మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సుకు సౌదీ అరేబియాలోని మదీనా దగ్గర నిన్న రాత్రి ప్రమాదం...

24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమును ఏర్పాటు చేసిన

జెడ్డాలోని భారత దౌత్య కార్యాలయం

దౌత్యాధికారులతో మాట్లాడుతున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ ప్రకటన

బాధితులకు అవసరమైన సహాయం… పూర్తి వివరాల సేకరణ: మంత్రి

Posted On: 17 NOV 2025 12:30PM by PIB Hyderabad

ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు నిన్న రాత్రి సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైందిఈ నేపథ్యంలో 24 గంటలూ పనిచేసే ఒక కంట్రోల్ రూమును జెడ్డాలోని భారత దౌత్య కార్యాలయంలో ఏర్పాటు చేశారుఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలుపార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారుబాధితులు ఈ కష్టకాలంలో మనోనిబ్బరంతో ఉండాలని ఆయన ప్రార్థించారు.
అవసరమైన వారు ఈ కింది నంబర్లను సంప్రదించవచ్చు:

8002440003 (టోల్ ఫ్రీ),
00966122614093, 00966126614276
00966556122301 (
వాట్సాప్).

ప్రమాదంపై మరిన్ని వివరాలను సేకరించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలను తీసుకుంటున్నామనీమన రాయబారి కార్యాలయం ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి శ్రీ రిజిజూ తెలిపారుసౌదీ హజ్ఉమ్రా మంత్రిత్వ శాఖతోనూఇతర స్థానిక అధికారులతోనూ రియాద్ లోని రాయబార కార్యాలయంజెడ్డాలోని దౌత్య కార్యాలయం సంప్రదిస్తున్నాయివివిధ ఆసుపత్రుల్లోనూసంబంధిత ప్రదేశాల్లోనూ భారతీయ సమాజ సేవకులుదౌత్య సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
రియాద్ లోని రాయబార కార్యాలయంజెడ్డాలోని దౌత్య కార్యాలయం అన్ని రకాల సహాయాన్నీ అందిస్తున్నాయిసంబంధిత కుటుంబాలతో సమన్వయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో భారత రాయబారదౌత్య కార్యాలయాల అధికారులు మాట్లాడుతున్నారు.

 

***


(Release ID: 2191024) Visitor Counter : 2