృద్ధి చేస్తోందని ప్రధానమంత్రి వివరించారుప్రభుత్వం కేవలం ఒక వేదికను మాత్రమే అందించిందనిదానిపై భారత యువత ఒక నూతన భవిష్యత్తును నిర్మిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఇదే నిజమైన మార్పుఅని ఆయన స్పష్టం చేశారు

ఒకప్పుడు సంస్కరణలు అనేవి కేవలం రాజకీయ ప్రయోజనాల వలనోలేదా ఒక సంక్షోభాన్ని నిర్వహించాల్సిన అవసరం వలనో మాత్రమే ప్రతిస్పందనాత్మకంగా  ఉండేవని ఆయన గుర్తు చేశారుకానీనేడు జాతీయ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని సంస్కరణలు చేపడుతున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారుప్రతి రంగంలోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారుభారతదేశ వేగం స్థిరంగాదాని దిశ స్థిరంగాదాని ఉద్దేశం ‘దేశం ప్రథమం‘  అనే ధ్యేయంతో దృఢంగా పాతుకుపోయి ఉందని ప్రధానమంత్రి ప్రముఖంగా తెలిపారు.

2025 సంవత్సరం ఇటువంటి సంస్కరణల సంవత్సరంగా నిలిచిందని ఆయన చెప్పారువీటిలో అత్యంత ముఖ్యమైనది తదుపరి తరం వస్తుసేవల పన్ను (జీఎస్టీసంస్కరణ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.ఈ సంస్కరణల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించిందని ఆయన తెలిపారుఈ సంవత్సరమే ప్రత్యక్ష పన్నుల విధానంలో కూడా ఒక ప్రధాన సంస్కరణ ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారురూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోవడం ఇందుకు ఉదాహరణ అనిదశాబ్దం క్రితం  వరకు కూడా ఇటువంటి చర్యను ఎవరూ ఊహించలేదని ఆయన స్పష్టం చేశారు.

సంస్కరణల పరంపర కొనసాగింపును ప్రస్తావిస్తూకేవలం మూడు నాలుగు రోజుల క్రితమే చిన్న కంపెనీ  నిర్వచనాన్ని సవరించినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారుదీని ఫలితంగావేలాది కంపెనీలు ఇప్పుడు సరళమైన నియమాలువేగవంతమైన ప్రక్రియలుమెరుగైన సౌకర్యాల పరిధిలోకి వచ్చాయని ఆయన చెప్పారుఅంతేకాకుండాదాదాపు 200 ఉత్పత్తి శ్రేణులను కూడా తప్పనిసరి నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల  నుంచి తొలగించినట్లు ప్రధానమంత్రి తెలిపారు.

"నేటి భారతదేశ ప్రయాణం కేవలం అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండామానసిక స్థితిలో మార్పుమానసిక పునరుజ్జీవనం దిశగా సాగుతోందిఅని ప్రధానమంత్రి తెలిపారుఆత్మవిశ్వాసం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందజాలదని ఆయన స్పష్టం చేశారుదురదృష్టవశాత్తుసుదీర్ఘ వలస పాలన,  వలస మనస్తత్వం కారణంగా భారతదేశ ఆత్మవిశ్వాసం సడలిపోయిందని ఆయన గుర్తుచేసుకున్నారు.  ఈ వలస మనస్తత్వం 'వికసిత భారత్'  లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక ప్రధాన అవరోధంగా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఅందుకే నేటి భారతం ఆ మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించాలంటేభారతీయుల ఆత్మవిశ్వాసాన్ని హరించివారిలో న్యూనతా భావాన్ని నింపాలని బ్రిటిష్ వారికి బాగా తెలుసనిఆ కాలంలో వారు అదే చేశారని శ్రీ మోదీ గుర్తుచేశారుభారతీయ కుటుంబ వ్యవస్థలను పాతబడినవిగాభారతీయ దుస్తులు వృత్తిపరమైనవి కానివిగాభారతీయ పండుగలుసంస్కృతి అసమంజసమైనవిగా ముద్రవేశారనియోగఆయుర్వేదం అశాస్త్రీయమని తిరస్కరించారనిభారతీయ ఆవిష్కరణలను పరిహసించారని ఆయన అన్నారుఈ భావనలను దశాబ్దాలుగా పదేపదే ప్రచారం చేశారనివీటినే బోధించారని,  వీటినే బలపరిచారని ఆయన చెప్పారుఇది భారతీయ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ఆయన తెలిపారు.

