ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 19 NOV 2025 6:53PM by PIB Hyderabad

నమస్కారం!

తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్రవికేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ ఎల్మురుగన్తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్కెరామస్వామివివిధ వ్యవసాయ సంస్థల నుంచి ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులుప్రజాప్రతినిధులునా ప్రియమైన రైతు సోదరీసోదరులుడిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన లక్షలాదిమంది రైతులుమీ అందరికీ వణక్కంనమస్కారంముందుగాఇక్కడ ఉన్న మీ అందరికీదేశవ్యాప్తంగా ఉన్న నా రైతు సొదరీసోదరులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానునేను ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు ఒక గంట ఆలస్యం అయ్యిందిఎందుకంటే ఈ రోజు ఉదయం నేను సత్య సాయిబాబాకు అంకితం చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తిలో ఉన్నానుఅక్కడ ఆ కార్యక్రమం ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం కొనసాగిందిఅందుకేనేను రావడానికి ఆలస్యం అయ్యిందిదీనివల్ల మీకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలిదేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్నారనే విషయం నాకు తెలుసుఅందుకే వినయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను

నేను పాండియన్ గారి ప్రసంగం వింటున్నప్పుడు…చిన్నప్పుడే ఎవరైనా నాకు తమిళం నేర్పించి ఉంటే బాగుండేదనీఅప్పుడు నేను ఆయన ప్రసంగాన్ని మరింత ఆస్వాదించేవాడిననీ అనిపించిందికానీ నాకు ఆ అదృష్టం దక్కలేదుఅయినానేను అర్థం చేసుకోగలిగినంత వరకుఆయన జల్లికట్టు గురించికోవిడ్ కాలంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడినట్టు నేను గ్రహించానుపాండియన్ గారి ప్రసంగాన్ని హిందీఆంగ్ల భాషల్లోకి అనువదించి పంపమని నేను రవి గారిని కోరానునేను దానిని చదవాలని అనుకుంటున్నానునేను ఆయన భావోద్వేగాన్ని పూర్తిగా గ్రహించగలిగానుఅది నాకు చాలా ప్రత్యేకమైన క్షణంనేను ఇక్కడ వేదికపైకి వచ్చినప్పుడుచాలా మంది రైతు సోదరీసోదరులు వారి మెడలోని కండువాలను ఊపుతూ ఉండటం గమనించానునేను ఇక్కడికి చేరుకోకముందే బీహార్ గాలి ఇక్కడికి చేరినట్లు అనిపించింది.

నా ప్రియమైన రైతు సోదరీసోదరులారా,

కోయంబత్తూరు పవిత్ర భూమిపైముందుగా నేను మరుధామలైలోని మురుగన్ దేవునికి నమస్కరిస్తున్నానుకోయంబత్తూరు సంస్కృతికరుణసృజనాత్మకతకు నిలయంఈ నగరం దక్షిణ భారతదేశ పారిశ్రామిక శక్తికి కేంద్రంగా ఉందిఇక్కడి వస్త్ర పరిశ్రమ మన దేశ ఆర్థికవ్యవస్థకు ఎంతగానో తోడ్పడుతోందిఇప్పుడుకోయంబత్తూరు మరింత ప్రత్యేకంగా మారిందిఎందుకంటే దీని మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సి.పిరాధాకృష్ణన్ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా మనందరికీ మార్గనిర్దేశం చేస్తున్నారు.

మిత్రులారా

ప్రకృతి వ్యవసాయం నా హృదయానికి చాలా దగ్గరైన అంశంఈ అద్భుతమైన దక్షిణ భారతదేశ ప్రకృతి వ్యవసాయ సదస్సును నిర్వహిస్తున్నందుకు తమిళనాడులోని రైతు సోదరీసోదరులందరినీ నేను అభినందిస్తున్నానుఇప్పుడే ప్రదర్శనను సందర్శించే అవకాశం నాకు లభించిందిచాలామంది రైతులతో కూడా మాట్లాడానుకొంతమంది మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిపీహెచ్‌డీలు చేసిఆ తర్వాత వ్యవసాయాన్ని ఎంచుకున్నారుమరికొంతమంది నాసాలో చంద్రయాన్‌కు సంబంధించిన ప్రతిష్ఠాత్మకమైన పనిని వదిలిపెట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారువారు కేవలం సొంతంగా సాగు చేయడమే కాకుండాఅనేకమంది ఇతర రైతులకుయువతకు శిక్షణ కూడా ఇస్తున్నారుఈ రోజునేను బహిరంగంగా ఒక విషయం అంగీకరించాలినేను ఈ కార్యక్రమానికి రాకపోయి ఉంటేనా జీవితంలో చాలా ముఖ్యమైన దాన్ని కోల్పోయి ఉండేవాడినిఈ రోజు నేను ఇక్కడ చాలా నేర్చుకున్నానుతమిళనాడు రైతుల ధైర్యానికిమార్పును స్వీకరించే వారి బలానికి నేను మనస్ఫూర్తిగా వందనం చేస్తున్నానుఇక్కడరైతు సొదరీసోదరులు వ్యవసాయ శాస్త్రవేత్తలుపరిశ్రమ భాగస్వాములుస్టార్టప్‌లుఆవిష్కర్తలు అందరూ ఒకే చోటకు వచ్చారుమీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

