ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు- 2025 ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 19 NOV 2025 10:42PM by PIB Hyderabad

తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025 ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో వేర్వేరు పోస్టుల్లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఎప్పటిలాగేకోయంబత్తూరులో నాకు లభించిన స్వాగతం ఎంతో ప్రత్యేకమైనదిశక్తిమంతమైన ఈ నగర ప్రజల ప్రేమానురాగాలుఆప్యాయతఆశీస్సులు నాకు అపురూపమైనవి"

"గడిచిన 11 ఏళ్లలో భారత వ్యవసాయ రంగంలో వచ్చిన అతిపెద్ద మార్పు ఏమిటంటే.. వ్యవసాయ రంగంలో యువత ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవటంఈ పరివర్తనలో సేంద్రియ వ్యవసాయానిది కీలక పాత్ర"

"కేవలం ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉంది"

"తమిళనాడుతో పాటు దక్షిణ భారత రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారువారి ప్రయత్నాలు యావద్దేశానికి స్ఫూర్తిదాయకం"

"ప్రకృతి వ్యవసాయం శాస్త్రీయ ఆధారిత ఉద్యమంగా మారేందుకు మనమంతా కృషి చేయాలిఇందుకోసం నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను"

"కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు2025 ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమంప్రకృతి వ్యవసాయంపై చర్చలనుమేలైన పద్ధతులను పంచుకోవటాన్ని ఇది ప్రోత్సహిస్తోందిఈ రంగంలో రైతులు చేస్తున్న వినూత్న ప్రయత్నాలు చూడటం ఆనందంగా ఉంది

 

***


(Release ID: 2191966) Visitor Counter : 9