వలసవాద మనస్తత్వ విస్తృత ప్రభావాన్ని ప్రస్తావిస్తూదానిని ఉదాహరణలతో వివరిస్తానని శ్రీ మోదీ అన్నారునేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉందనిప్రపంచ వృద్ధికి చోదకశక్తిగాప్రపంచ శక్తి కేంద్రంగా వరుస విజయాలతో దూసుకుపోతోందని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారుభారతదేశం నేడు ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీదానిని ఎవరూ 'హిందూ వృద్ధి రేటుఅని సంబోధించడం లేదని ఆయన చెప్పారురెండుమూడు శాతం వృద్ధి రేటు కోసం భారతదేశం ఇబ్బందులు పడినప్పుడు ఈ పదాన్ని ఉపయోగించారని ఆయన గుర్తుచేశారుఒక దేశ ఆర్థిక వృద్ధిని దాని ప్రజల మతంతో లేదా గుర్తింపుతో ముడిపెట్టడం అనేది పొరపాటున జరుగుతుందా అని ప్రధానమంత్రి ప్రశ్నించారుఅలా కాకుండాఅది వలసవాద మనస్తత్వానికి ప్రతిబింబమని ఆయన స్పష్టం చేశారుమొత్తం సమాజాన్నిసంప్రదాయాన్ని ఉత్పాదకత లేకపోవడంగాపేదరికంతో సమానంగా చూశారనిభారతదేశ  మందకొడి వృద్ధికి హిందూ నాగరికతసంస్కృతే కారణమని నిరూపించే ప్రయత్నాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారుప్రతి విషయంలోనూ మతతత్వాన్ని చూసే మేధావులు అని చెప్పుకునే వారువారి కాలంలో పుస్తకాలుపరిశోధనా పత్రాల్లో భాగమైన 'హిందూ వృద్ధి రేటుఅనే పదంలో మతతత్వాన్ని చూడలేకపోవడం ఒక వైరుధ్యమని శ్రీ మోదీ అన్నారు

వలసవాద మనస్తత్వం భారతదేశ తయారీ వ్యవస్థను కూడా ధ్వంసం చేసిందని ప్రధానమంత్రి అన్నారుదేశం ఇప్పుడు దానిని పునరుద్ధరిస్తున్న తీరును ఆయన వివరించారు.వలస పాలన కాలంలో కూడా భారతదేశం ఆయుధాలుమందుగుండు సామగ్రి ఉత్పత్తిలో ప్రధాన కేంద్రంగా ఉండేదని,  బలమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నెట్‌వర్క్ ఇక్కడ ఉందనిఆయుధాలను ఎగుమతి చేస్తూవాటిని ప్రపంచ యుద్ధాలలో కూడా విస్తృతంగా ఉపయోగించారని ఆయన ప్రముఖంగా తెలిపారుస్వాతంత్ర్యం వచ్చిన తర్వాతరక్షణ తయారీ వ్యవస్థ నాశనమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారువలసవాద మనస్తత్వం వల్ల ప్రభుత్వంలో ఉన్నవారు భారతదేశంలో తయారైన ఆయుధాలను తక్కువగా అంచనా వేశారనిఇది దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ దిగుమతిదారులలో ఒకటిగా మార్చిందని పేర్కొన్నారు. .

అదే వలసవాద మనస్తత్వం శతాబ్దాలుగా భారతదేశంలో ప్రధాన కేంద్రంగా ఉన్న నౌకా నిర్మాణ పరిశ్రమను కూడా ప్రభావితం చేసిందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారుసుమారు యాభైఅరవై సంవత్సరాల క్రితం కూడా భారతదేశ వాణిజ్యంలో నలభై శాతం భారతీయ నౌకల ద్వారా జరిగేదని ఆయన గుర్తు చేశారుకానీవలసవాద మనస్తత్వం విదేశీ నౌకలకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారుదాని ఫలితం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారుఒకప్పుడు సముద్రయాన శక్తికి  పేరుగాంచిన దేశంతన వాణిజ్యంలో 95 శాతం విదేశీ నౌకలపై ఆధారపడవలసి వచ్చిందిదీని కారణంగానేడు భారతదేశం విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సంవత్సరానికి దాదాపు 75 బిలియన్ డాలర్లు (సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలుచెల్లిస్తోందని ఆయన పేర్కొన్నారు.

నౌకా నిర్మాణం అయినారక్షణ రంగ తయారీ అయినానేడు ప్రతి రంగం వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టినూతన వైభవాన్ని సాధించేందుకు కృషి చేస్తోందిఅని ప్రధానమంత్రి తెలిపారు