మిత్రులారా

రాబోయే సంవత్సరాల్లో భారతీయ వ్యవసాయంలో అనేక పెద్ద మార్పులు చోటుచేసుకోవడాన్ని నేను చూస్తున్నానుప్రకృతి వ్యవసాయానికి ప్రపంచ కేంద్రంగా మారే దిశగా భారత్ పయనిస్తోందిమన జీవవైవిధ్యం కొత్త రూపాన్ని సంతరించుకుంటోందిదేశంలోని యువత ఇప్పుడు వ్యవసాయాన్ని ఆధునికమైనవిస్తరించదగిన అవకాశంగా చూస్తున్నారుఇది మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అపారమైన శక్తిని ఇవ్వబోతోంది.

నా రైతు సోదరీసోదరులారా,

గత 11 సంవత్సరాలలోదేశంలోని మొత్తం వ్యవసాయ రంగం ఒక పెద్ద మార్పునకు లోనైందిమన వ్యవసాయ ఎగుమతులు దాదాపుగా రెట్టింపు అయ్యాయివ్యవసాయాన్ని ఆధునికీకరించడానికి రైతులకు ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని కల్పించిందికిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఒక్క సంవత్సరంలోనే రైతులకు రూ.10 లక్షల కోట్ల పైగా సహాయం అందిందిరూ.10 లక్షల కోట్ల మొత్తం చిన్న మొత్తం ఎంతమాత్రం కాదుఏడు సంవత్సరాల కిందట పశుపోషణ రైతులనుమత్స్యకారులను కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం లో చేర్చిన తర్వాతవారు కూడా దీని ద్వారా ఎంతగానో లబ్ధి పొందారుజీవ ఎరువులపై జీఎస్టీని తగ్గించడం కూడా రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించింది.

మిత్రులారా

కొద్దిసేపటి కిందటదేశ రైతులకు సంబంధించిన పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడతను ఇక్కడి నుంచే విడుదల చేశాందేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 18,000 కోట్లు జమ అయ్యాయిఇక్కడ తమిళనాడులో కూడా లక్షలాది మంది రైతులకు పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద డబ్బు అందింది.

మిత్రులారా

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటివరకు రూ. 4 లక్షల కోట్లు నేరుగా బదిలీ అయ్యాయిఈ మొత్తం రైతులకు వ్యవసాయానికి సంబంధించిన వివిధ అవసరాలను తీర్చడానికి సహాయపడిందిఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కోట్ల మంది రైతు సోదరీసోదరులకు నా హృదయపూర్వక అభినందనలువెనుక వైపున ఇద్దరు బాలికలు చాలాసేపటి నుంచి ప్లకార్డులు పట్టుకొని నిలబడి ఉన్నారువారి చేతులు అలసిపోతాయిభద్రతా సిబ్బంది ఆ ప్లకార్డులను వారి నుంచి తీసుకుని నాకు అందించాలని కోరుతున్నానువారి సందేశం ఏదైనా సరేనేను దాని పట్ల శ్రద్ధ పెడతానుదయచేసి వాటిని తెచ్చి నాకివ్వండి.

ధన్యవాదాలుఅమ్మాయీఇంతసేపు నీ చేయిని పైకెత్తి నిలబడి ఉన్నావు.

మిత్రులారా

ప్రకృతి వ్యవసాయం విస్తరణ 21వ శతాబ్దపు వ్యవసాయానికి అవసరంసంవత్సరాలుగాపెరుగుతున్న డిమాండ్ కారణంగా పొలాల్లోవ్యవసాయ సంబంధిత అనేక రంగాలలో రసాయనాల వినియోగం వేగంగా పెరిగిందిరసాయన ఎరువులుపురుగుమందుల అధిక వినియోగం కారణంగా భూసారం తగ్గిపోతోందినేలలోని తేమ దెబ్బతింటోందివీటన్నింటితో పాటు ప్రతి సంవత్సరం వ్యవసాయ ఖర్చు పెరుగుతూనే ఉందిదీనికి పరిష్కారం పంటల వైవిధ్యంప్రకృతి వ్యవసాయంలోనే ఉంది.

