మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక జాతీయ గోపాల్ రత్న పురస్కారాల ప్రకటన


ఈ నెల 26న జాతీయ పాల దినోత్సవ కార్యక్రమాల్లో సత్కారం

అత్యుత్తమ - పాడి రైతు, పాడి సహకార సంఘం, ఎఫ్‌పీసీ, ఎంపీసీలకు అవార్డులు

మొదటి బహుమతి విజేతకు రూ.5 లక్షలు

Posted On: 17 NOV 2025 1:17PM by PIB Hyderabad

జాతీయ గోపాల్ రత్న అవార్డులు (ఎన్‌జీఆర్ఏ)- 2025 విజేతల పేర్లను మత్స్యపశు సంవర్ధకపాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలో భాగమైన పశు సంవర్ధకపాడి విభాగం ప్రకటించిందిపశుగణంపాడి రంగంలో అత్యున్నత జాతీయ స్థాయి పురస్కారాల్లో ఎన్‌జీఆర్ఏ ఒకటిఈ అవార్డులను మత్స్యపశు సంవర్ధకపాడి పరిశ్రమ శాఖ (ఎంఓఎఫ్ఏహెచ్‌డీకేంద్ర మంత్రిపంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ప్రదానం చేస్తారుఅవార్డుల ప్రదాన కార్యక్రమంలో సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పిసింగ్ బఘెల్‌తో పాటు శ్రీ జార్జి కురియన్ కూడా పాల్గొంటారుఈ పురస్కారాలను ఈ నెల 26న జాతీయ పాల దినోత్సవాల్లో భాగంగా అందిస్తారు. ఈ సంవత్సరం మొత్తం 2,081 దరఖాస్తులు వచ్చాయివాటిలో నుంచి పురస్కార విజేతలను ఎంపిక చేశారు.

ప్రతి కేటగిరీలో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి:

క్రమ సంఖ్య

కేటగిరీ

ర్యాంకు సహా ఎన్‌జీఆర్ఏ-2025 విజేతలు

 

 

 

1.

దేశవాళీ పశువులుఎద్దు జాతులను పెంచుతున్న అత్యుత్తమ పాడి రైతు

ఈశాన్య ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల వారు:

1వ ర్యాంకు శ్రీ అరవింద్ యశ్వంత్ పాటిల్కొల్హాపూర్మహారాష్ట్ర.

2వ ర్యాంకు డాక్టర్ కంకణాల కృష్ణారెడ్డిహైదరాబాద్తెలంగాణ.

3వ ర్యాంకు శ్రీ హర్షిత్ ఝురియాసీకర్రాజస్థాన్.

3వ ర్యాంకుకుమారి శ్రద్ధ సత్యవాన్ ధవన్అహ్మద్‌నగర్మహారాష్ట్ర.


 

ఈశాన్య ప్రాంతాల వారుహిమాలయ ప్రాంతాల వారు

  • శ్రీమతి విజయ్ లతహమీర్‌పూర్హిమాచల్ ప్రదేశ్.

  • శ్రీ ప్రదీప్ పాన్‌గరియాచంపావత్ఉత్తరాఖండ్.

2.

ఉత్తమ పాడి సహకార సంఘంపాల ఉత్పత్తిదారు వాణిజ్య సంస్థడెయిరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్

ఈశాన్య ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల వారు:

1వ ర్యాంకు మీనన్ గాడి క్షీరోత్పాదక సహకార సంఘంవయనాడ్కేరళ.

2వ ర్యాంకు కున్నంకాట్టుపతి క్షీరోత్పాదక సహకార సంఘంపాలక్కడ్కేరళ.

2వ ర్యాంకు ఘినోయి దుగ్ధ్ ఉత్పాదక సహకార సమితిజైపూర్రాజస్థాన్.

3వ ర్యాంకు టీవైఎస్‌పీఎల్ 37 సెందూరై మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీఅరియలూర్తమిళనాడు 

ఈశాన్య ప్రాంతాల వారుహిమాలయ ప్రాంతాల వారు:

  • కుల్హా దూద్ ఉత్పాదక్ సహకార సమితిఉధాం సింగ్ నగర్ఉత్తరాఖండ్.

3.

 

 

కృత్రిమ గర్భధారణ ప్రక్రియఅత్యుత్తమ నిపుణుడు

ఈశాన్య ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల వారు:

1వ ర్యాంకు శ్రీ దిలీప్ కుమార్ ప్రధాన్అనుగుల్ఒడిశా.

2వ ర్యాంకు వికాస్ కుమార్హనుమాన్‌గఢ్రాజస్థాన్.

3వ ర్యాంకు శ్రీమతి అనురాధ చాకలినంద్యాలఆంధ్రప్రదేశ్.


 

ఈశాన్య ప్రాంతాల వారుహిమాలయ ప్రాంతాల వారు:

  • శ్రీ దిలువార్ హసన్బార్పేటఅస్సాం.

 

ఎన్‌జీఆర్ఏ-2025లో మొదటి రెండు కేటగిరీలు... అత్యుత్తమ పాడి రైతుఅత్యుత్తమ డీసీఎస్లేదా ఎఫ్‌పీఓలేదా ఎంపీసీకి.. ప్రశంస పత్రాన్నీజ్ఞాపికనీనగదు బహుమతినీ ఈ కింద పేర్కొన్న విధంగా అందజేస్తారు:

  • ఒకటో ర్యాంకుకు రూ.5 లక్షలు

  • రెండో ర్యాంకుకు రూ.3 లక్షలు

  • మూడో ర్యాంకుకు రూ.2 లక్షలు

  • ఈశాన్య ప్రాంతం (ఎన్ఈఆర్లేదా హిమాలయ ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక అవార్డుగా రూ.2 లక్షలు.

  • కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో అత్యుత్తమ నిపుణుల కేటగిరీలో జాతీయ గోపాల్ రత్న పురస్కారం-2025 కింద ఒక ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను ఇస్తారుఈ కేటగిరీలో నగదు బహుమతిని ఇవ్వరు.

నేపథ్యం

రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎం)ను 2014 డిసెంబరులో ప్రారంభించారుదీనిలో భాగంగా దేశవాళీ గోజాతుల శాస్త్రీయ సంరక్షణఅభివృద్ధి ప్రక్రియలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారుపాల ఉత్పత్తిని చేపడుతున్న రైతులనూపాడి సహకార సంఘాలనూఎంపీసీలనూఎఫ్‌పీఓలతో పాటు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన నిపుణులనూ ప్రోత్సహించడానికి ఏటా జాతీయ గోపాల్ రత్న పురస్కారాలను (ఎన్‌జీఆర్ఏ) 2021 నుంచీ బహూకరిస్తున్నారు.

 

***


(Release ID: 2191028) Visitor Counter : 5