వలసవాద మనస్తత్వం భారతదేశ పాలనా విధానానికి తీవ్ర నష్టాన్ని కలిగించిందని శ్రీ మోదీ అన్నారుసుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ వ్యవస్థ తన ప్రజల పట్ల అవిశ్వాసంతో కూడి ఉండేదని ఆయన తెలిపారుగతంలో ప్రజలు తమ సొంత పత్రాలను కూడా ప్రభుత్వ అధికారిచేత ధృవీకరించుకోవలసి వచ్చేదని ఆయన గుర్తు చేశారుకానీఇప్పుడు ఆ అవిశ్వాసం పటాపంచలైస్వీయ ధృవీకరణ  సరిపోతోందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో చిన్న పొరపాట్లను కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణించే నిబంధనలు ఉండేవని శ్రీ మోదీ ప్రముఖంగా తెలిపారుదీనిని మార్చేందుకు 'జన్‌-విశ్వాస్ చట్టాన్నిప్రవేశపెట్టామనిదీని ద్వారా అటువంటి వందలాది నిబంధనలను నేర రహితం చేశామని ఆయన చెప్పారుగతంలోకేవలం వెయ్యి రూపాయల రుణానికి కూడాఅతి అపనమ్మకం కారణంగా బ్యాంకులు హామీలు డిమాండ్ చేసేవని ఆయన గుర్తు చేశారుఈ అవిశ్వాస  విషచక్రాన్ని ముద్రా యోజన ద్వారా ఛేదించామని తెలిపారుఈ పథకం కింద ఇప్పటివరకు 37 లక్షల కోట్ల రూపాయల విలువైన హామీ రహిత రుణాలను అందించామని ఆయన చెప్పారుఈ రుణాలు హామీ ఇవ్వడానికి ఏమీ లేని కుటుంబాల యువతలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపాయనివారు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు సామర్ధ్యాన్ని ఇచ్చాయని ఆయన తెలిపారు.

దేశంలో గతంలో ఒక విషయంపై బలమైన నమ్మకం ఉండేదని శ్రీ మోదీ గుర్తుచేశారుప్రభుత్వానికి ఏదైనా ఇచ్చిన తర్వాతఅది వన్ వే ట్రాఫిక్ లా ఉంటుందనితిరిగి ఏమీ రాదని ప్రజలు భావించేవారనిఅయితేప్రభుత్వంప్రజల మధ్య విశ్వాసం బలంగా పెరిగినప్పుడుఆ ఫలితాలు మరొక రూపంలో స్పష్టంగా కనిపిస్తాయని ఆయన ఉద్ఘాటించారుబ్యాంకుల్లో 78 వేల కోట్ల రూపాయలుభీమా కంపెనీల వద్ద 14 వేల కోట్ల రూపాయలుమ్యూచువల్ ఫండ్ కంపెనీల వద్ద వేల కోట్ల రూపాయలుఅలాగే డివిడెండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలు  ఎవరూ క్లెయిమ్ చేయకుండా  నిరుపయోగంగా ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుందని ప్రధానమంత్రి అన్నారుఈ సొమ్మంతా పేదమధ్యతరగతి కుటుంబాలకు చెందినదని ఆయన స్పష్టం చేశారుఅందుకే ఈ డబ్బును హక్కుదారులకు తిరిగి అప్పగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారుఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ప్రారంభించామని,  ఇప్పటివరకు దాదాపు 500 జిల్లాల్లో నిర్వహించిన ఈ శిబిరాల ద్వారా వేల కోట్ల రూపాయలను హక్కుదారులైన లబ్ధిదారులకు తిరిగి అందించామని ఆయన తెలిపారు.

ఇది కేవలం ఆస్తుల తిరిగి చెల్లింపు గురించి మాత్రమే కాదనివిశ్వాసం గురించి,  ప్రజల విశ్వాసాన్ని నిరంతరం సంపాదించుకునే నిబద్ధత గురించి అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారుప్రజల విశ్వాసమే దేశానికి నిజమైన మూలధనం అని శ్రీ మోదీ పేర్కొన్నారుఅటువంటి కార్యక్రమాలు  వలసవాద మనస్తత్వంతో కూడిన పాలనలో ఎన్నటికీ సాధ్యమయ్యేవి కావని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి రంగంలోనూ దేశం వలసవాద మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి పొందాలిఅని ప్రధానమంత్రి స్పష్టం చేశారుకొన్ని రోజుల క్రితమే తాను దేశానికి ఒక విజ్ఞప్తి చేశాననిప్రతి ఒక్కరూ పదేళ్ల కాలపరిమితితో కృషి చేయాలని కోరానని ఆయన తెలిపారుభారతదేశంలో మానసిక బానిసత్వ బీజాలు నాటిన మెకాలే విధానం  2035 నాటికి 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందనిఅంటే పదేళ్ల సమయం మిగిలి ఉందనిఈ పదేళ్లలోపేదేశంలోని పౌరులందరూ వలసవాద మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయాలని దీక్షబూనాలని ఆయన ఉద్ఘాటించారు.