మిత్రులారా

మన భూసారాన్నిపంటల పోషక విలువను పునరుద్ధరించడానికి మనం ప్రకృతి వ్యవసాయం మార్గంలో ముందుకు సాగాలిఇది అవసరం కూడాఅప్పుడే మనం మన జీవవైవిధ్యాన్ని భవిష్యత్తు తరాల కోసం కాపాడగలుగుతాంప్రకృతి వ్యవసాయం వాతావరణ పరిస్థితులలోని మార్పులను ఎదుర్కోవడానికి సహాయపడుతుందిఇది మన నేలను ఆరోగ్యంగా ఉంచుతుందిహానికరమైన రసాయనాల నుంచి ప్రజలను రక్షిస్తుందినేటి ఈ కార్యక్రమం ఈ దిశగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది.

మిత్రులారా

ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేందుకు మా ప్రభుత్వం దేశంలోని రైతులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోందిసంవత్సరం కిందటే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ను ప్రారంభించిందిఇప్పటికే లక్షలాది మంది రైతులు ఇందులో చేరారుదీని సానుకూల ప్రభావం ముఖ్యంగా దక్షిణ భారతదేశం అంతటా కనిపిస్తోందిఇక్కడ తమిళనాడులోనే దాదాపు 35,000 హెక్టార్ల భూమి సేంద్రీయప్రకృతి వ్యవసాయం కింద ఉంది.

మిత్రులారా

ప్రకృతి వ్యవసాయం భారతదేశ దేశీయ భావనమనం దీనిని ఎక్కడ నుంచీ దిగుమతి చేసుకోలేదుఇది మన సొంత సంప్రదాయాల నుంచి నుండి ఉద్భవించిందిమన పూర్వీకులు దీనిని గొప్ప నిబద్ధతతో అభివృద్ధి చేశారుఇది మన పర్యావరణానికి పూర్తిగా సరిపోతుందిదక్షిణ భారతదేశంలోని రైతులు పంచగవ్యజీవామృతంబీజామృతంఆచ్చాదన వంటి సాంప్రదాయ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఇప్పటికీ అనుసరిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నానుఈ పద్ధతులు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయిపంటలను రసాయన రహితంగా ఉంచుతాయిసాగు ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి.

మిత్రులారా

ప్రకృతి వ్యవసాయాన్ని మనం శ్రీ అన్న చిరుధాన్యాల సాగుతో కలిపినప్పుడుఅది భూమి తల్లిని రక్షించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందితమిళనాడులోమురుగన్ దేవుడికి కూడా తేనుం తినై మావుం (తేనెచిరుధాన్యాల పిండితో చేసిన పవిత్ర నైవేద్యంసమర్పిస్తారుతమిళ ప్రాంతాలలో కంబు (సజ్జలు), సామై (సామలు), కేరళకర్ణాటకలో రాగితెలుగు మాట్లాడే రాష్ట్రాలలో సజ్జజొన్న మరికొన్ని ఆహారంలో భాగమై ఉన్నాయిఈ సూపర్ ఫుడ్ ప్రపంచ మార్కెట్లకు చేరుకునేలా చూడటానికి మా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందివాటికి ప్రపంచ ఆమోదాన్ని పెంచడంలో ప్రకృతి వ్యవసాయంరసాయన రహిత వ్యవసాయం ప్రధాన పాత్ర పోషించబోతున్నాయిఅందువల్లఈ అంశానికి సంబంధించిన ప్రయత్నాల గురించి ఈ సదస్సులో కచ్చితంగా చర్చిస్తారని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా

ఒకే పంట సాగుకు బదులుగా బహుళ పంటల వ్యవసాయాన్ని నేను ఎప్పుడూ ప్రోత్సహిస్తానుదీనికి సంబంధించి దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి మనం గొప్ప స్ఫూర్తిని పొందుతాంకేరళ లేదా కర్ణాటకలోని కొండ ప్రాంతాలకు వెడితే బహుళ అంచెల వ్యవసాయం ఉదాహరణలను చూడవచ్చుఒకే పొలంలో కొబ్బరి చెట్లుపోక (వక్కచెట్లుపండ్ల మొక్కలు ఉంటాయిదీని అర్థంసరైన ప్రణాళికతో చిన్న విస్తీర్ణంలో బహుళ పంటలను పండించవచ్చుఇదే ప్రకృతి వ్యవసాయం ప్రాథమిక సిద్ధాంతంమనం ఈ వ్యవసాయ నమూనాను అఖిల భారత స్థాయికి తీసుకువెళ్లాలిదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పద్ధతులను ఎలా అమలు చేయవచ్చో పరిశీలించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతున్నాను.

మిత్రులారా

దక్షిణ భారతదేశం వ్యవసాయానికి ఒక సజీవ విశ్వవిద్యాలయంగా ఉందిప్రపంచంలోనే అత్యంత పురాతనమైనఇప్పటికీ పనిచేస్తున్న ఆనకట్టలు ఈ ప్రాంతంలో ఉన్నాయికళింగరాయన్ కాలువను ఇక్కడ 13వ శతాబ్దంలో నిర్మించారుఇక్కడి ఆలయ కోనేరులు వికేంద్రీకృత నీటి సంరక్షణ వ్యవస్థలకు ఆదర్శంగా నిలిచాయినదీ జలాలను నియంత్రించివాటిని వ్యవసాయానికి ఉపయోగించే శాస్త్రీయ నమూనాను ఈ నేల అభివృద్ధి చేసిందివేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం అధునాతన నీటి ఇంజనీరింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించిందిఅందువల్లదేశానికిప్రపంచానికి కూడా ప్రకృతి వ్యవసాయంలో నాయకత్వం ఈ ప్రాంతం నుంచే ఉద్భవిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.

మిత్రులారా

'వికసిత భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశంకోసం భవిష్యత్ సుస్థిర వ్యవసాయ వ్యవస్థను నిర్మించడానికి మనమందరం కలిసి పనిచేయాలిఒక సీజన్‌లో ఒక ఎకరంతో ప్రకృతి సేద్యం ప్రారంభించాలని దేశవ్యాప్తంగా ఉన్న నా రైతు సోదరీసోదరులనుముఖ్యంగా తమిళనాడులోని నా రైతు మిత్రులను నేను కోరుతున్నానుఅంటేఒక సీజన్‌లో కేవలం ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రయత్నించండిమీ పొలంలో ఒక మూలను ఎంచుకునిప్రయోగం చేయండిదాని ఫలితాల ఆధారంగావచ్చే సంవత్సరం దానిని విస్తరించండిమూడో సంవత్సరం మరింత విస్తరించండిఅలా ముందుకు సాగండిప్రకృతి వ్యవసాయాన్ని వ్యవసాయ పాఠ్యాంశాలలో ఒక ముఖ్యమైన భాగంగా చేయాలని శాస్త్రవేత్తలుపరిశోధనా సంస్థలను కూడా కోరుతున్నాగ్రామాలకు వెళ్ళండిరైతుల పొలాలను మీ ప్రయోగశాలలుగా చేసుకోండిమనం ప్రకృతి వ్యవసాయాన్ని సైన్సు ఆధారిత ఉద్యమంగా మార్చాలిప్రకృతి వ్యవసాయం కోసం ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వాలురైతు ఉత్పత్తిదారుల సంస్థల పాత్ర చాలా ముఖ్యమైనదిగత కొన్ని సంవత్సరాలలోదేశంలో 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పీఓఏర్పడ్డాయిఎఫ్ పీఓల సహాయంతోమనం రైతుల చిన్న సమూహాలను సృష్టించవచ్చుమనం స్థానికంగా శుభ్రపరచడంప్యాకేజింగ్ప్రాసెసింగ్ సదుపాయాలను అందించాలివాటిని ఈ-నామ్ వంటి ఆన్‌లైన్ మార్కెట్లకు నేరుగా అనుసంధానించాలిఇది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కలిగే ప్రయోజనాలను గణనీయంగా పెంచుతుందిమన రైతుల సాంప్రదాయ పరిజ్ఞానంసైన్సు సామర్ధ్యంప్రభుత్వ మద్దతు కలిస్తే మన రైతులకు సౌభాగ్యం తో పాటు మన నేలతల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

మిత్రులారా

ఈ సదస్సుప్రత్యేకించి మన రైతు సోదరీసోదరులు చూపించిన నాయకత్వం దేశంలో ప్రకృతి వ్యవసాయానికి ఒక నూతన దిశానిర్దేశం చేస్తుందని నేను నమ్ముతున్నానుఇక్కడి నుంచి కొత్త ఆలోచనలుకొత్త పరిష్కారాలు రావాలిఈ నమ్మకంతో మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలుచాలా ధన్యవాదాలు!

నాతో కలసి చెప్పండి:

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

ధన్యవాదాలు

 

***


(Release ID: 2192042) Visitor Counter : 9