"భారతదేశం కేవలం నిర్ణీత మార్గాన్ని అనుసరించే దేశం కాదుమెరుగైన భవిష్యత్తు కోసం తన పరిధులను తప్పక విస్తరించుకోవాలిఅని ప్రధానమంత్రి స్పష్టం చేశారుదేశ భవిష్యత్ అవసరాలను అర్థం చేసుకునివర్తమానంలోనే పరిష్కారాలను కనుగొనవలసిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.అందుకే తాను తరచుగా మేక్ ఇన్ ఇండియా,  ఆత్మనిర్భర్ భారత్ ప్రచారాల గురించి మాట్లాడతానని ఆయన ప్రముఖంగా తెలిపారుఈ రకమైన కార్యక్రమాలను నాలుగైదు దశాబ్దాల క్రితమే ప్రారంభించి ఉంటేనేడు భారతదేశ పరిస్థితి మరో విధంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు.సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఉదాహరణను శ్రీ మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారుసుమారు యాభైఅరవై సంవత్సరాల క్రితం ఒక కంపెనీ భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని,  . కానీదానికి అప్పట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని,  ఫలితంగాసెమీకండక్టర్ తయారీలో భారతదేశం వెనుకబడిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ఇంధన రంగం కూడా ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటోందనిప్రస్తుతం భారతదేశం ఏటా సుమారు 125 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్రోల్డీజిల్గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోందని ప్రధానమంత్రి తెలిపారుమన దేశానికి పుష్కలంగా సూర్యరశ్మి ఉన్నప్పటికీ, 2014 వరకు భారత సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం కేవలం మూడు గిగావాట్లు మాత్రమేనని ఆయన చెప్పారుగత పది సంవత్సరాలలో ఈ సామర్థ్యం సుమారు 130 గిగావాట్లకు పెరిగిందనిఅందులో 22 గిగావాట్లు కేవలం రూఫ్‌టాప్ సోలార్ ద్వారానే జత అయిందని ఆయన తెలిపారు

ఇంధన భద్రత కోసం చేపట్టినన్ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రచారంలో ప్రభుత్వం ప్రజలకు పౌరులకు ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కల్పించిందని ప్రధానమంత్రి తెలిపారుఈ సందర్భంగా వారణాసి పార్లమెంటు సభ్యుడిగాఆయన స్థానిక గణాంకాలను ఉదహరించారుఈ పథకం కింద వారణాసిలో 26,000 పైగా ఎక్కువ గృహాలు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నారువీటి ద్వారా ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందనిదీనివల్ల ప్రజలకు ప్రతి నెలా దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఆదా అవుతోందని ఆయన  చెప్పారుఈ సౌర విద్యుత్ ఉత్పత్తి ఏటా సుమారు తొంభై వేల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందనిలేకపోతే ఆ ప్రభావాన్ని తగ్గించడానికి నలభై లక్షలకు పైగా చెట్లను నాటవలసి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుకేవలం వారణాసి గణాంకాలను మాత్రమే అందిస్తున్నాననిఈ పథకం వల్ల కలిగే అపారమైన జాతీయ ప్రయోజనం గురించి ఆలోచించాలని ప్రజలను కోరారుకేవలం ఒకే ఒక్క కార్యక్రమం భవిష్యత్తును మార్చే శక్తిని ఎలా కలిగి ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.

2014 కంటే ముందు భారతదేశం తన మొబైల్ ఫోన్లలో 75 శాతం దిగుమతి చేసుకునేదనిఅయితే నేడు మొబైల్ ఫోన్ల దిగుమతులు దాదాపు సున్నాకు పడిపోయాయని,  దేశం ఒక ప్రధాన ఎగుమతిదారుగా మారిందని శ్రీ మోదీ ప్రముఖంగా తెలిపారు. 2014 తర్వాత ప్రవేశపెట్టిన ఒక సంస్కరణలో దేశం ఉత్తమ పనితీరును కనబరిచిందనిఆ మార్పు ఫలితాలను ప్రపంచం ఇప్పుడు చూస్తోందని ఆయన చెప్పారు.

రేపటిని మార్చే ఈ ప్రయాణం అనేక పథకాలువిధానాలునిర్ణయాలుప్రజల ఆకాంక్షలు,  ప్రజా భాగస్వామ్యంతో కూడిన ప్రయాణమని శ్రీ మోదీ స్పష్టం చేశారుఇది నిరంతరాయంగా సాగే  ప్రయాణమనిఏదో ఒక సమావేశంలో చర్చకు మాత్రమే పరిమితం కాదనిఇది భారతదేశం కోసం ఒక జాతీయ సంకల్పం అని ఆయన ఉద్ఘాటించారుఈ సంకల్పంలో ప్రతి ఒక్కరి సహకారం,   సామూహిక కృషి అవసరమని స్పష్టం చేస్తూప్రధానమంత్రి చివరిగా మరోసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు

 

***


(रिलीज़ आईडी: 2200025) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Kannada , Malayalam